India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: విజయవాడ ఎయిర్పోర్టు-ముంబైకి ఆగస్టు 16 నుంచి ఇండిగో సర్వీసులు నడపనుంది. రోజూ సా.6.30కు ముంబై నుంచి విమానం బయలుదేరి రా.8.20కి గన్నవరం చేరుకుంటుంది. రాత్రి 9 గంటలకు ఇక్కడ బయలుదేరి రా.11కు ముంబైలో ల్యాండ్ అవుతుంది. ఈ సర్వీస్ వల్ల ముంబైతోపాటు గల్ఫ్, UK, USA వెళ్లే ప్రయాణికులకు సులభమైన కనెక్టివిటీ ఉంటుందని ఇండిగో ప్రతినిధులు తెలిపారు. కాగా ఈ రూట్లో ఇప్పటికే ఎయిరిండియా సర్వీసులు నడుపుతోంది.
AP: విజయనగరం టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు లోక్సభలో ఎంపీగా ప్రమాణస్వీకారానికి సైకిల్పై వెళ్లిన సంగతి తెలిసిందే. టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు ఆయన్ను ఈ విషయంపై తాజాగా అభినందించారు. గురువారం నితిన్ గడ్కరీతో భేటీ అనంతరం బయటికి వస్తున్న ఏపీ సీఎంకు కలిశెట్టి సైకిల్పై వచ్చిన విషయాన్ని టీడీపీ కేంద్రమంత్రులు గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో కలిశెట్టితో మాట్లాడిన సీబీఎన్, ఆయనపై ప్రశంసలు కురిపించారు.
TG: MLAల చేరికతో ఇప్పటికే ఉక్కిరిబిక్కిరి అవుతున్న BRS పార్టీకి ఒక్కసారిగా ఊహించని షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఆరుగురు MLCలు ఎలాంటి ముందస్తు ప్రకటనలు, ఊహాగానాలు లేకుండా ఒకేసారి కాంగ్రెస్లో చేరారు. భవిష్యత్తులోనూ ఆ పార్టీని పలువురు నేతలు వీడొచ్చని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. దీంతో ప్రస్తుత పరిస్థితిని చక్కదిద్దేందుకు గులాబీ బాస్ ఎలాంటి వ్యూహం రచిస్తారనేది ఆసక్తిగా మారింది.
TG: తెలంగాణలో కొత్తగా మరో 200 ఇంజినీరింగ్ కళాశాలలు రానున్నాయి. ఈ మేరకు AICTE అనుమతులు జారీ చేసింది. వీటిలో ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలతో పాటు 10 డీమ్డ్ వర్సిటీలు, వాటి క్యాంపస్లు ఉన్నాయి. సీఎం సొంత నియోజకవర్గమైన కొడంగల్లోని కోస్గిలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో 3 బ్రాంచీల్లో బీటెక్ ప్రారంభించేందుకు గ్రీన్ సిగ్నల్ లభించింది.
AP: దేశంలోనే ప్రముఖ బిజినెస్ స్కూళ్లలో ఒకటైన XLRI అమరావతిలో తమ క్యాంపస్ నెలకొల్పనుంది. ఈ సంస్థకు గతంలో 50 ఎకరాలను చంద్రబాబు కేటాయించారు. ప్రభుత్వం మారిన తర్వాత ఈ సంస్థ వెనక్కి తగ్గింది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం మళ్లీ సంప్రదింపులు జరపడంతో రూ.250 కోట్లతో క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. నిర్మాణం పూర్తైతే 5వేల మంది రాష్ట్ర, దేశ, విదేశీ విద్యార్థులు UG, PG కోర్సుల్లో విద్యను అభ్యసించొచ్చు.
TG: ఆరోగ్యశ్రీతో సంబంధం లేకుండా త్వరలోనే కొత్త రేషన్ కార్డులు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. సన్న బియ్యం పండించే రైతులను ప్రోత్సహిస్తామని వెల్లడించారు. వాటినే మిల్లింగ్ చేయించి రేషన్కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తామని తెలిపారు. బియ్యాన్ని వినియోగదారులే తింటారు కాబట్టి రీసైక్లింగ్ ఆగిపోతుందని CM అభిప్రాయపడ్డారు.
TG: రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడటంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విఫలమయ్యారని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్కు కట్టుబడి ఉన్నామంటూనే ఇతర పార్టీల గుర్తులపై గెలిచినవారిని పార్టీలో చేర్చుకుంటున్నారని మండిపడ్డారు. చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని సవాల్ చేశారు. రాజ్యసభ ఎంపీగా కేకే రాజీనామా చేయడాన్ని ఆయన స్వాగతించారు.
AP: ఎండీయూ వాహనాల ద్వారా రేషన్ పంపిణీ విధానంపై త్వరలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ‘రేషన్ మాఫియాలో ఈ వాహనాల నిర్వాహకులే ప్రధాన సూత్రధారులు. వీటి కొనుగోళ్లతో గత ప్రభుత్వం రూ.1500 కోట్లు నష్టం కలిగించింది. రైతులకు రూ.1000 కోట్ల ధాన్యం బకాయిలు విడుదల చేశాం. రైతులకు టార్పాలిన్లు పంపిణీ చేయాలని ఆలోచిస్తున్నాం. ఖాళీ గోతాలకు చెల్లింపులు నిలిపివేశాం’ అని పేర్కొన్నారు.
TG: ఏపీ సీఎం చంద్రబాబుకు ఈ నెల 7న హైదరాబాద్లోని ఎన్టీఆర్ భవన్లో సన్మానం చేయాలని టీటీడీపీ నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా కార్యకర్తలు, అభిమానులు తరలిరావాలని పిలుపునిచ్చింది. APకి సీఎం అయిన తర్వాత తొలిసారిగా ఈరోజు సాయంత్రం CBN నగరానికి రానున్నారు. ఈ నేపథ్యంలో బేగంపేట ఎయిర్పోర్టు నుంచి భారీ ర్యాలీ నిర్వహించేందుకు రాష్ట్ర టీడీపీ సన్నద్ధమవుతోంది. రాష్ట్ర సీఎం రేవంత్తో బాబు రేపు భేటీ కానున్నారు.
AP: మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కస్టడీకి ఇవ్వాలన్న గురజాల డీఎస్పీ పిటిషన్పై నేడు కోర్టు తీర్పు ఇవ్వనుంది. గురువారం రాత్రి వరకు దీనిపై మాచర్ల అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో వాదనలు సాగాయి. నెల్లూరు జైలులోనే విచారించాలని పిన్నెల్లి తరఫు న్యాయవాదులు కోరారు. అయితే క్రోసూరు తీసుకెళ్లి విచారిస్తామని, అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూస్తామని పోలీసు తరఫు లాయర్లు కోర్టుకు విన్నవించారు.
Sorry, no posts matched your criteria.