News July 8, 2024

ఈరోజు న్యూస్ HEADLINES

image

* జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట.. ఒకరు మృతి, 400 మందికి గాయాలు
* TG: గ్రూప్-1 ఫలితాలు విడుదల
* MPలు కలిసి పోరాడాలన్న రేవంత్.. సాధ్యం కాదన్న CBN
* TG: అసంపూర్తి ప్రాజెక్టులపై CM రేవంత్ ఫోకస్
* AP: జనసేన శ్రేణులకు డిప్యూటీ CM పవన్ వార్నింగ్
* కాంగ్రెస్, BRSను అభినందిస్తున్నా: CBN
* 2వ టీ20లో జింబాబ్వేపై భారత్ విజయం
* ఇండియా, సౌతాఫ్రికా మహిళల 2వ టీ20 రద్దు

News July 8, 2024

‘ఆయుష్మాన్ భారత్’ ₹10లక్షలకు పెంపు?

image

జాతీయ ఆరోగ్య సంరక్షణ పథకంలో భాగంగా కేంద్రం అమలు చేస్తోన్న ‘ఆయుష్మాన్ భారత్’ పరిమితిని ₹10లక్షలకు పెంచనున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు లబ్ధిదారుల సంఖ్యనూ రెండింతలు చేసేందుకు యోచిస్తోందట. రాబోయే బడ్జెట్లో ఈ పథకంపై కీలక ప్రకటన చేసే ఛాన్స్ ఉందని సమాచారం. ప్రస్తుతం దీని కింద అర్హులకు ₹5లక్షలు అందుతోంది. ఒకవేళ పెంచితే ప్రభుత్వంపై ప్రతి ఏడాది రూ.12వేల కోట్లు అదనపు భారం పడుతుందని అంచనా.

News July 7, 2024

పిడుగుల పాటుకు 10 మంది మృతి

image

బిహార్‌ను పిడుగుల వర్షాలు వణికిస్తున్నాయి. గడిచిన 24గంటల్లో ఆ రాష్ట్ర వ్యాప్తంగా పిడుగు పాటుకు 10 మంది ప్రాణాలు కోల్పోయారు. గత రెండు వారాల్లో పిడుగులు పడి దాదాపు 40మంది మృతిచెందడం గమనార్హం. ప్రకృతి వైపరీత్యంతో సంభవించిన ఈ ఘటనల్లో మృతుల కుటుంబాలకు సీఎం నీతీశ్ కుమార్‌ ఎక్స్‌గ్రేషియో ప్రకటించారు. ఒక్కో కుటుంబానికి రూ.4లక్షల చొప్పున ఇవ్వనున్నట్టు తెలిపారు.

News July 7, 2024

CM చంద్రబాబును కలిసిన BRS ఎమ్మెల్యేలు

image

TGలో పర్యటిస్తున్న AP CM చంద్రబాబుతో ఇద్దరు BRS ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ HYDలోని చంద్రబాబు ఇంటికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో గెలిచి, AP ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసి శాలువాతో సన్మానించారు.

News July 7, 2024

రోహిత్ రికార్డును బ్రేక్ చేసిన అభిషేక్ శర్మ

image

ఈ ఏడాది టీ20ల్లో అత్యధిక సిక్సులు(50) కొట్టిన ఇండియన్ బ్యాటర్‌గా అభిషేక్ శర్మ నిలిచారు. రోహిత్ శర్మ(46) పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశారు. ఇవాళ జింబాబ్వేతో రెండో టీ20లో అభిషేక్ 8 సిక్సులు బాదారు. ఈ ఏడాది ఐపీఎల్‌లో అతను 42 సిక్సులు నమోదు చేసి టోర్నీలో అత్యధిక సిక్సులు కొట్టిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే.

News July 7, 2024

ఇండియాVSసౌతాఫ్రికా మ్యాచ్ రద్దు

image

ఇండియా, సౌతాఫ్రికా మహిళల 2వ టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 20 ఓవర్లలో 177/6 స్కోర్ చేసింది. ఇన్నింగ్స్ బ్రేక్ సమయంలో మొదలైన వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఇప్పటికే తొలి మ్యాచ్‌ గెలిచిన సౌతాఫ్రికా 3టీ20ల సిరీస్‌లో 1-0తో ముందుంది. సిరీస్ సమం కావాలంటే మిగిలిన 3వ T20లో భారత్ గెలిచి తీరాల్సిందే.

News July 7, 2024

టీటీడీలో అక్రమాలపై ప్రభుత్వం ఫోకస్.. కొనసాగుతున్న సోదాలు!

image

AP: టీటీడీలో అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ కొనసాగిస్తోంది. విజిలెన్స్ ఎస్పీ కరీముల్లా షరీఫ్ ఆధ్వర్యంలో అధికారుల బృందం టీటీడీ పరిపాలనా భవనంలో సోదాలు చేస్తోంది. మరో 10 రోజులపాటు విచారణ కొనసాగనున్నట్లు సమాచారం. నిబంధనలను అతిక్రమించి నిధులు కేటాయించడం, ఇంజినీరింగ్ పనులు చేపట్టడంతో పాటు నిధుల వినియోగం, శ్రీవాణి టికెట్ల కేటాయింపు తదితర అంశాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.

News July 7, 2024

TRSను BRSగా మార్చి పేగుబంధం తెంచుకున్నాం: వినోద్

image

TG: టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చడం వల్ల తాము తెలంగాణతో పేగుబంధం తెంచుకున్నామని, దురదృష్టవశాత్తు ఇందులో తాను కూడా పాత్రధారినేనని మాజీ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు.. బీఆర్ఎస్ పవర్‌లో లేకపోయినా పవర్‌ఫుల్ పార్టీ అని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌తో మాట్లాడి తెలంగాణ అంశంతో ముడి విడిపోకుండా పార్టీని సన్నద్ధం చేస్తామని తాజాగా జరిగిన పార్టీ మీటింగ్‌లో చెప్పారు.

News July 7, 2024

బాయ్‌ఫ్రెండ్ కోసం ఎయిర్‌పోర్టుకు బెదిరింపు కాల్

image

పుణేకు చెందిన ఇంద్రా రాజ్వర్(29) అనే యువతి తన బాయ్‌ఫ్రెండ్ ప్రయాణాన్ని అడ్డుకోవాలనే ఉద్దేశంతో బెంగళూరులోని కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు కాల్ చేశారు. తన బాయ్‌ఫ్రెండ్ ముంబై వెళ్లేందుకు విమానాశ్రయం వచ్చాడని, అతడి వద్ద బాంబు ఉందని ఆమె అధికారులకు తప్పుడు సమాచారమిచ్చారు. జూన్ 26న ఈ సంఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఆమెపై FIR నమోదు చేశారు.

News July 7, 2024

ఇండియా విజయం.. కాంగ్రెస్ ఎంపీపై సెటైర్లు

image

జింబాబ్వేపై రెండో టీ20లో భారత్ విజయం సాధించడంతో కొందరు కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌పై సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేస్తున్నారు. తొలి మ్యాచ్‌లో భారత్ ఓడటంపై థరూర్ స్పందిస్తూ ‘సీనియర్లను పంపాల్సి వస్తే సిరీస్ పోస్ట్‌పోన్ అవుతుందని ఇండియాAను జింబాబ్వేకు పంపింది. ఈ ఓటమితో BCCI అహంకారం తగ్గింది’ అని అన్నారు. కాగా తాజాగా అదే జట్టు గెలవడంతో థరూర్‌ విమర్శలకు కేంద్ర బిందువయ్యారు.