India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: బీఆర్ఎస్ రజతోత్సవ సభలో ఆ పార్టీ చీఫ్ KCR ఏం మాట్లాడుతారనే ఆసక్తి జనాల్లో నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత నిర్వహించనున్న భారీ బహిరంగ సభ కావడమే దీనికి ప్రధాన కారణం. అదే సమయంలో పార్టీ నాయకులకు, కార్యకర్తలకు గులాబీ బాస్ ఎలాంటి సందేశం, దిశానిర్దేశం చేస్తారనే చర్చ జరుగుతోంది. కాగా KCR సుమారు గంట పాటు ప్రసంగిస్తారని తెలుస్తోంది. ఎర్రవెల్లి నుంచి సా.5 గంటలకు సభాస్థలికి చేరుకుంటారని సమాచారం.
AP: ఇవాళ ఉత్తరాంధ్రలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని Xలో సూచించింది. అల్లూరి జిల్లా కూనవరం, కాకినాడ జిల్లా జగ్గంపేట, కిర్లంపూడి, ఏలేశ్వరం మండలాల్లో తీవ్రవడగాలులు, మరో 17 మండలాల్లో వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. కాగా నిన్న వైఎస్సార్ జిల్లా సిద్ధవటంలో అత్యధికంగా 42.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
TG: 25 ఏళ్ల ఆవిర్భావ దినోత్సవం నేపథ్యంలో BRS రజతోత్సవ బహిరంగ సభను నిర్వహించనుంది. హనుమకొండలోని ఎల్కతుర్తిలో జరిగే ఈ సభకు భారీగా జనం వస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. 154 ఎకరాల్లో మహాసభ ప్రాంగణం ఉండగా 500 మంది కూర్చునేలా ప్రధాన వేదికను ఏర్పాటు చేశారు. ఎన్నికల తర్వాత జరుగుతున్న భారీ సభ కావడంతో నేతలంతా ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. తమ బలాన్ని చాటి చెప్పాలని ప్రయత్నాలు చేస్తున్నారు.
ఐపీఎల్లో ఇవాళ రెండు మ్యాచులు జరగనున్నాయి. మొదటి మ్యాచ్ వాంఖడే వేదికగా 3.30 గంటలకు లక్నో, ముంబై మధ్య జరగనుంది. ఇరు జట్లు ఇప్పటికీ ఏడు సార్లు తలపడగా LSG 6, MI ఒక మ్యాచులో గెలిచింది. ఢిల్లీ వేదికగా జరిగే మరో మ్యాచులో రా.7.00 గంటలకు బెంగళూరు, ఢిల్లీ పోటీ పడనున్నాయి. ఇప్పటివరకు ఇరు జట్లు 32 సార్లు తలపడగా RCB 19, DC 12 మ్యాచుల్లో గెలవగా ఒక మ్యాచులో ఫలితం రాలేదు.
ఉద్యమ స్ఫూర్తితో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే లక్ష్యంగా 2001 ఏప్రిల్ 27న TRS పార్టీని కేసీఆర్ ఏర్పాటు చేశారు. ప్రొఫెసర్ జయశంకర్ మద్దతుతో ఈ పార్టీ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించాలనే ఆకాంక్షను మరోసారి ప్రజల్లో రగిల్చింది. రాష్ట్ర ఏర్పాటులో కీలకంగా వ్యవహరించడంతో 2014 నుంచి పదేళ్లపాటు ప్రజలు పట్టం కట్టారు. 2023లో BRSగా మారింది. ఎన్నికల్లో ఓటమిపాలైనా తిరిగి తన అస్థిత్వాన్ని చాటాలని చూస్తోంది.
ఇటీవల సివిల్స్ తుది ఫలితాలు రాగా UPSC తాజాగా మార్కులను వెల్లడించింది. మొత్తం 2,025 మార్కులకు గానూ నం.1 ర్యాంకర్ శక్తి దూబేకు 1,043(51.5%) మార్కులు వచ్చాయి. రాత పరీక్షల్లో 843, ఇంటర్వ్యూలో 200 మార్క్స్ వచ్చాయి. ఇక రెండో ర్యాంకర్ హర్షిత 1,038, మూడో ర్యాంకర్ అర్చిత్ పరాగ్ 1,038 స్కోర్ చేశారు. తెలుగమ్మాయి సాయి శివాని(11వ ర్యాంకర్)కి 1,027 మార్కులు రావడం గమనార్హం.
ఓ డాన్స్ షోలో విన్నర్గా నిలిచిన జాను అనే యువతితో తనకు ఎలాంటి సంబంధం లేదని కొరియోగ్రఫర్ శేఖర్ మాస్టర్ స్పష్టం చేశారు. జాను విషయంలో తనను ఉద్దేశించి చేసిన కామెంట్స్ బాధించినట్లు తెలిపారు. డాన్స్ షోలో జడ్జిగా ఉన్న తాను ఆమె డాన్స్ బాగుందని చెప్పగా తప్పుగా ప్రచారం చేశారన్నారు. అది తనను బాధించిందని, తనకూ ఫ్యామిలీ ఉందని ఇలాంటివి చేయడం కరెక్ట్ కాదని ఆవేదన వ్యక్తం చేశారు.
పహల్గామ్ ఉగ్రదాడిలో మరణించిన వినయ్ నర్వాల్ కుటుంబానికి హరియాణా ప్రభుత్వం అండగా నిలిచింది. నర్వాల్ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు రూ.50 లక్షలు ఇవ్వనున్నట్లు సీఎం నయబ్ సింగ్ సైనీ ప్రకటించారు. నేవీలో లెఫ్టినెంట్గా ఉన్న నర్వాల్ పెళ్లి చేసుకొని హనీమూన్ కోసం పహల్గామ్ వెళ్లగా ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడిలో మరణించారు.
1791: మోర్స్ కోడ్ ఆవిష్కర్త, అమెరికన్ చిత్రకారుడు శామ్యూల్ మోర్స్ జననం
1989: సమరయోధుడు, విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం పోరాడిన తమనంపల్లి అమృతరావు మరణం
1994: దక్షిణాఫ్రికా ఫ్రీడమ్ డే
2001: తెలంగాణ రాష్ట్ర సమితి(ప్రస్తుత బీఆర్ఎస్) ఏర్పాటు
2004: సినీ నటుడు జేవీ సోమయాజులు మరణం
2017: బాలీవుడ్ నటుడు, నిర్మాత వినోద్ ఖన్నా మరణం
ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
Sorry, no posts matched your criteria.