News March 18, 2024
పల్నాడు: 2 బైకులు ఢీ.. ముగ్గురికి తీవ్ర గాయాలు

ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ముగ్గురికి తీవ్రగాయాలైన ఘటన బెల్లంకొండ గ్రామ శివారులో ఆదివారం చోటుచేసుకుంది. 108 సిబ్బంది వివరాల మేరకు.. న్యూ చిట్యాల నుంచి వస్తున్న బైక్, బెల్లంకొండ నుంచి చిట్యాల వైపు వెళ్తున్న బైక్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఓ బైక్ పై ఉన్న మమత, గుణశేఖర్ల తలకు తీవ్ర గాయాలయ్యాయి. మురళీకృష్ణ స్వల్పంగా గాయపడ్డాడు. క్షతగాత్రులను సత్తెనపల్లి ఏరియా వైద్యశాలకు తరలించారు.
Similar News
News April 19, 2026
ఆన్లైన్లో PGRS అర్జీలు సమర్పించవచ్చు: కలెక్టర్

గుంటూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లీనిక్ కార్యక్రమాలు జరుగుతాయని జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీలు https://Meekosam.ap.gov.in వెబ్ సైట్ ద్వారా కూడా సమర్పించవచ్చని అన్నారు. 1100 టోల్ ఫ్రీ ద్వారా అర్జీల స్థితిని తెలుసుకోవచ్చని చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
News April 19, 2026
భవననిర్మాణ కార్మికుల పేర్లు నమోదు చేసుకోవాలి: GNT కలెక్టర్

భవన నిర్మాణ కార్మికులు తమ పేర్లను కార్మికశాఖ కార్యాలయంలో నమోదు చేసుకోవాలని కలెక్టర్ సాయికాంత్ వర్మ సూచించారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలు అమలు పునః ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు. వివాహ కానుక, ప్రసూతి సహాయంగా రూ.20 వేలు, సహజ మరణానికి రూ.60 వేలు, అంత్య క్రియలకు రూ.20 వేలు అందించే సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతోందన్నారు.
News April 19, 2026
అమరావతి ఐకానిక్ టవర్లకు టెండర్లు

అమరావతిలోని 5 ఐకానిక్ భవనాల్లో కీలక పనులకు ప్రభుత్వం టెండర్లు పిలిచింది. టవర్ 1, 2, 3, 4లతో పాటు జీఏడీ టవర్కు ఎంఈపీ టెండర్లు జారీ చేసింది. టవర్ 1, 2లకు రూ.743.02 కోట్లు, టవర్ 3, 4లకు రూ.681.47 కోట్లు, జీఏడీ టవర్కు రూ.431.59 కోట్లు అంచనా వేశారు. భవనాల్లో విద్యుత్, ప్లంబింగ్, ఏసీ, ఫైర్ సేఫ్టీ పనులను 18 నెలల్లో పూర్తి చేసి, రెండేళ్లు నిర్వహణ చూడాలి.


