News July 12, 2024

రష్యాలో ఆఫర్.. బిడ్డను కంటే రూ.92వేలు!

image

సంతానోత్పత్తిని పెంచడానికి రష్యాలోని కరేలియా అధికారులు ఆఫర్ ప్రకటించారు. 25 ఏళ్లలోపు యువతులు ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనిస్తే రూ.92 వేలు బహుమతిగా ఇస్తామన్నారు. ఈ స్కీమ్ 2025, జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది. ఇప్పటికే ఆ దేశంలో కండోమ్‌లు, గర్భ నిరోధక మాత్రలపై ప్రభుత్వం నిషేధం విధించినట్లు మాస్కో టైమ్స్ పేర్కొంది. కాగా దేశంలోని ప్రతి మహిళ 8 మందికి జన్మనివ్వాలని గత ఏడాది పుతిన్ విజ్ఞప్తి చేశారు.

News July 12, 2024

జమ్మూకశ్మీర్‌లో భూకంపం

image

జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 4.1గా నమోదైంది. లద్దాక్‌లోని లేహ్‌లోనూ 3.6 తీవ్రతతో భూమి కంపించింది. దీంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు.

News July 12, 2024

ఆర్మీలో ‘నెక్స్ట్ ఆఫ్ కిన్’ అంటే?

image

కెప్టెన్ అన్షుమాన్ భార్య స్మృతి, పేరెంట్స్ మధ్య <<13611952>>వివాదంతో<<>> ఆర్మీలో ఉండే ‘నెక్స్ట్ ఆఫ్ కిన్(NOK)’ రూల్‌‌పై చర్చ జరుగుతోంది. వ్యక్తి ఆర్మీలో చేరినప్పుడు అతడి పేరెంట్స్‌ను NOKగా రికార్డుల్లో చేరుస్తారు. అతడికి వివాహమైనప్పుడు పేరెంట్స్ ప్లేస్‌లో భార్య పేరు చేరుతుంది. జవాన్ వీరమరణం పొందితే వచ్చే పరిహారం భార్యకే ఇస్తారు. ఆ నిబంధనను తొలగించాలని ఇప్పుడు అన్షుమాన్ తల్లిదండ్రులు కోరుతున్నారు.

News July 12, 2024

పిల్లలు ఇలా తయారవుతున్నారేంటి?

image

3వ తరగతి <<13600394>>బాలికపై<<>> ముగ్గురు బాలురు అత్యాచారం చేసి హతమార్చారంటే సమాజంలో క్రూరత్వం ఏ స్థాయిలో పెరుగుతుందో అర్థమవుతోంది. సినిమాలు, సోషల్ మీడియా, అశ్లీల చాటింగ్, మితిమీరిన స్వేచ్ఛ, గంజాయితో రేపటి పౌరుల భవిష్యత్ నీరుగారిపోతోంది. స్కూల్ స్థాయి నుంచే మానవతా విలువలు బోధించడం వల్ల పరిస్థితిలో మార్పు వచ్చే అవకాశం ఉంది. మరి చిన్నారులకు క్రైమ్ మెంటాలిటీ రాకుండా ఉండేందుకు మీ సూచనలేంటో కామెంట్ చేయండి.

News July 12, 2024

రా.7 గంటలకు కాంగ్రెస్‌లో చేరుతున్నా: BRS MLA

image

TG: కాంగ్రెస్‌లో చేరికపై రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ ప్రకటన చేశారు. ఈరోజు రా.7 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో హస్తం పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. తనపై ఎవరి ఒత్తిడి లేదని, ఎవరూ బెదిరించలేదన్నారు. నియోజకవర్గ రైతులు, ప్రజల అభివృద్ధి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. తనతోపాటు చాలామంది కాంగ్రెస్‌లో చేరేందుకు ఉత్సాహంగా ఉన్నారని ఎమ్మెల్యే వెల్లడించారు.

News July 12, 2024

‘సుప్రీం’ తిరస్కరించాక మళ్లీ FIR ఎందుకు?: PV సునీల్

image

MLA రఘురామకృష్ణరాజు ఫిర్యాదుతో అప్పటి సీఐడీ డీజీ సునీల్ కుమార్‌తో పాటు EX CM జగన్‌పై గుంటూరు పోలీసులు <<13613892>>కేసు<<>> నమోదు చేసిన విషయం తెలిసిందే. తనను A1గా చేర్చుతూ కేసు నమోదు చేయడంపై పీవీ సునీల్ స్పందించారు. ‘మూడేళ్లపాటు కొనసాగిన ఈ కేసును సుప్రీంకోర్టు కొట్టివేసింది. అయినా మళ్లీ ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడాన్ని మీ విజ్ఞతకే వదిలేస్తున్నా’ అని ట్వీట్ చేశారు.

News July 12, 2024

‘భారతీయుడు-2’ రివ్యూ&రేటింగ్

image

అవినీతిపై పోరాటాన్ని డైరెక్టర్ శంకర్ ‘భారతీయుడు-2’లో కంటిన్యూ చేశారు. సేనాపతిగా కమల్ హాసన్ ఎంట్రీ, శంకర్ విజువల్స్, సిద్ధార్థ్ రోల్ ఆకట్టుకుంటాయి. స్టోరీలో ఎమోషన్ ప్రేక్షకులకు కనెక్ట్ కాకపోవడం, ఇంట్రెస్టింగ్ సీన్లు లేకపోవడం బిగ్గెస్ట్ మైనస్. కమల్ హాసన్ మేకప్, అనిరుధ్ BGM వర్కౌట్ కాలేదు. ‘భారతీయుడు’తో సంచలనం సృష్టించిన డైరెక్టర్ శంకర్ మార్క్ ఈ మూవీలో మిస్ అయింది.
RATING: 2/5

News July 12, 2024

దారుణం.. దళిత యువకుడితో మూత్రం తాగించారు

image

UPలోని శ్రావస్తి జిల్లాలో దారుణం జరిగింది. తమ ఫంక్షన్‌కు ఎక్కువ డబ్బు తీసుకున్నాడనే సాకుతో DJ ఆపరేటర్‌(15ఏళ్ల బాలుడు)తో కొందరు యువకులు మూత్రం తాగించారు. లిక్కర్ బాటిల్‌లో మూత్రం పోసి బలవంతంగా బాధితుడితో తాగించి వీడియో తీశారు. బాధిత కుటుంబం ఫిర్యాదుతో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులైన కిషన్ తివారీ, దిలీప్ మిశ్రా, సత్యం తివారీ మద్యం మత్తులో ఈ దారుణం చేసినట్లు పోలీసులు గుర్తించారు.

News July 12, 2024

‘హాథ్రస్‌’పై పిటిషన్ తిరస్కరించిన సుప్రీం కోర్టు

image

హాథ్రస్‌లో జరిగిన తొక్కిసలాటలో 121 మంది మరణించడంపై కమిటీ ఏర్పాటు చేసి ఎంక్వైరీ చేయించాలని దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. ఇది ఆందోళన కలిగించే అంశమని CJI జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. అయితే ఇటువంటి కేసులను హైకోర్టుల్లో పరిష్కరించడం మంచిదని, పిటిషనర్ అలహాబాద్ (యూపీ) కోర్టును ఆశ్రయించాలని సుప్రీం కోరింది.

News July 12, 2024

ED అదుపులోకి కర్ణాటక కాంగ్రెస్ MLA

image

వాల్మీకి కార్పొరేషన్ స్కాం కేసులో మనీలాండరింగ్‌ ఆరోపణలతో కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్ MLA నాగేంద్రను ED అదుపులోకి తీసుకుంది. ఆయన షెడ్యూల్ తెగల సంక్షేమశాఖ మంత్రిగా ఉన్న సమయంలో భారీ స్కామ్‌కు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన ఈ శాఖ అకౌంట్స్ సూపరింటెండెంట్‌ చంద్రశేఖర్ సూసైడ్ లెటర్‌లో పలువురి పేర్లు రాసిన విషయం తెలిసిందే. అప్పుడే నాగేంద్ర తన మంత్రి పదవికి రాజీనామా చేశారు.