News December 20, 2024
పాక్ మాకు ప్రమాదకరంగా మారుతోంది: అమెరికా
పాక్ ఖండాంతర క్షిపణుల్ని అభివృద్ధి చేయడంపై అమెరికా జాతీయ భద్రత సహాయ సలహాదారు జాన్ ఫైనర్ తాజాగా ఆందోళన వ్యక్తం చేశారు. ‘దీర్ఘ పరిధి బాలిస్టిక్ మిస్సైల్స్ను పాక్ అభివృద్ధి చేస్తోంది. ఆ క్షిపణులు మా వరకూ రాగలవు. వీటి అభివృద్ధి వెనుక పాక్ ఉద్దేశాలు అనుమానాస్పదంగా ఉన్నాయి. మాకు ప్రమాదకరంగా మారుతోందని భావిస్తున్నాం’ అని పేర్కొన్నారు. కాగా.. అమెరికా గతంలో పాక్కు అండగా నిలవడం గమనార్హం.
Similar News
News January 24, 2025
పెళ్లి చేసుకున్న ఇద్దరు మహిళలు.. ట్విస్ట్ ఏంటంటే?
UPలో కవిత, గుంజా అనే ఇద్దరు మహిళలు పెళ్లి చేసుకున్నారు. భర్తలు పెట్టే చిత్రహింసలు తట్టుకోలేక వారి నుంచి విడిపోయి ఇలా ఒక్కటయ్యారు. గోరఖ్పూర్ జిల్లాకు చెందిన వీరిద్దరికి 4ఏళ్ల క్రితం ఇన్స్టాలో పరిచయమైంది. కొన్ని నెలలుగా ఒకే గదిలో ఉంటున్నారు. ఒకరిని వదిలి మరొకరు ఉండలేమని తెలుసుకుని తాజాగా ఓ ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. గుంజా తన పేరును బబ్లూగా మార్చుకుని తనకు భర్తగా ఉంటుందని కవిత తెలిపింది.
News January 24, 2025
తీవ్ర నిరాశలో వైసీపీ శ్రేణులు
YCP అధినేత జగన్ వ్యూహాల వెనుక విజయసాయిరెడ్డిది కీలకపాత్ర. 2004 నుంచి జగన్ వెంట నడుస్తున్నారు. అక్రమాస్తుల కేసుల్లో జగన్తో పాటు జైలు జీవితం గడిపారు. వైసీపీ స్థాపించినప్పటి నుంచి తెర వెనుక వ్యూహరచన, తెర ముందు రాజకీయ విమర్శలతో పెద్దదిక్కుగా మారారు. 2019లో అధికారంలోకి వచ్చాక ఢిల్లీ పెద్దలతో సత్సంబంధాలు నడిపారు. రేపు VSR రాజీనామా చేయనుండటంతో జగన్ ఒంటరవుతారని YCP ఫ్యాన్స్ ట్వీట్ చేస్తున్నారు.
News January 24, 2025
దోచుకున్న సొమ్ము బయటపెట్టు: సోమిరెడ్డి
AP: విజయసాయిరెడ్డి పాపాలన్నీ చేసేసి ఇప్పుడు <<15247358>>రాజకీయాల<<>> నుంచి తప్పుకుంటానని ప్రకటించడం విచిత్రంగా ఉందని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి అన్నారు. ‘2004-09 వరకు జగన్ను ముందు పెట్టి ఏ2గా సకల పాపాలు చేస్తివి. అప్పుడు దోచుకున్న రూ.43వేల కోట్లతో పాటు మొన్న ఐదేళ్లలో జగన్తో కలిసి దోచేసిన రూ.లక్ష కోట్ల ప్రజల సొత్తు బయటపెట్టు. నీ అల్లుడి కంపెనీ అరబిందోను కాపాడటానికి ఈ నిర్ణయం తీసుకున్నారా?’ అని ట్వీట్ చేశారు.