India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

టాలీవుడ్ స్టైలిష్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మూవీ ‘ఓజీ’. పవన్ గ్యాంగ్స్టర్గా కనిపించనుండంతో మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన మూవీ గ్లింప్స్ రికార్డ్ వ్యూస్ని సొంతం చేసుకుంది. తాజాగా మూవీలో విలన్ పాత్ర పోషిస్తున్న ఇమ్రాన్ హష్మీ ఫొటోను యూనిట్ షేర్ చేసింది. యుద్ధాన్ని ఊహించలేరు అంటూ క్యాప్షన్ ఇచ్చింది.

TG: ఆదిలాబాద్ జిల్లాలో BJPకి షాక్ తగిలే అవకాశం ఉంది. సిట్టింగ్ MP సోయం బాపురావు రెబల్గా పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. కిషన్రెడ్డి సహా పలువురు కీలక నేతలు బుజ్జగించినా సోయం వెనక్కి తగ్గడం లేదు. పార్టీ కార్యక్రమాలకు డుమ్మా కొడుతున్న ఆయన.. క్యాడర్ ఉన్న తాను కావాలో? వలస నేత కావాలో తేల్చుకోవాలని అధిష్ఠానానికి సవాల్ విసిరారు. ఆదివాసీ పెద్దలతో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని సోయం తెలిపారు.

TG: ఒక ఆస్తి మొదటి రిజిస్ట్రేషన్ రద్దు కాకుండా తర్వాత కొనుగోలు చేసిన వారు హక్కులు పొందలేరని హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఓ కేసు విచారణ సందర్భంగా జస్టిస్ నగేష్ చిన్న కథ చెప్పారు. ‘పాండవులకు 5 గ్రామాలు ఇవ్వాలని దుర్యోధనుడిని కృష్ణుడు అడిగాడు. వాటిని సామంతులకు ఇచ్చాను.. పాండవులకు ఇవ్వలేనని దుర్యోధనుడు చెప్తాడు. ఆ ప్రకారం ఆస్తిపై హక్కులు కోల్పోయిన వారు ఇతరులకు హక్కులను ఇవ్వలేరు’ అని పేర్కొన్నారు.

AP: అమలాపురంలో MLA అభ్యర్థులకు అసంతృప్తుల టెన్షన్ పట్టుకుంది. YCP అభ్యర్థి విశ్వరూప్ని వ్యతిరేకిస్తున్న వర్గం అసంతృప్తితోనే ఆయన వెంట నడుస్తున్నట్లు తెలుస్తోంది. TDP అభ్యర్థి ఆనందరావునీ చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. జనసేన ఆశావహులు అసంతృప్తిగా ఉన్నారు. 1994, 2004లో ఇక్కడ రెబల్స్ ఇండిపెండెంట్లుగా పోటీ చేయగా అసంతృప్తులంతా మద్దతిచ్చారు. 2004లో ఇండిపెండెంట్ గెలిచారు. దీంతో నేతలకు ఈ భయం పట్టుకుంది.

ఇటీవల మొబైల్ ఫోన్లు పేలిపోతున్న ఘటనలు భయాందోళనలకు గురిచేస్తున్నాయి. తాజాగా హిమాచల్ ప్రదేశ్లోని హమీర్పూర్లో ఓ కోచింగ్ సెంటర్లో క్లాస్ జరుగుతుండగా విద్యార్థిని జేబులోని రెడ్మీ ఫోన్ నుంచి మంటలు వచ్చాయి. ఆమె వెంటనే ఫోన్ను రోడ్డుపైకి విసిరేయగా, సైన్ బోర్డుకు తగిలి పేలిపోయింది. స్థానికులు మంటలు ఆర్పేశారు. అక్కడికి సమీపంలోనే దుస్తుల షాపులు ఉన్నాయి. అటువైపు ఫోన్ పడి ఉండే పెద్ద ప్రమాదం జరిగేది.

దేశ వ్యాప్తంగా ఎన్నికల నగారా మోగింది. ఈ క్రమంలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించే వారిపై ఫిర్యాదు చేసేందుకు గూగుల్ ప్లే స్టోర్లో సీ-విజిల్ యాప్ని EC ప్రవేశపెట్టింది. దీంట్లో ఫిర్యాదు చేసిన వెంటనే ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ టీమ్లు రంగంలోకి దిగుతాయి. ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరిస్తాయి. ఆపై ఆర్వో చర్యలు తీసుకుంటారు. 100 నిమిషాల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుంది. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతారు.

తమిళనాడు రాష్ట్రానికి నిధుల కేటాయింపు విషయంలో మంత్రి ఉదయనిధి స్టాలిన్ కేంద్రంపై విరుచుకుపడ్డారు. రాష్ట్రం చెల్లించే ప్రతి రూపాయి పన్నుకి రూ.28 పైసలే కేంద్రం వెనక్కి ఇస్తోందని మండిపడ్డారు. దీంతో బీజేపీ పాలిత రాష్ట్రాలకు లబ్ధి జరుగుతోందని అన్నారు. ఇక నుంచి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ’28 పైసా పీఎం’ అని పిలుద్దామంటూ ఫైర్ అయ్యారు. తమిళనాడుపై మోదీ ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని ఆరోపించారు.

హీరో ధనుష్ను తాను 2వ పెళ్లి చేసుకోనున్నట్లు జరుగుతున్న ప్రచారంపై హీరోయిన్ మీనా స్పందించారు. ‘డబ్బు కోసం ఏమైనా రాస్తారా? సోషల్ మీడియా దిగజారిపోతుంది. వాస్తవాలు తెలుసుకుని రాస్తే.. అందరికీ మంచిది. నాలా ఒంటరిగా జీవించే మహిళలు చాలామంది ఉన్నారు. నా పేరెంట్స్, కుమార్తె భవిష్యత్తు గురించి కూడా ఆలోచించండి. ప్రస్తుతానికి 2వ పెళ్లి ఆలోచన లేదు. వస్తే నేను స్వయంగా వెల్లడిస్తా’ అని ఓ ఇంటర్వ్యూలో స్పందించారు.

TG: ఏప్రిల్ 1 నుంచి కానిస్టేబుల్ అభ్యర్థులకు TSSP <

చెన్నై సౌత్ స్థానం నుంచి BJP MP అభ్యర్థిగా పోటీ చేస్తున్న తమిళిసైకి సిట్టింగ్ MP, DMK అభ్యర్థి తమిళచ్చి తంగపాండియన్ ప్రధాన ప్రత్యర్థిగా ఉండనున్నారు. వీరిద్దరి మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. మంత్రి తెన్నరసు సోదరిగా బలమైన రాజకీయ నేపథ్యం ఉండటం, అధికార పార్టీ అభ్యర్థి కావడం తమిళచ్చికి కలిసొస్తుందని చెబుతున్నారు. ఆమెపై గెలవడం సులువు కాదని, చాలా కష్టపడాల్సి ఉంటుందని అంటున్నారు.
Sorry, no posts matched your criteria.