News April 12, 2024

ఉద్యోగుల వయో పరిమితిపై ప్రభుత్వ వర్గాల క్లారిటీ

image

TG: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వయో పరిమితిని ’61 ఏళ్లు లేదా 33 ఏళ్ల సర్వీసు’కు కుదించారంటూ వస్తున్న వార్తలపై అధికార వర్గాలు స్పందించాయి. ‘ఈ వార్తల్లో నిజం లేదు. ఈ అంశంపై ప్రభుత్వ స్థాయిలో ఏ విధమైన ప్రతిపాదన కానీ, ఫైల్ కానీ రాలేదు. ఈ విధమైన ఊహాజనిత వార్తలు రాయడం, సోషల్ మీడియాలో ప్రసారం చేయడం సరైంది కాదు. ఇలాంటి అవాస్తవాలపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటాం’ అని హెచ్చరించాయి.

News April 12, 2024

జగన్ హంతకులను కాపాడుతున్నారు: షర్మిల

image

AP: జగన్ జైలుకు వెళ్తే 3200KM తాను పాదయాత్ర చేశానని షర్మిల వెల్లడించారు. పులివెందుల పూల అంగళ్లు సెంటర్‌లో కాంగ్రెస్ న్యాయయాత్రలో మాట్లాడిన ఆమె.. ‘రాముడికి లక్ష్మణుడు ఎలాగో.. వైఎస్‌కు వివేకా అలాగే. అలాంటి నేతను చంపితే ఐదేళ్లయినా న్యాయం జరగలేదు. అధికారం ఉపయోగించి జగన్ హంతకులను కాపాడుతున్నారు. CBI సాక్ష్యాధారాలు బయటపెట్టింది. నేను ఎవరికీ భయపడను. పులి కడుపున పులే పుడుతుంది.’ అని స్పష్టం చేశారు.

News April 12, 2024

టీసీఎస్ గుడ్‌న్యూస్.. వారికి డబుల్ ఇంక్రిమెంట్

image

దేశీయ అతిపెద్ద ఐటీ కంపెనీ TCS లాభాలతో ఫుల్ జోష్‌లో ఉంది. గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో 9.1% వృద్ధితో రూ.12,434 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. మొత్తం ఆర్థిక సంవత్సరం(2023-24)లో రూ.45,908 కోట్ల లాభాన్ని ఆర్జించింది. ఈ మేరకు మెరుగైన పనితీరు కనబర్చిన ఉద్యోగులకు డబుల్ ఇంక్రిమెంట్ ఇస్తామని కంపెనీ చీఫ్ హెచ్‌ఆర్ మిలింద్ లక్కడ్ తెలిపారు. కాగా ప్రస్తుతం TCSలో 6.01లక్షల మంది పని చేస్తున్నారు.

News April 12, 2024

రిటైర్మెంట్ ఆలోచన లేదు: రోహిత్ శర్మ

image

తనకు రిటైర్మెంట్ ఆలోచన లేదని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపారు. ‘ప్రస్తుతం నా ప్రదర్శన బాగానే ఉంది. మరికొన్నేళ్లు ఆటలో కొనసాగుతా. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ (2025)లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించి జట్టును గెలిపించాలి. అలాగే మరో వరల్డ్ కప్ సాధించాలి. ఆ రెండూ నెరవేరుతాయని ఆశిస్తున్నా’ అని బ్రేక్ ఫాస్ట్ విత్ ఛాంపియన్స్ కార్యక్రమంలో హిట్‌మ్యాన్ చెప్పారు.

News April 12, 2024

ఇరాన్, ఇజ్రాయెల్‌కు ఇండియన్స్ వెళ్లొద్దు: విదేశాంగశాఖ

image

ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారతీయులకు విదేశాంగ శాఖ కీలక సూచనలు చేసింది. ‘తదుపరి సమాచారం ఇచ్చేవరకు ఆ దేశాలకు భారతీయులెవరూ ప్రయాణించొద్దు. ఇప్పటికే అక్కడ ఉన్నవారు ఇండియన్ ఎంబసీతో టచ్‌లో ఉండాలి. తమ పేర్లను అక్కడ రిజిస్టర్ చేసుకోవాలి’ అని కోరింది. ఇటీవల సిరియాలోని ఇరాన్ కాన్సూలేట్‌పై ఇజ్రాయెల్ వైమానికి దాడి చేసిన విషయం తెలిసిందే.

News April 12, 2024

చంద్రబాబు 2014లో ఈ హామీలు అమలు చేశారా?: సీఎం జగన్

image

AP: 2014 ఎన్నికల్లోనూ చంద్రబాబు, దత్తపుత్రుడు, మోదీ అనేక హామీలిచ్చి మోసం చేశారని సీఎం జగన్ విమర్శించారు. ‘చంద్రబాబు రూ.87 వేల కోట్ల రుణమాఫీ చేశారా? పొదుపు సంఘాల రుణాలు రూ.14,200 కోట్లు మాఫీ చేశారా? ఆడ బిడ్డల పేరిట రూ.25వేలు బ్యాంకులో జమ చేశారా? ఇంటింటికీ ఓ ఉద్యోగం.. లేదంటే రూ.2000 చొప్పున నిరుద్యోగ భృతి ఇచ్చారా? పేదలకు ఒక్క సెంటు స్థలమైనా ఇచ్చారా?’ అని ప్రశ్నించారు.

News April 12, 2024

ఇంటర్ RESULTS.. కీలక అప్‌డేట్

image

AP: ఇవాళ ఇంటర్ ఫలితాలు విడుదల కాగా.. ప్రాక్టికల్స్ ఫెయిల్ అయిన వారికి బోర్డు కీలక ప్రకటన చేసింది. ప్రాక్టికల్ పరీక్షలు మే 1 నుంచి 4వ తేదీ వరకు జిల్లా కేంద్రాల్లో మాత్రమే నిర్వహిస్తామని వెల్లడించింది. థియరీ పరీక్షలు మే 24 నుంచి జూన్ 1 వరకు రెండు షిఫ్టుల్లో నిర్వహిస్తారు. మార్కులు తక్కువ వచ్చిన విద్యార్థులు ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలు కూడా రాసుకోవచ్చని పేర్కొంది.

News April 12, 2024

టాస్ గెలిచిన లక్నో..

image

ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతోన్న ఐపీఎల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటింగ్ ఎంచుకుంది.
లక్నో: డికాక్, KL రాహుల్, పడిక్కల్, స్టోయినిస్, పూరన్, ఆయుష్ బదోని, కృనాల్ పాండ్యా, అర్షద్ ఖాన్, రవి బిష్ణోయ్, నవీన్-ఉల్-హక్, యశ్ ఠాకూర్
ఢిల్లీ: పృథ్వీ షా, వార్నర్, హోప్, రిషబ్ పంత్, స్టబ్స్, అక్షర్ పటేల్, మెక్‌గర్క్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్

News April 12, 2024

ఉపాధి కోసం వలస వెళ్తున్నారు: చంద్రబాబు

image

AP:రాజధాని విషయంలో జగన్ 3 ముక్కలాట ఆడుతున్నారని చంద్రబాబు విమర్శించారు. ‘అమరావతి పూర్తైతే ఇక్కడే అందరికీ ఉపాధి దొరికేది. ఉపాధి కోసం యువత HYD, బెంగళూరు, చెన్నై వెళ్తున్నారు. ఓటు వేసిన వారినే కాటు వేసే రకం జగన్. నా SCలు అంటూ వారి నెత్తిమీదే చెయ్యి పెడతారు. నాసిరకం మద్యంతో అనేక మంది చనిపోతున్నారు. 5 ఏళ్లలో పోలవరం ఎంత పూర్తైంది? రోడ్లపై గుంతలు పూడ్చలేని వారు 3 రాజధానులు ఎలా కడతారు?’ అని ప్రశ్నించారు.

News April 12, 2024

పెరిగిన పాస్‌ పర్సెంటేజ్

image

AP ఇంటర్ ఫలితాల్లో పాస్ పర్సెంటేజ్ పెరిగింది. గత ఏడాది ఫస్టియర్‌లో 61శాతం మంది పాస్ కాగా ఈ సారి 67శాతం మంది పాసయ్యారు. అలాగే సెకండియర్ విద్యార్థుల్లో గతేడాది 72శాతం మంది ఉత్తీర్ణత సాధించగా.. ఈ ఏడాది 78శాతం మంది పరీక్షలు పాసయ్యారు. 2018 నుంచి చూస్తే (2021లో కరోనా వల్ల 100శాతం పాస్) ఈ ఏడాదే పాస్ పర్సెంటేజ్ అత్యధికంగా ఉంది.