News April 19, 2024

చంద్రబాబు ఆస్తులు ఎంతంటే?

image

AP: టీడీపీ అధినేత చంద్రబాబు తరఫున ఆయన భార్య భువనేశ్వరి కుప్పం నియోజకవర్గంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సమయంలో ఆమె తమ ఆస్తులను ప్రకటించారు. ఇద్దరికీ కలిపి రూ.931 కోట్ల ఆస్తులు ఉన్నట్లు తెలిపారు. ఇది 2019 ఎన్నికల నాటి ఆస్తులతో పోలిస్తే 39 శాతం పెరిగినట్లు తెలుస్తోంది. రూ.3 కోట్ల విలువైన బంగారం, డైమండ్స్, వెండి ఆభరణాలు ఉన్నట్లు తెలిపారు. అలాగే చంద్రబాబుపై 24 కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు.

News April 19, 2024

అప్పులు, వడ్డీలకు రూ.26,374 కోట్లు చెల్లించాం: భట్టి

image

TG: గతేడాది డిసెంబర్ నుంచి ఏప్రిల్ 15 వరకు ఏ శాఖపై ఎంత ఖర్చు చేశామనే వివరాలను ఆర్థిక మంత్రి భట్టి విడుదల చేశారు. మొత్తం రూ.66,507 కోట్లలో జీతాలకు రూ.22,328 కోట్లు, అప్పులు, వడ్డీలకు రూ.26,374 కోట్లు, రైతు భరోసాకు రూ.5,575 కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు. డిసెంబర్ 7, 2023 నాటికి రూ.3,960 కోట్ల నెగటివ్ బ్యాలెన్స్ ఉందని, తాము ఇప్పటివరకు రూ.17,618 కోట్ల అప్పులు తెచ్చామని మంత్రి పేర్కొన్నారు.

News April 19, 2024

విక్రమార్కుడు సీక్వెల్ కథ సిద్ధం: నిర్మాత రాధామోహన్

image

రాజమౌళి-రవితేజ కాంబోలో తెరకెక్కిన విక్రమార్కుడుకు సీక్వెల్ కథను రచయిత విజయేంద్రప్రసాద్ పూర్తి చేశారని నిర్మాత రాధామోహన్ వెల్లడించారు. అలాగే సల్మాన్ ఖాన్ హీరోగా వచ్చిన బజరంగీ భాయిజాన్-2 స్ర్కిప్ట్ కూడా రెడీ అయ్యిందని తెలిపారు. నటీనటుల ఎంపిక పనులు జరుగుతున్నాయని, త్వరలోనే సినిమాల షూటింగ్ మొదలు పెడతామని చెప్పారు. విక్రమార్కుడు సీక్వెల్‌కు రాజమౌళినే దర్శకత్వం వహించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

News April 19, 2024

పాలకొల్లు: నిమ్మల ‘మూడో’ గండం దాటేనా?

image

AP: ప.గోదావరి పాలకొల్లుకు ఓ సెంటిమెంట్ ఉంది. అక్కడి ఓటర్లు వరుసగా మూడోసారి ఏ అభ్యర్థినీ గెలిపించలేదు. 1955, 62లో అద్దేపల్లి సత్యనారాయణ(INC), 1983, 85లో అల్లు వెంకట సత్యనారాయణ(TDP), ఈయనే 1994, 99లో 2సార్లు విజయం సాధించారు. 2014, 19లో గెలిచిన నిమ్మల రామానాయుడు(TDP) మరోసారి బరిలో నిలిచారు. మూడో గండాన్ని ఆయన దాటుతారో లేదో వేచి చూడాలి. YCP నుంచి శ్రీహరి గోపాలరావు పోటీ చేస్తున్నారు.
<<-se>>#ELECTIONS2024<<>>

News April 19, 2024

‘మంజుమ్మెల్ బాయ్స్’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్

image

మలయాళ బ్లాక్‌బస్టర్ మూవీ ‘మంజుమ్మెల్ బాయ్స్’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. మే 3 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. మలయాళం, తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో అందుబాటులో ఉంటుందని చిత్రయూనిట్ ప్రకటించింది. ఫిబ్రవరిలో మలయాళంలో విడుదలైన ఈ మూవీ రూ.200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఏప్రిల్ 5న తెలుగులోనూ రిలీజైంది. ఇప్పుడు ఓటీటీలోకి రానుంది.

News April 19, 2024

మెగా డీఎస్సీపై తొలి సంతకం: CBN

image

AP: కూటమి అధికారంలోకి వచ్చాక మెగా డీఎస్సీపై తొలి సంతకం చేస్తానని చంద్రబాబు అన్నారు. జగన్ ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించకుండా యువత భవిష్యత్తును నాశనం చేశారని ఫైరయ్యారు. తాము పోలీసు ఉద్యోగాలు ఇస్తామని, యువతకు నైపుణ్య శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. రైతులకు ఏడాదికి రూ.20వేలు అందజేయడంతో పాటు పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామని రాయదుర్గం సభలో చంద్రబాబు చెప్పారు.

News April 19, 2024

రాములోరి కళ్యాణ తలంబ్రాల బుకింగ్ గడువు పొడిగింపు

image

TG: శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో జరిగిన సీతారామచంద్రుల కళ్యాణ తలంబ్రాల‌ను కార్గో సేవల ద్వారా TSRTC ఇంటి వద్దకే తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ బుకింగ్ గడువు ముగియగా తాజాగా ఈ నెల 25వ తేదీ వరకు TSRTC పొడిగించింది. రూ.151కే లభించే రాములోరి కళ్యాణ తలంబ్రాలు పొందే అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరింది. tsrtclogistics.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు.

News April 19, 2024

క్వశ్చన్ పేపర్లతో వైసీపీ, జనసేన ఫైట్

image

AP: వైసీపీ, జనసేన క్వశ్చన్ పేపర్ల రూపంలో సోషల్ మీడియాలో విమర్శలు చేసుకుంటున్నాయి. పవన్ కళ్యాణ్ 12వ తరగతి ఫెయిల్ అంటూ వైసీపీ ఒక క్వశ్చన్ పేపర్ ట్వీట్ చేసింది. ఎన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్నావ్?, CBNతో ఎందుకు కలిశావ్? అని ప్రశ్నలు వేసింది. దీనికి కౌంటర్‌గా జనసేన జగన్ పేరుతో ఓ క్వశ్చన్ పేపర్ విడుదల చేసింది. ఖరీదైన దోపిడీ ఏది? ఎగ్గొట్టిన హామీ ఏది? అని సెటైర్లు వేసింది.

News April 19, 2024

రాయి దాడి కేసు.. నిందితుడి వాంగ్మూలం కోసం పిటిషన్

image

AP: సీఎం జగన్‌పై రాయి దాడి కేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు. జడ్జి సమక్షంలో నిందితుడు సతీశ్ వాంగ్మూలాన్ని తీసుకునేందుకు అనుమతి కోరుతూ విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై రేపు విచారణ జరిగే అవకాశం ఉంది. కాగా నిన్న సతీశ్‌కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో అతడిని నెల్లూరు సబ్ జైలుకు తరలించారు.

News April 19, 2024

షర్మిలకు ఈసీ నోటీసులు

image

APPCC చీఫ్ షర్మిలకు ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఎన్నికల ప్రచారంలో వివేకా హత్యను ప్రస్తావించారని, వైసీపీపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆ పార్టీ నేతలు మల్లాది విష్ణు, అవినాశ్ రెడ్డి ఫిర్యాదు చేశారు. దీంతో ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై 48 గంటల్లో వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించింది. లేదంటే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.