India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోందంటూ CM చంద్రబాబు పెన్షన్దారులకు లేఖ రాశారు. దీన్ని పెన్షన్లతోపాటు జులై 1న ఉద్యోగులు పంపిణీ చేయనున్నారు. ‘మేనిఫెస్టోలో చెప్పినట్లుగా 65,18,496 మందికి పెంచిన పింఛన్లు అందిస్తున్నాం. దీనివల్ల నెలకు అదనంగా రూ.819 కోట్ల భారం పడుతున్నా మీ శ్రేయస్సు కోసం అమల్లోకి తెచ్చాం. రూ.7వేలు మీ ఇంటికి తెచ్చి ఇస్తున్నాం’ అని లేఖలో పేర్కొన్నారు.

TG: సీఎం రేవంత్ రెడ్డి రేపటి వరంగల్ టూర్ షెడ్యూల్ విడుదలైంది. మ.12.40 గంటలకు HYD నుంచి బయల్దేరి 1.30 గంటలకు వరంగల్ చేరుకుంటారు. టెక్స్టైల్ పార్క్, నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను పరిశీలిస్తారు. అనంతరం మహిళా శక్తి క్యాంటీన్లను ప్రారంభించనున్న ఆయన ఆ తర్వాత గ్రేటర్ వరంగల్ అభివృద్ధిపై సమీక్షిస్తారు. ఆ తర్వాత ఓ ప్రైవేట్ ఆస్పత్రిని ప్రారంభించి తిరిగి HYD బయల్దేరుతారు.

సౌతాఫ్రికా గత 26 ఏళ్లలో, ఇండియా గత 11 ఏళ్లలో ఒక్క ICC ట్రోఫీ కూడా గెలవలేదు. SA చివరగా 1998లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలవగా, IND 2013లో (CT) టైటిల్ సాధించింది. ఇక SA ఇప్పటివరకు ఒక్క ODI WC, T20 WC కూడా గెలవలేదు. దీంతో ఈసారైనా WC కలను నిజం చేసుకోవాలని ఆ జట్టు ఆశతో ఉంది. భారత్ కూడా మరో WCని తన ఖాతాలో వేసుకోవాలనే అపేక్షతో ఉంది. దీంతో రేపు ఎవరి కల నెరవేరుతుందోనని క్రీడాభిమానులు చర్చించుకుంటున్నారు.

AP: ఏడాదిలోగా ఉన్నత విద్యావ్యవస్థను ప్రక్షాళన చేస్తామని మంత్రి లోకేశ్ తెలిపారు. కాలేజీలు, యూనివర్సిటీల్లో చేపట్టాల్సిన మార్పులపై అధికారులతో ఆయన సమీక్షించారు. ‘పరిశ్రమల అవసరాలకు తగ్గట్లు కరిక్యులమ్ అప్గ్రేడ్ చేయాలి. నాలుగేళ్లు ఇంజినీరింగ్ చదివినా విద్యార్థికి రాని స్కిల్స్.. అమీర్పేటలో 4 నెలల శిక్షణ పొందితేనే ఎలా వస్తున్నాయి? కాలేజీల్లోనే అలాంటి శిక్షణ ఇచ్చేలా చూడాలి’ అని అధికారులను ఆదేశించారు.

కల్కి 2898ADతో మరో సూపర్ హిట్ సాధించిన ప్రభాస్ సరికొత్త రికార్డు సృష్టించారు. ఆయన నటించిన ఐదు సినిమాలు రిలీజైన తొలిరోజే రూ.100 కోట్లకుపైగా కలెక్షన్లను కొల్లగొట్టాయి. ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్ హీరోగా డార్లింగ్ నిలిచారు. బాహుబలి-2 రూ.217 కోట్లు, కల్కి రూ.191.5 కోట్లు, సలార్ రూ.178 కోట్లు, ఆదిపురుష్ రూ.140 కోట్లు, సాహో రూ.130 కోట్లు తొలిరోజే వసూలు చేశాయి.

TG: కేసీఆర్ గత 15 రోజులుగా ఎర్రవెల్లిలో నిరంతరాయంగా పార్టీ కార్యకర్తలతో భేటీ అవుతున్నారని బీఆర్ఎస్ తెలిపింది. ఆయనతో ప్రజల ఆత్మీయ సమావేశాలకు శనివారం నుంచి సోమవారం వరకు 3 రోజుల పాటు విరామం ఇవ్వాలని నిర్ణయించినట్లు వెల్లడించింది. పార్టీ నేతలతో కీలక సమావేశాలున్న నేపథ్యంలో పార్టీ నుంచి మరో ప్రకటన వచ్చే వరకూ ఎవరూ తనను కలవడానికి రావొద్దని కేసీఆర్ కోరారని పేర్కొంది.

AP: విద్యాదీవెన, వసతిదీవెన బకాయిలతో సర్టిఫికెట్లు అందక ఇబ్బందిపడుతున్న విద్యార్థులకు సర్టిఫికెట్లు అందించాలని అధికారులను మంత్రి లోకేశ్ ఆదేశించారు. ‘ఈ పథకాలకు YCP ప్రభుత్వం రూ.3480 కోట్లు బకాయిలు పెట్టింది. డైరెక్ట్ ఫీజు రీయింబర్స్మెంట్ విధానం తొలగించి.. ఈ విధానం అమలు చేసి విద్యార్థులను ఇబ్బందులకు గురిచేసింది. దీంతో 6 లక్షల మంది విద్యార్థుల సర్టిఫికెట్లు కాలేజీల్లో ఉన్నాయి’ అని ఆయన వెల్లడించారు.

దేశ నిర్మాణంలో కీలకమైన టీచర్లు నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇష్టంలేనివారు ఉద్యోగాన్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉండాలంది. బిహార్లో స్థానిక సంస్థల ద్వారా 4 లక్షల మంది ఉపాధ్యాయులను నియమించారు. వీరికి స్కూల్ టీచర్ల హోదా కల్పించేందుకు పరీక్ష నిర్వహిస్తుండగా, దీన్ని సవాల్ చేస్తూ పలువురు సుప్రీంను ఆశ్రయించారు. పరీక్ష రాయాల్సిందేనని ధర్మాసనం స్పష్టం చేసింది.

AP: వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబును కలిసిన మంగళగిరి ఎయిమ్స్ డైరెక్టర్ మధబానంద కర్ సమస్యలను ఏకరవుపెట్టారు. ఐదేళ్లుగా నీటి సమస్యను ప్రభుత్వం తీర్చకపోవడంపై సీఎం విస్మయం వ్యక్తం చేశారు. ఎయిమ్స్ను టాప్-3లో ఉంచేందుకు చర్యలు తీసుకుంటామని, పూర్తి సహకారం అందిస్తామని చంద్రబాబు ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. అటు AIIMSలో పర్యటించి, సౌకర్యాలు పరిశీలించాలని CMను డైరెక్టర్ కోరారు.

వాట్సాప్ ‘గ్రూప్ చాట్ ఈవెంట్స్’ అనే కొత్త ఫీచర్ను తీసుకొచ్చింది. దీని ద్వారా గ్రూప్లలోని సభ్యులు ఈవెంట్స్ను క్రియేట్ చేసి ఇతరులను ఆహ్వానించవచ్చు. ఈవెంట్కు సంబంధించిన వివరాలను పొందుపరచవచ్చు. దీని వివరాలు ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్ట్ అవుతాయి. తొలుత కమ్యూనిటీ గ్రూప్లకోసం తీసుకొచ్చిన ఈ ఫీచర్ను ఇప్పుడు సాధారణ గ్రూప్లకూ విస్తరించారు. ఇది యూజర్లకు దశలవారీగా అందుబాటులోకి రానుంది.
Sorry, no posts matched your criteria.