News February 13, 2025
LoC వద్ద రెచ్చిపోయిన పాక్.. తిప్పికొట్టిన భారత్!

నియంత్రణ రేఖ వద్ద పాకిస్థాన్ ఆర్మీ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. పూంఛ్ జిల్లాలోని కృష్ణ ఘాటి సెక్టార్ వద్ద ఆ దేశ సైనికులు కాల్పులకు తెగబడగా భారత బలగాలు సమర్థంగా తిప్పికొట్టాయి. ఇందులో పెద్ద సంఖ్యలో పాక్ సైనికులు చనిపోయినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై భారత ఆర్మీ నుంచి అధికారిక ప్రకటన రాలేదు. ఇటీవల LoC వద్ద ఇద్దరు భారత జవాన్లు అమరులైన విషయం తెలిసిందే.
Similar News
News January 22, 2026
భారీ ఎన్కౌంటర్.. 10 మంది మావోయిస్టులు మృతి

ఝార్ఖండ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. సింగ్భూమ్ జిల్లాలోని సరంద అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు జరిగిన ఎదురుకాల్పుల్లో 10 మంది మావోలు మరణించారు.
News January 22, 2026
పుష్ప-3లో సల్మాన్ ఖాన్? సక్సెస్ అయితే..

పుష్ప-3 స్క్రిప్ట్ పనులు కొనసాగుతున్నట్లు యూనిట్ వర్గాలు హింట్ ఇచ్చాయి. ఈ మూవీ 2 పార్ట్లు సాధించిన సక్సెస్ను దృష్టిలో ఉంచుకొని ‘పుష్ప’ను ఓ యూనివర్స్లా మార్చే ప్లాన్లో ఉన్నారని తెలుస్తోంది. ఈ మేరకు HYDలో ఆఫీస్ ఓపెన్ చేశారట. అందులో భాగంగా పుష్ప-3లో సల్మాన్ ఖాన్ను పవర్ఫుల్ రోల్లో ఇంట్రడ్యూస్ చేయనున్నట్లు సమాచారం. సక్సెస్ను బట్టి ఆయనతో పుష్ప సిరీస్లో ప్రత్యేక సినిమా ఉండొచ్చని టాక్.
News January 22, 2026
ప్రిస్క్రిప్షన్ లేకుండా యాంటీ బయాటిక్స్ అమ్మొద్దని వార్నింగ్

TG: మెడికల్ షాపుల ఓనర్లకు డ్రగ్స్ కంట్రోల్ డిపార్ట్మెంట్ వార్నింగ్ ఇచ్చింది. ప్రిస్క్రిప్షన్ లేకుండా యాంటీ బయాటిక్స్ విక్రయించవద్దని ఆదేశించింది. నిన్న రాష్ట్రవ్యాప్తంగా అలాంటి 190 మెడికల్ షాపులకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. విచ్చలవిడిగా యాంటీ బయాటిక్స్ వాడితే ‘యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్’ బారినపడతారని, ఇది ప్రాణాంతకం అని తెలిపింది. డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ కంపల్సరీ అని స్పష్టం చేసింది.


