News February 17, 2025
PAK links: గౌరవ్ గొగోయ్ను ట్రాప్ చేశారేమోనన్న హిమంత

భారత వ్యతిరేక అతిపెద్ద కుట్రలో కాంగ్రెస్ MP గౌరవ్ గొగోయ్ బహుశా బ్లాక్మెయిల్ లేదా ట్రాప్ అయ్యారేమోనని అస్సాం CM హిమంత అన్నారు. దర్యాప్తునకు ఆదేశించే ముందు మాట్లాడారు. ‘ఇది కేవలం గౌరవ్ గొగోయ్ అంశం కాదు. దీనివెనక భారత వ్యతిరేక శక్తులున్నట్టు మా వద్ద ఆధారాలు ఉన్నాయి. మొత్తం ఎకోసిస్టమ్లో గౌరవ్ ఒక పావు మాత్రమే. సూత్రదారి కాదు. ప్రస్తుతానికి మేం అతడిని నిందితుడిగా కాకుండా జాలితో చూస్తున్నాం’ అన్నారు.
Similar News
News March 19, 2025
సునీత గురించి ఈ విషయాలు తెలుసా?

సునీతా విలియమ్స్ 1987లో అమెరికా నేవీలో చేరారు. నావల్ కోస్టల్ సిస్టమ్ కమాండర్, డైవింగ్ ఆఫీసర్, నావల్ ఎయిర్ ట్రైనింగ్ కమాండర్గా పని చేశారు. మధ్యదరా, పర్షియన్ గల్ఫ్, ఎర్ర సముద్రంలో డ్యూటీ చేశారు. ఎన్నో భారీ హెలికాప్టర్లు, యుద్ధ విమానాలు నడిపిన అనుభవాన్ని గడించారు. 1998లో నాసాలో చేరారు. తొలిసారిగా 2006లో ISSకు వెళ్లారు. 2007లో స్పేస్లో మారథాన్ చేసిన తొలి వ్యక్తిగా రికార్డు సృష్టించారు.
News March 19, 2025
సునీత విషయంలో రాజకీయం!

సునీత, విల్మోర్ 8 రోజుల్లో తిరిగి రావాల్సి ఉన్నా బోయింగ్ స్టార్ లైనర్లో సమస్యలతో అక్కడే ఉండిపోయారు. అప్పటికే బోయింగ్ కంపెనీకి చెందిన పలు విమానాల్లో సాంకేతిక సమస్యలు వచ్చాయి. ప్రతిష్ఠాత్మకమైన ఇలాంటి యాత్రలకు బైడెన్ సర్కార్ ఆ కంపెనీనే సెలక్ట్ చేయడంపై విమర్శలు వచ్చాయి. ఇక ఎలాన్ మస్క్ ట్రంప్ అధికారంలోకి రాకముందు వారిని తీసుకొస్తే బైడెన్కు మైలేజీ పెరుగుతుందని ఆలస్యం చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
News March 19, 2025
సునీత రెండుసార్లు స్పేస్ వాక్ చేశారు: నాసా

అంతరిక్షం నుంచి వచ్చిన నలుగురు వ్యోమగాములు ఆరోగ్యంగా ఉన్నారని నాసా వెల్లడించింది. అన్ డాకింగ్ నుంచి సాఫ్ట్ ల్యాండింగ్ వరకు అన్నీ అనుకున్నట్లు జరిగాయని తెలిపింది. స్పేస్ ఎక్స్, నాసా సమష్టి కృషితో వారిని భూమిపైకి తీసుకొచ్చామని పేర్కొంది. ఈ యాత్రను విజయవంతం చేయడంలో స్పేస్ ఎక్స్ కీలకపాత్ర పోషించిందని ప్రశంసించింది. ఈ యాత్రలో సునీత రెండుసార్లు స్పేస్ వాక్ చేశారని వివరించింది.