News July 3, 2024
పవిత్రమైన ఆశయంతో అమరావతిని ప్రారంభించాం: CM చంద్రబాబు

AP: అమరావతి నిర్మాణాన్ని ఓ పవిత్రమైన ఆశయంతో ప్రారంభించామని సీఎం చంద్రబాబు అన్నారు. ‘ల్యాండ్ ఇవ్వడానికి జనం ముందుకొచ్చారు. కానీ వారికి డబ్బులెలా ఇవ్వాలి? అప్పుడే ల్యాండ్ పూలింగ్ ఐడియా వచ్చింది. అమరావతి ప్రపంచంలోనే అతి పెద్ద ల్యాండ్ పూలింగ్. ప్రపంచ బ్యాంకు దీన్ని ఓ కేస్ స్టడీగా ప్రజెంట్ చేసింది. భూములు ఇచ్చిన రైతులకు ఏడాది రూ. 10వేలు ఇవ్వాలని నిర్ణయించాం’ అని గుర్తుచేసుకున్నారు.
Similar News
News February 6, 2025
పడుకునే ముందు ఈ పనులు చేస్తే..

రాత్రి పడుకునే ముందు కొన్ని పనులు చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. పడుకునే ముందు వ్యాయామం చేయడం మానుకోవాలి. దీని వల్ల శరీరం ఉత్తేజితమై నిద్రకు ఆటంకం కలుగుతుంది. కాఫీ, చాక్లెట్లు తినకూడదు. వీటిలో ఉండే కెఫీన్ నిద్రలేమిని కలిగిస్తుంది. నిద్రించేముందు ఆల్కహాల్ తీసుకోకూడదు. అలాగే నీరు కూడా ఎక్కువగా తాగకూడదు. రాత్రి వేళల్లో స్మార్ట్ ఫోన్కు దూరంగా ఉండాలి. పడుకునే ముందు ఫోన్ను వేరే గదిలో ఉంచడం బెటర్.
News February 6, 2025
కోహ్లీ గాయం శ్రేయస్కు వరమైంది!

కోహ్లీ గాయపడటం వల్లే ENGతో తొలి వన్డేలో తనకు ఆడే అవకాశం వచ్చిందని శ్రేయస్ అయ్యర్ తెలిపారు. ‘మ్యాచులో ఆడట్లేదని తెలిసి నిన్న రాత్రి సినిమా చూద్దామని అనుకున్నా. అప్పుడే కెప్టెన్ నుంచి కాల్ వచ్చింది. కోహ్లీ మోకాలికి గాయమైందని, అతని స్థానంలో ఆడేందుకు సిద్ధంగా ఉండమని చెప్పారు. అందుకే తొందరగా నిద్రపోయా’ అని మ్యాచ్ అనంతరం వెల్లడించారు. ఈ మ్యాచులో శ్రేయస్ 36 బంతుల్లో 59 రన్స్ చేసిన సంగతి తెలిసిందే.
News February 6, 2025
కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్ భేటీ

TG: ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో ఢిల్లీలో సీఎం రేవంత్ భేటీ అయ్యారు. సీఎంతోపాటు డిప్యూటీ సీఎం భట్టి, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, పార్టీ రాష్ట్రవ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీ, ఎంపీలు కూడా వేణును కలిశారు. కులగణన, ఎస్సీ వర్గీకరణ, పీసీసీ పనితీరు, మంత్రివర్గ విస్తరణ, స్థానిక సంస్థల ఎన్నికల గురించి ఆయనతో చర్చిస్తున్నట్లు సమాచారం.