News February 9, 2025
భారత్పై పాక్ గెలవాలి: పాక్ పీఎం

ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడంతో పాటు భారత్పైనా విజయం సాధించడం తమ లక్ష్యమని పాక్ PM షెహబాజ్ షరీఫ్ వ్యాఖ్యానించారు. ‘జట్టు చాలా బలంగా ఉంది. అందరూ బాగా ఆడుతున్నారు. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడం ముందున్న లక్ష్యం. అయితే చిరకాల ప్రత్యర్థి భారత్పై గెలవడం కూడా కీలకం. దేశమంతా జట్టుకు మద్దతుగా ఉంది. 29 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఐసీసీ ఈవెంట్ను నిర్వహిస్తున్నాం. ఇది గర్వ కారణం’ అని పేర్కొన్నారు.
Similar News
News March 7, 2026
‘కొండ మీది కోతి’నీ తెచ్చి ఇస్తారేమో!

ఎన్నికల హామీలు చూస్తుంటే త్వరలో ఎవరో ఒకరు కొండ మీది కోతినీ తెచ్చిస్తామంటారని జోకులు పేలుతున్నాయి. ఇవాళ <<19323424>>TVK విజయ్<<>> కురిపించిన హామీలతో ఈ ప్రస్తావన తెరపైకి వచ్చింది. సాధ్యమేనా? అని కాకుండా గెలుపే లక్ష్యంగా ఇస్తున్న హామీల భారం ట్యాక్సుల రూపేనా ప్రజలపైనే పడుతుందని రాజకీయవేత్తలు అంటున్నారు. ఉచితాలతో రాష్ట్రాల ప్రగతి మందగిస్తుందని పలు సందర్భాల్లో కోర్టులు చెప్పిన మాటలూ గుర్తుచేస్తున్నారు.
News March 7, 2026
‘మీ పని చూసుకోండి’.. ట్రంప్పై కమల్ హాసన్ ఫైర్

రష్యా నుంచి ఆయిల్ కొనేందుకు భారత్కు అనుమతిస్తున్నామన్న అమెరికా ప్రకటనపై మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. భారత్ సార్వభౌమ దేశమని.. విదేశాల నుంచి ఆదేశాలు తీసుకోదంటూ ట్రంప్ను ట్యాగ్ చేస్తూ Xలో పోస్ట్ చేశారు. మీ పని మీరు చూసుకోండంటూ ఘాటుగా స్పందించారు. దేశాల మధ్య పరస్పర గౌరవమే ప్రపంచ శాంతికి పునాది అని హితవు పలికారు.
News March 7, 2026
రఘురామ కేసు: సమాధానాలు దాటవేసిన IPS సునీల్?

AP: రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో IPS అధికారి సునీల్ నాయక్ మూడో రోజు విచారణ ముగిసింది. గుంటూరు CCS పోలీస్ స్టేషన్లో అధికారులు 7గంటల పాటు ప్రశ్నించారు. రఘురామను గుంటూరుకు తరలించిన టైమ్లో అక్కడికి రావాల్సిన అవసరం ఏముందని అడిగిన ప్రశ్నలకు సునీల్ నుంచి సరైన సమాధానం రాలేదని సమాచారం. హైకోర్టు ఉత్తర్వుల మేరకు రేపు, ఎల్లుండి కూడా ఈ విచారణ కొనసాగుతుందని దర్యాప్తు అధికారులు వెల్లడించారు.


