India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అత్యధిక సబ్స్క్రైబర్లు ఉన్న యూట్యూబర్ మిస్టర్ బీస్ట్ వేలాది మందికి ఏదో విధంగా సాయం చేస్తుంటారు. తాజాగా ఛారిటీ కోసం ఆయన లైవ్ స్ట్రీమింగ్ ఏర్పాటు చేసి తన ఫాలోవర్లు సైతం ఎంతో కొంత సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనికి రికార్డు స్థాయిలో ఏకంగా $12,000,000 (రూ.105కోట్లు)కు పైగా విరాళాలు వచ్చినట్లు బీస్ట్ Xలో ప్రకటించారు. పేదలకు స్వచ్ఛమైన నీటిని అందించేందుకు ఈ నిధులను వెచ్చించనున్నారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ముగింపుపై ట్రంప్, పుతిన్ నిన్న రాత్రి అలస్కాలో <<17420790>>భేటీ<<>> అయిన విషయం తెలిసిందే. దీనిపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ స్పందించారు. పుతిన్తో చర్చించిన విషయాలను ట్రంప్ ఫోన్ చేసి తనకు వివరించినట్లు చెప్పారు. తననూ చర్చలకు ఆహ్వానించినట్లు తెలిపారు. మరణాలు ఆపడం, యుద్ధం ముగించడంపై సోమవారం వాషింగ్టన్లో US అధ్యక్షుడితో ప్రత్యేకంగా సమావేశం అవుతానని వెల్లడించారు.
బిల్లుల ఆమోదంపై గవర్నర్లు, రాష్ట్రపతికి గడువు <<16410549>>విధించే<<>> అధికారం కోర్టులకు ఉండదని సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. కొన్ని అంశాల్లో న్యాయస్థానం జోక్యం చేసుకుంటే రాజ్యాంగపర గందరగోళం తలెత్తే అవకాశముందని ‘తాము గడువు విధించవచ్చా?’ అని SC ఇచ్చిన నోటీసులకు బదులిచ్చింది. గడువు విధించడం వల్ల వాళ్ల స్థానాన్ని తగ్గించినట్లు అవుతుందని, వారి విధుల్లో లోపాలుంటే చట్టపరంగానే సరిదిద్దాలని సూచించింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ తెరకెక్కిస్తోన్న ‘OG’ నుంచి మరో అప్డేట్ రానుంది. ఈ చిత్రంలోని ‘కన్మని’ సాంగ్ను ఈరోజు సాయత్రం 4.05 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. రెడీగా ఉండాలంటూ ఫ్యాన్స్కు సూచించారు. ప్రియాంక మోహన్, పవన్ మధ్య ఈ సాంగ్ సాగుతుందని హింట్ ఇచ్చారు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ సింగిల్ అదరగొట్టిన విషయం తెలిసిందే.
TG: రాష్ట్రానికి భారీ వర్షసూచన ఉన్న నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులను CM రేవంత్ ఆదేశించారు. వర్ష ప్రభావం ఎక్కువగా ఉండే జిల్లాలకు SDRF, NDRF సిబ్బంది ముందుగానే వెళ్తే వారితో కలెక్టర్లు సమన్వయం చేసుకుంటారని చెప్పారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను పునరావాస శిబిరాలకు తరలించాలన్నారు. అంటువ్యాధులు ప్రబలే ఆస్కారం ఉన్నందున వైద్యారోగ్యశాఖ అప్రమత్తం కావాలని ఆదేశాలు జారీ చేశారు.
TG: సృష్టి ఫెర్టిలిటీ కేసు నిందితురాలు డా.నమ్రత నేరం అంగీకరించినట్లు కన్ఫెషన్ రిపోర్టులో పోలీసులు తెలిపారు. ‘IVF, సరోగసీ ట్రీట్మెంట్ చేయకుండానే చాలామంది వద్ద రూ.30లక్షల చొప్పున వసూలు చేశాం. అబార్షన్కు వచ్చేవారికి డబ్బు ఆశ చూపి డెలివరీ తర్వాత శిశువులను కొనేవాళ్లం. పిల్లల కొనుగోలులో ఏజెంట్లు సంజయ్, సంతోషి కీలకంగా వ్యవహరించారు. నా కుమారుడు లీగల్గా సహకరించేవాడు’ అని ఆమె చెప్పినట్లు పేర్కొన్నారు.
సినీ రంగంలోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం పెరిగిపోయింది. సైయారా, కూలీ, వార్-2 సినిమాల్లో AI కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. సైయారా క్లైమాక్స్ స్క్రిప్ట్ను AI జనరేట్ చేయగా, వార్-2 డబ్బింగ్ & కూలీలో రజినీకాంత్ డీఏజింగ్ను ఏఐ ద్వారా చేశారని టాక్. బెంగళూరులోని ఓ AI స్టార్టప్ విజువల్ డబ్ అనే టూల్ను వాడి ‘వార్-2’ను తెలుగులోకి డబ్ చేశారట. ఇది ఆడియోకు సరిపోయేలా నటుల లిప్ సింక్ను మారుస్తుంది.
AP: నిన్న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా YS జగన్ జాతీయ జెండా ఆవిష్కరణకు బయటకు రాకపోవడం శోచనీయమని TDP MLA ధూళిపాళ్ల నరేంద్ర విమర్శించారు. ‘ఇండిపెండెన్స్ డే రోజు జెండా ఎగురవేయని మాజీ CMగా, పార్టీ చీఫ్గా నిలిచారు. ఇలా చేయడం దేశాన్ని, స్వాతంత్ర్యం కోసం పోరాడిన వారిని, జెండాను అవమానించడమే. పులివెందుల ఓటమి ఫ్రస్ట్రేషన్ దీనికి కారణం కావొచ్చు. జగన్ జెండా ఆవిష్కరించకపోవడం విచారకరం’ అని Xలో మండిపడ్డారు.
భారత్ తరఫున అంతరిక్షానికి వెళ్లొచ్చిన తొలి వ్యోమగామి శుభాంశు శుక్లా స్వదేశానికి వస్తున్నారు. ఇన్నిరోజులు అమెరికాలోని NASA పర్యవేక్షణలో ఉన్న ఆయన భారత్కు పయనమయ్యారు. ఇక్కడికి వచ్చాక ప్రధాని మోదీతో శుక్లా భేటీ అయ్యే అవకాశం ఉంది. ఇక యాక్సియం-4 మిషన్ కోసం ఇన్నాళ్లు కుటుంబం, స్నేహితులకు దూరంగా ఉండటం బాధించిందని ఆయన తెలిపారు. వారిని కలిసి తన అనుభవాలను పంచుకునేందుకు ఆత్రుతగా ఉన్నట్లు వెల్లడించారు.
తెలంగాణలోని పలు జిల్లాలకు HYD వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ జారీ చేసింది. భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, కొత్తగూడెం జిల్లాల్లో ఇవాళ అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, సూర్యాపేట, ఖమ్మం, వరంగల్, హన్మకొండ, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
Sorry, no posts matched your criteria.