India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

రవీంద్ర జడేజా, రచిన్ రవీంద్ర ఒకే ఫ్రేమ్లో కనిపించారు. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్న ఇరువురూ ఆర్సీబీతో మ్యాచ్ అనంతరం ఫొటోకు పోజులిచ్చారు. నిన్నటి మ్యాచ్లో ఈ ఇద్దరు ప్లేయర్లు సీఎస్కే విజయంలో కీలక పాత్ర పోషించారు. 15 బంతుల్లోనే 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 37 పరుగులు చేసిన రచిన్ చెన్నై టాప్ స్కోరర్గా నిలిచిన విషయం తెలిసిందే. 25* రన్స్తో జడేజా జట్టును విజయతీరాలకు చేర్చారు.

ఎన్నికల పర్వంలో ప్రచార రథాలదే కీలక పాత్ర. ప్రతి ఐదేళ్లకోసారి వచ్చే ఎన్నికల్లో ఇవి లేకుంటే ప్రచారం ముందుకు సాగదు. పోలింగ్ తేదీకి మరో 50 రోజులే ఉండటంతో ఆయా పార్టీల నేతలు ప్రచార రథాలను ఆధునిక హంగులతో తయారు చేయించుకుంటున్నారు. ముఖ్య నేతల చిత్రాలతో పాటు అభ్యర్థి కూడా కనిపించే విధంగా సిద్ధం చేసుకుంటున్నారు. వచ్చే నెల మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఆయా పార్టీల ప్రచారాలు హోరెత్తనున్నాయి.

TG: రాష్ట్ర ప్రభుత్వం టెట్ ఫీజును భారీగా పెంచింది. ఒక్కో పేపర్ ఫీజును రూ.1,000గా ప్రకటించింది. రెండు పేపర్లు రాసేవారు రూ.2,000 చెల్లించాలి. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 27 నుంచి ఏప్రిల్ 10 వరకు https://schooledu.telangana.gov.in/ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. మే 15 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొంది.

AP: అధికారులు మోసం చేశారంటూ కుటుంబం <<12908035>>ఆత్మహత్య<<>> చేసుకున్న ఘటనపై BJP జాతీయ నేత సత్యకుమార్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘సొంత జిల్లాలో ఇలాంటి దారుణాలు జరుగుతున్నా CMకు చీమ కుట్టినట్లు కూడా లేదు. ఈ ఆత్మహత్యలన్నీ YCP ప్రభుత్వ హత్యలే. ప్రజల నుంచి దోచుకున్న ఆస్తులను చట్టబద్ధం చేసుకునేందుకే భూ యాజమాన్య చట్టం తెచ్చారు. అధికారంలోకి రాగానే ప్రతి పైసా కక్కిస్తాం’ అని ట్వీట్ చేశారు.

రష్యా రాజధాని మాస్కోలో <<12908235>>కాల్పుల<<>> ఘటనకు కారణం తామేనని ఐసిస్-K ప్రకటించుకుంది. రష్యా అధ్యక్షుడు పుతిన్, ఆయన విధానాలను ఈ గ్రూప్ ఎప్పటి నుంచో తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ముస్లింలను అణిచివేసే కార్యకలాపాల్లో రష్యా భాగస్వామిగా ఉందని విశ్వసిస్తోంది. అందుకే రష్యాను టార్గెట్ చేసి ఎటాక్ చేసినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఈ గ్రూప్ గతంలో అఫ్గానిస్థాన్, ఇరాన్, కాబుల్ ఎయిర్పోర్టులలో భయంకర దాడులు జరిపింది.

తన సినీ, వ్యక్తిగత జీవితం గురించి వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక విషయాలు తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘నా తొలి చిత్రం పోడాపోడీ షూటింగ్ సమయానికి నా ఏజ్ 22ఏళ్లు. 28ఏళ్లలోపు స్టార్గా ఎదిగి, 32ఏళ్లకు పెళ్లి చేసుకుని, 34ఏళ్లకు పిల్లల్ని కనాలనుకున్నా. ఇప్పుడు నా వయసు 38 ఏళ్లు. నేను వేసుకున్న ప్రణాళికలేవీ వర్కవుట్ కాలేదు’ అని చెప్పారు. ఇటీవల సచ్దేవ్తో ఆమె ఎంగేజ్మెంట్ జరిగిన విషయం తెలిసిందే.

దేశంలో సంచలనంగా మారిన ఎలక్టోరల్ బాండ్లపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు. ‘ఆర్థిక వనరులు లేకుండా ఏ పార్టీ మనుగడ సాధించలేదు. కొన్ని దేశాల్లో పార్టీలకు ప్రభుత్వమే నిధులు ఇస్తుంది. అలాంటి వ్యవస్థ మన దగ్గర లేనందున మంచి ఉద్దేశంతోనే ఎన్నికల బాండ్ల పథకాన్ని తీసుకొచ్చాం. అధికారంలో ఉన్న పార్టీ మారితే సమస్యలు తలెత్తకూడదనే దాతల పేర్లు బయటపెట్టలేదు’ అని తెలిపారు.

ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను రౌస్ అవెన్యూ కోర్టు విచారణకు స్వీకరించింది. ఈ నెల 26న వాదనలు వింటామని తెలిపింది. మరోవైపు కవిత కస్టడీని 3 రోజులు పొడిగించిన విషయం తెలిసిందే.

AP: విశాఖ డ్రగ్స్ కేసు వ్యవహారంపై YCP, టీడీపీ మధ్య వార్ నడుస్తోంది. సీఎం జగన్, విజయసాయిరెడ్డి, సజ్జల భార్గవ్లను టార్గెట్ చేస్తూ TDP సోషల్ మీడియాలో విమర్శలు చేసింది. YCP అంటే యువజన కొకైన్ పార్టీ అని వ్యంగ్యాస్త్రాలు సంధించింది. కాగా ఈ కేసులో నిందితులు, TDP సీనియర్ నేతలకు మధ్య ఆర్థిక లావాదేవీలు ఉన్నాయంటూ YCP కౌంటర్ ఇచ్చింది. డ్రగ్స్తో అడ్డంగా దొరికిపోయి TDP బుకాయిస్తోందని దుయ్యబట్టింది.

వడోదర బీజేపీ ఎంపీ రంజనాబెన్ భట్ వచ్చే లోక్సభ ఎన్నికల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. గుజరాత్లోని వడోదర స్థానం బీజేపీకి కంచుకోట లాంటిది. 2014 ఎన్నికల్లో మోదీ వారణాసితో పాటు ఇక్కడి నుంచి కూడా పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత వడోదర స్థానానికి మోదీ రాజీనామా చేయగా ఉప ఎన్నికలో రంజనా గెలుపొందారు.
Sorry, no posts matched your criteria.