India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న డేటాకు INDలో ఆశ్రయం కల్పిస్తామని PM మోదీ ప్రకటించారు. డేటా సెంటర్లు యువతకు భారీగా ఉద్యోగాలను కల్పిస్తాయన్నారు. ‘కంప్యూటింగ్ పవర్, డేటా సెంటర్ ఇన్ఫ్రా సామర్థ్యాన్ని భారత్ పెంచుకుంటోంది. తద్వారా ఏఐ ఎకోసిస్టమ్కు పునాది వేస్తోంది. ఈ ఏడాది 7 ప్రధాన నగరాల్లోని డేటా సెంటర్ల సామర్థ్యం 1.7GW దాటుతుందని అంచనా’ అని పేర్కొన్నారు. కాగా రేపు ఢిల్లీలో <<19143850>>ఏఐ సమ్మిట్ను<<>> PM ప్రారంభించనున్నారు.

సినీ హీరో ప్రభాస్ గాయపడినట్లు సమాచారం. ఫౌజీ సినిమా షూటింగ్లో హార్స్ రైడ్ చేస్తుండగా ఆయనకు గాయమైనట్లు సినీవర్గాలు తెలిపాయి. దీంతో ఇవాళ షూటింగ్కు బ్రేక్ తీసుకున్నారని, రేపట్నుంచి మళ్లీ చిత్రీకరణలో పాల్గొంటారని టాక్. హను రాఘవపూడి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం కీలకదశలో ఉంది. అటు సంక్రాంతికి వచ్చిన రాజాసాబ్ సక్సెస్ కాకపోవడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఈ మూవీపైనే ఆశలు పెట్టుకున్నారు.

సృష్టి, స్థితి, లయ అనే 3 కార్యాలలో శివుడు ‘లయకారుడు’. అంటే ఈ విశ్వాన్ని ఉపసంహరించేవాడు అని అర్థం. అయితే ఈ లయం ప్రతికూలమైనది కాదు. పాతది అంతమైతేనే కొత్త సృష్టికి మార్గం సుగమమవుతుంది. శివుడు తన తాండవంతో అజ్ఞానం, అహంకారాన్ని లయం చేసి, ఆత్మను దైవంలో విలీనం చేస్తాడు. మనలో చెడు ఆలోచనలను నశింపజేసి, జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. అందుకే ఆయనను సృష్టి చక్రంలో మార్పును తెచ్చే పరమాత్మగా పూజిస్తారు.

ఇంజినీరింగ్ విద్యకు ఎంతో క్రేజ్ ఉంది. దానికి తగ్గట్లే ఎన్నో వర్సిటీలు ప్రపంచవ్యాప్తంగా వెలిశాయి. ఈ విద్యకు 300 ఏళ్ల కిందటే నాంది పడింది. JAN 18, 1707న చెక్ రిపబ్లిక్ రాజధాని అయిన ప్రేగ్లో చెక్ టెక్నికల్ వర్సిటీని రోమన్ చక్రవర్తి జోసెఫ్-1 స్థాపించారు. ఇదే వరల్డ్స్ ఫస్ట్ ఇంజినీరింగ్ వర్సిటీ. సైనిక కోటలు, మౌలిక సదుపాయాల నిర్మాణాలపై విద్యార్థులకు శిక్షణ ఇచ్చేవారు. క్రమంగా దీన్ని విస్తరించారు.

T20WC: పాకిస్థాన్తో జరుగుతున్న మ్యాచ్లో భారత్ 175/7 స్కోర్ చేసింది. ఇషాన్ కిషన్ 77(40 B) క్రీజులో ఉన్నంత వరకు స్కోర్ పరిగెత్తినా తర్వాత నెమ్మదించింది. అభిషేక్ 0, తిలక్ వర్మ 25, సూర్య 32, హార్దిక్ 0, దూబే 27, రింకూ సింగ్ 11* పరుగులు చేశారు. పాక్ బౌలర్లలో అయూబ్ 3, సల్మాన్ అఘా, తారిఖ్, షాహీన్ తలో వికెట్ తీశారు. ఆ జట్టులో 18 ఓవర్లను స్పిన్నర్లే వేయడం గమనార్హం. పాక్ లక్ష్యం 176.

T20WC: పాకిస్థాన్తో జరుగుతున్న మ్యాచ్లో భారత్ 175/7 స్కోర్ చేసింది. ఇషాన్ కిషన్ 77(40 B) క్రీజులో ఉన్నంత వరకు స్కోర్ పరిగెత్తినా తర్వాత నెమ్మదించింది. అభిషేక్ 0, తిలక్ వర్మ 25, సూర్య 32, హార్దిక్ 0, దూబే 27, రింకూ సింగ్ 11* పరుగులు చేశారు. పాక్ బౌలర్లలో అయూబ్ 3, సల్మాన్ అఘా, తారిఖ్, షాహీన్ తలో వికెట్ తీశారు. ఆ జట్టులో 18 ఓవర్లను స్పిన్నర్లే వేయడం గమనార్హం. పాక్ లక్ష్యం 176.

T20WC: పాకిస్థాన్తో జరుగుతున్న మ్యాచ్లో భారత్ 175/7 స్కోర్ చేసింది. ఇషాన్ కిషన్ 77(40 B) క్రీజులో ఉన్నంత వరకు స్కోర్ పరిగెత్తినా తర్వాత నెమ్మదించింది. అభిషేక్ 0, తిలక్ వర్మ 25, సూర్య 32, హార్దిక్ 0, దూబే 27, రింకూ సింగ్ 11* పరుగులు చేశారు. పాక్ బౌలర్లలో అయూబ్ 3, సల్మాన్ అఘా, తారిఖ్, షాహీన్ తలో వికెట్ తీశారు. ఆ జట్టులో 18 ఓవర్లను స్పిన్నర్లే వేయడం గమనార్హం. పాక్ లక్ష్యం 176.

TG: జగిత్యాల మున్సిపాలిటీ పీఠంపై ఉత్కంఠ వీడినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ జెండా మోసిన వారికే ఛైర్మన్ పదవి ఇవ్వాలని అధిష్ఠానం నిర్ణయించింది. MLA సంజయ్, జీవన్రెడ్డితో మంత్రి అడ్లూరి, AICC సెక్రటరీ సవాంగ్ మాట్లాడారు. ఇరువర్గాలకు నచ్చజెప్పి పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలన్నారు. 23 మంది అభ్యర్థులతో MLA సంజయ్ క్యాంప్ ఏర్పాటు చేయగా, 14 మందితో జీవన్ రెడ్డి హైదరాబాద్ చేరుకున్న విషయం తెలిసిందే.

జీవితంలో చదువుకు, సక్సెస్కు సంబంధం లేదని HCL మాజీ సీఈవో వినీత్ నాయర్ స్పష్టం చేశారు. ఒకవేళ బోర్డు పరీక్షలు, మార్కులే జీవితాన్ని డిసైడ్ చేస్తే 50 శాతం మంది సీఈవోలు నిరుద్యోగులుగా ఉంటారన్నారు. విద్యార్థులు ప్రశాంతంగా, స్థిరంగా ఉండాలని, మార్కుల గురించి ఆందోళన చెందవద్దని సూచించారు. పరీక్షల ఒత్తిడిలో ఉన్న స్టూడెంట్లు, వారి తల్లిదండ్రులకు ఈ కామెంట్లు ప్రేరణగా నిలుస్తాయని నెటిజన్లు కొనియాడుతున్నారు.

వాయువ్య మూల దోషపూరితంగా ఉంటే ఆ ఇంట్లో మానసిక అశాంతి, ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు చెబుతున్నారు. అలాంటి స్థలంలో ఉండేవారు ఎంత కష్టపడినా తగిన గుర్తింపు, ఫలితం లభించదని అంటున్నారు. ‘చేతికి అందాల్సిన అదృష్టం చేజారిపోతుంది. పిల్లల భవిష్యత్తు, ఇంటి పెద్దల ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అవసరానికి ఎవరూ ఆదుకోరు. కోర్టు కేసులు, శత్రుబాధలు పెరిగే ఛాన్సుంది’ అంటున్నారు.<<-se>>#Vasthu<<>>
Sorry, no posts matched your criteria.