News July 11, 2024
తెలంగాణలో నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు

రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిలిచిపోయింది. సర్వర్ డౌన్ కావడం వల్లే ఈ సమస్య తలెత్తినట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద రిజిస్ట్రేషన్లు జరగక ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. గంటల తరబడి కార్యాలయాల వద్దే పడిగాపులు కాస్తున్నారు. సర్వర్ సమస్య పరిష్కరించాలని వారు కోరుతున్నారు.
Similar News
News February 9, 2025
సినిమా ఆఫర్.. మాజీ CM కూతురికి రూ.4 కోట్లు టోకరా

సినిమా ఆఫర్ ఇస్తామంటూ కొందరు ఉత్తరాఖండ్ మాజీ CM రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ కూతురు ఆరుషికి రూ.4 కోట్లకు టోకరా పెట్టారు. ముంబైకి చెందిన వరుణ్, మాన్సీలు నిర్మాతలమంటూ పరిచయం చేసుకున్నారు. విక్రమ్ మాస్సే హీరోగా తెరకెక్కించే మూవీలో కీలక పాత్రతో పాటు లాభంలో 20% షేర్ ఇస్తామని, పెట్టుబడి పెట్టాలని చెప్పారు. ఇది నమ్మి ఆమె విడతలవారీగా రూ.4 కోట్లు ఇచ్చారు. మూవీ ప్రారంభం కాకపోవడంతో మోసం చేశారని కేసు పెట్టారు.
News February 9, 2025
గిల్ ఉంటే రో‘హిట్’

ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ మరోసారి అద్భుత ప్రదర్శన చేశారు. ముఖ్యంగా వన్డేల్లో గిల్తో ఓపెనింగ్ చేసిన మ్యాచుల్లో హిట్ మ్యాన్ ఆకట్టుకునే ప్రదర్శన చేస్తున్నారు. గత ఎనిమిది ఇన్నింగ్సుల్లో 2 సార్లు సెంచరీ, 4 సార్లు అర్ధసెంచరీ భాగస్వామ్యం నెలకొల్పడం గమనార్హం. ఇవాళ్టి మ్యాచులో 100 బంతుల్లో 136 పరుగులు నమోదు చేశారు.
News February 9, 2025
ఢిల్లీ సీఎం ఎంపికపై బీజేపీ కసరత్తు

ఢిల్లీ సీఎం అభ్యర్థిని ఖరారు చేసేందుకు బీజేపీ అధిష్ఠానం కసరత్తు చేస్తోంది. ఈ విషయమై బీజేపీ చీఫ్ జేపీ నడ్డాతో కేంద్ర మంత్రి అమిత్ షా భేటీ అయ్యారు. కేజ్రీవాల్ను ఓడించిన పర్వేశ్ వర్మ, మంజీందర్ సింగ్, ఆశిష్ సూద్తో వీరు సమావేశమయ్యారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఒడిశా సీఎం ఎంపికలో రచించిన వ్యూహాన్ని అనుసరించే అవకాశమున్నట్లు సమాచారం.