India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన ఎమ్మెల్సీ కవితకు తన తల్లి, పిల్లల్ని కలిసేందుకు రౌస్ అవెన్యూ కోర్టు అనుమతిచ్చింది. ఆమె పిటిషన్పై విచారణను చేపట్టిన కోర్టు ఈమేరకు అనుమతి మంజూరు చేసింది. కవిత ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్నారు.

సమంత, బాలీవుడ్ నటుడు వరుణ్ ధవన్ కాంబినేషన్లో వస్తున్న సిరీస్కు టైటిల్ ఫిక్స్ అయ్యింది. ‘సిటాడెల్: హనీ-బన్నీ’(Citadel Honey Bunny) పేరుతో ఈ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో మరో బాలీవుడ్ స్టార్ ప్రియాంకా చోప్రా కీలక పాత్ర పోషించనున్నారు. రాజ్&డీకే దర్శకత్వంలో వస్తున్న ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్లో విడుదల కానుంది.

TG: రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో 30 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ.వేణుగోపాల్ అన్నారు. గ్రామీణ యువత, మహిళల సమస్యలను పరిష్కరిస్తూ దేశ ప్రజలకు హామీలు ఇస్తున్నామన్నారు. కర్ణాటక, తెలంగాణలో ప్రకటించిన గ్యారంటీలను అమలు చేశామని అన్నారు. అదే విధంగా దేశ ప్రజలకు కూడా హామీలు ఇస్తున్నామని, వాటిని నెరవేరుస్తామని పేర్కొన్నారు.

AP: తిరుమలలో మార్చి 20 నుంచి 24 వరకు శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు నిర్వహించనున్నారు. రాత్రి 7 గంటల నుంచి 8గంటల వరకు పుష్కరిణిలో స్వామి, అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. తెప్పోత్సవంలో భాగంగా తొలి రోజు శ్రీ సీతాలక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి భక్తులను కనువిందు చేయనున్నారు.

బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు మరోసారి పెరిగాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.420 పెరిగి రూ.60,800కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.460 పెరగడంతో రూ.66,330గా ఉంది. కేజీ వెండి ధర రూ.300 పెరగడంతో రూ.80,300కు చేరింది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

తెలంగాణలో రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. రేపు అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. ఇవాళ NZB, ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలకు, రేపు నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అటు ఏపీలోని అల్లూరి, కోనసీమ, తూ.గో., ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయంది.

రన్ మెషీన్ విరాట్ కోహ్లీ IPLలో అద్భుతంగా ఆడుతూ ప్రత్యర్థి టీమ్కు చుక్కలు చూపిస్తుంటారు. అయితే ఐపీఎల్ ఆరంభ సీజన్ నుంచి ఇప్పటివరకు 237 మ్యాచ్లు ఆడిన కింగ్.. 7263 పరుగులు చేశారు. కాగా ఏయే జట్టుపై కోహ్లీ ఎన్ని పరుగులు చేశారో తెలుసుకుందాం. DCపై 1030 రన్స్, CSK – 985, KKR- 861, PBKS- 861, MI-852, SRH-669, RR-618, GT-232, LSGపై 117 పరుగులు చేశారు.

AP: ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ-జనసేన తరఫున వంగవీటి రాధా ప్రచారం చేస్తారని తెలుస్తోంది. ఎన్నికల్లో పోటీ చేయకుండా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్తో కలిసి కాపులు అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో తిరుగుతారని సమాచారం. అయితే టీడీపీలో టికెట్ దక్కనందున జనసేనలో చేరి అవనిగడ్డ నుంచి పోటీ చేస్తారని ఆయన అనుచరులు చెబుతున్నారు. నిన్న నాదెండ్ల మనోహర్, ఇవాళ ఎంపీ బాలశౌరితో సమావేశం కావడంతో ఈ వార్తలకు బలం చేకూరుతోంది.

ఈసీ మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. 24 గంటల వ్యవధిలోనే పశ్చిమబెంగాల్ డీజీపీని మార్చింది. నిన్న రాజీవ్ కుమార్ స్థానంలో వివేక్ సహాయ్ను నియమించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన స్థానంలో సంజయ్ ముఖర్జీని నియమించింది. ఈసీ నిర్ణయం కాస్త రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది.

వరల్డ్ మోస్ట్ పాపులర్ యూట్యూబర్ మిస్టర్ బీస్ట్ (జిమ్మీ డోనాల్డ్సన్) తన బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ను అనౌన్స్ చేశారు. తాను అతిపెద్ద గేమ్ షోను చిత్రీకరించబోతున్నానని ట్వీట్ చేశారు. దీనిని అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ చేస్తామని చెప్పారు. ఈ గేమ్ షోలో వెయ్యి కంటే ఎక్కువ మంది గేమర్స్ పోటీ పడతారని, 5 మిలియన్ల డాలర్ల ( దాదాపు రూ.41 కోట్లు) బహుమతి ఉంటుందని తెలిపారు. దీనికి కాస్త టైమ్ పడుతుందని వెల్లడించారు.
Sorry, no posts matched your criteria.