News July 6, 2024

జగన్.. నీ చెల్లి పంపిన అద్దంలో ఓ సారి ముఖం చూసుకో: TDP

image

YCPకి ఓటేసిన వారిపై దాడులకు పాల్పడుతున్నారన్న జగన్ <<13576740>>ఆరోపణలపై<<>> TDP మండిపడింది. ‘జగన్ మాటలకు బాబాయ్ వివేకానంద రెడ్డి ఉలిక్కిపడ్డాడు. గొడ్డలి వేట్ల గాయాలు ఒకసారి తడిమి చూసుకున్నాడు. ఒరిజినల్ YSR అభిమానులు, జగన్ నకిలీ ఫ్యాన్స్.. వారిలో వారే కొట్టుకుని ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారు. TDPని హెచ్చరించే ముందు ఓ సారి నీ చెల్లి పంపించిన అద్దంలో ముఖం చూసుకో జగన్’ అని ట్వీట్ చేసింది.

News July 6, 2024

BREAKING: ఏడాదికి 2 సార్లు టెట్

image

TG: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏడాదికి రెండు సార్లు టెట్ నిర్వహించాలని నిర్ణయించింది. జూన్, డిసెంబర్ నెలల్లో టెట్ పరీక్ష నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఒక అభ్యర్థి ఎన్ని సార్లైనా టెట్ రాసుకోవచ్చని జీవోలో పేర్కొంది. డీఎస్సీలో టెట్ మార్కులకు వెయిటేజీ ఉంటుంది.

News July 6, 2024

ఇండియన్ ఫ్యాన్స్‌ను చూసి ఆశ్చర్యపోయిన క్రిస్ లిన్

image

టీమ్ ఇండియా బస్ పరేడ్‌కు హాజరైన అభిమానులను చూసి ఆస్ట్రేలియా క్రికెటర్ క్రిస్ లిన్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అభిమానుల క్రేజ్ చూసి తనకు పిచ్చెక్కిందన్నట్లుగా ఎమోజీలతో లిన్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఆ పోస్ట్ వైరల్‌గా మారింది. కాగా క్రిస్ లిన్ ఐపీఎల్‌లో DC, SRH, MI, KKRకు ప్రాతినిధ్యం వహించారు. 42 మ్యాచులాడి 1329 పరుగులు చేశారు. ఆసీస్ తరఫున 4 వన్డేలు, 18 టీ20లు ఆడారు.

News July 6, 2024

అభిషేక్ శర్మ డకౌట్

image

IPLలో దుమ్మురేపి జాతీయ జట్టుకు ఎంపికైన అభిషేక్ శర్మ అరంగేట్ర మ్యాచులో నిరాశపరిచారు. జింబాబ్వేతో తొలి ఓవర్లో ఎదుర్కొన్న నాలుగో బంతికే డకౌట్ అయ్యారు. బెన్నెట్ బౌలింగ్‌లో మసకద్జకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగారు. ఫస్ట్ ఓవర్ మెయిడిన్ అయింది. భారత్ టార్గెట్ 116 రన్స్.

News July 6, 2024

పాప్ సింగర్ కోసం సిటీ పేరే మార్చేశారు!

image

ప్రముఖ పాప్ సింగర్ టేలర్ స్విఫ్ట్‌పై జర్మనీలోని ఓ నగరం వినూత్నంగా అభిమానాన్ని చాటుకుంది. ఈనెల 17-19 మధ్య స్విఫ్ట్ గెల్సెన్‌కెర్హన్‌లో పర్యటించనున్న నేపథ్యంలో అధికారులు తాత్కాలికంగా ఆ నగరం పేరును ‘స్విఫ్ట్‌కెర్హన్’గా మార్చారు. ఓ అభిమాని విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. రద్దీ ప్రదేశాలు, ట్రామ్స్‌కు కూడా స్విఫ్ట్ పేరు పెడతామని తెలిపారు. ఆ నగరంలో స్విఫ్ట్ మూడు ప్రదర్శనలు ఇవ్వనున్నారు.

News July 6, 2024

ఒక్కసారైనా WC గెలిచావా?.. వాన్‌కు రవిశాస్త్రి కౌంటర్

image

T20 WC నిర్వాహకులు భారత్‌కు అనుకూలంగా వ్యవహరించారన్న ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్‌కు రవిశాస్త్రి ఘాటు కౌంటర్ ఇచ్చారు. ‘వాన్ ఇష్టమొచ్చింది మాట్లాడొచ్చు. కానీ ఆయన మాటలను ఇక్కడ ఎవరూ పట్టించుకోరు. సెమీస్‌లో ఇంగ్లండ్ ఎందుకు విఫలమైందో ముందుగా దానిపై దృష్టి పెడితే బెటర్. వాన్ తన కెరీర్‌లో ఒక్క సారి కూడా ప్రపంచకప్ సాధించలేకపోయారు. అలాంటి వ్యక్తి భారత్‌ను తప్పుబట్టడం ఏంటి?’ అని రవి వ్యాఖ్యానించారు.

News July 6, 2024

పాతబస్తీలో అమిత్ షాపై కేసు ఎందుకు నమోదైంది?

image

TG: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మే 1న HYD BJP ఎంపీ అభ్యర్థి మాధవీలత తరఫున కేంద్రమంత్రి అమిత్ షా పాతబస్తీలో ప్రచారం చేశారు. ఆ సమయంలో ఇద్దరు బాలికలు చేతిలో BJP జెండాలతో ఆయన వద్దకు వచ్చారు. దీంతో ప్రచారంలో పిల్లల్ని ప్రోత్సహించి, కోడ్ ఉల్లంఘించారన్న ఫిర్యాదుతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఉద్దేశపూర్వకంగా కోడ్ ఉల్లంఘన జరగలేదని తాజాగా మొఘల్‌పురా పోలీసులు కేసును ఉపసంహరించుకున్నారు.

News July 6, 2024

ఇకపై ఈవీ ఛార్జ్‌కు 5 నిమిషాలే!

image

గంటల పాటు వేచి చూడనవసరం లేకుండా 5 నిమిషాల్లోనే ఈవీ బ్యాటరీ ఛార్జ్ అయ్యే టెక్నాలజీ త్వరలో అందుబాటులోకి రానుంది. నైబోల్ట్ అనే యూకే సంస్థ 4.5 నిమిషాల్లో 70% ఛార్జ్ అయ్యే కారును రూపొందించింది. దీని కోసం ప్రత్యేకంగా 35కిలోవాట్ల లిథియమ్ అయాన్ బ్యాటరీని డిజైన్ చేసింది. మరోవైపు న్యూయార్క్‌లోని కార్నెల్ యూనివర్సిటీ కొన్ని నెలల క్రితం 5 నిమిషాల్లో ఛార్జ్ అయ్యే బ్యాటరీని డిజైన్ చేసింది.

News July 6, 2024

ఇటీవలే పెళ్లి.. ప్రెగ్నెన్సీ వార్తలపై సోనాక్షి ఏమన్నారంటే?

image

గతనెల 23న హీరోయిన్ సోనాక్షి సిన్హాకు వివాహమైన విషయం తెలిసిందే. అయితే ఇటీవల ఆమె ఆసుపత్రికి వెళ్లడంతో ప్రెగ్నెంట్ అంటూ కొందరు ప్రచారం చేశారు. తాజాగా దీనిపై స్పందించిన ఆమె ‘ఇకపై మేం ఆసుపత్రికి వెళ్లాలనుకోవడం లేదు. వెళ్తే చాలు ప్రెగ్నెంట్ అంటున్నారు’ అని అసహనం వ్యక్తం చేశారు. కొద్దిరోజుల క్రితం సోనాక్షి తండ్రి శత్రుఘ్న సిన్హా అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరగా ఆయనను చూసేందుకే ఆమె హాస్పిటల్‌కు వెళ్లారు.

News July 6, 2024

రెండు రాష్ట్రాల పునరేకీకరణే ఏకైక మార్గమా?: పేర్ని నాని

image

AP: న్యూస్ ఛానళ్ల బ్రేకింగ్ వార్తలు.. రేవంత్, చంద్రబాబు డిమాండ్లు చూస్తుంటే రెండు రాష్ట్రాల పునరేకీకరణే ఏకైక మార్గంగా కనిపిస్తోందని వైసీపీ నేత పేర్ని నాని ఎద్దేవా చేశారు. ఇద్దరు సీఎంల తీరు చూస్తుంటే విడ్డూరంగా ఉందని ట్వీట్ చేశారు. కాగా మరికాసేపట్లో రేవంత్, చంద్రబాబు ప్రజాభవన్‌లో భేటీ కానున్నారు. విభజన సమస్యలపై వీరిద్దరూ చర్చించనున్నారు.