News November 18, 2024
లగచర్ల ఘటనలో పంచాయతీ సెక్రటరీ సస్పెండ్

TG: లగచర్ల ఘటనలో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. గ్రామస్థులు, రైతులను రెచ్చగొట్టారని దౌల్తాబాద్(M) సంగయ్యపల్లి పంచాయతీ సెక్రటరీ రాఘవేందర్ను వికారాబాద్ కలెక్టర్ సస్పెండ్ చేశారు. దాడి సమయంలో ఇతను కీలకంగా ఉన్నట్లు పోలీసుల వద్ద ఆధారాలున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాఘవేందర్ రిమాండ్లో ఉండగా, మరిన్ని కేసుల నమోదుకు అవకాశం ఉంది. ఈ కేసులో A1 పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ కాగా, A2 సురేశ్ పరారీలో ఉన్నారు.
Similar News
News December 8, 2025
డెయిరీఫామ్తో నెలకు రూ.1.25 లక్షల ఆదాయం

స్త్రీలు కూడా డెయిరీఫామ్ రంగంలో రాణిస్తారని నిరూపిస్తున్నారు హిమాచల్ప్రదేశ్లోని తుంగల్ లోయకు చెందిన సకీనా ఠాకూర్. పీజీ పూర్తి చేసిన ఈ యువతి కుటుంబం వద్దన్నా ఈ రంగంలో అడుగుపెట్టారు. తన ఫామ్లో ఉన్న 14 హెచ్ఎఫ్ ఆవుల నుంచి రోజూ 112 లీటర్ల పాలను విక్రయిస్తూ.. నెలకు రూ.1.25 లక్షలకు పైగా ఆదాయం పొందుతున్నారు. సకీనా సక్సెస్ వెనుక కారణాలను తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట <<>>క్లిక్ చేయండి.
News December 8, 2025
DRDO CFEESలో అప్రెంటిస్ పోస్టులు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

DRDO అనుబంధ సంస్థ సెంటర్ ఫర్ ఫైర్, ఎక్స్ప్లోజివ్& ఎన్విరాన్మెంట్ సేఫ్టీ (CFEES)లో 38 అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరుతేదీ. టెన్త్, ఇంటర్, ITI ఉత్తీర్ణులై, 18- 27ఏళ్ల మధ్య ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. రిజర్వేషన్ గల అభ్యర్థులకు ఏజ్లో సడలింపు ఉంది. ముందుగా ncvtmis.gov.in పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. స్టైపెండ్ నెలకు రూ.9600 చెల్లిస్తారు. https://www.drdo.gov.in/
News December 8, 2025
నాణ్యత లేని పాల వల్లే డెయిరీఫామ్ వైపు అడుగులు

మండి నగరంలో పాల నాణ్యత పట్ల అసంతృప్తితోనే సకీనా ఈ రంగంలోకి అడుగు పెట్టారు. స్థానిక పాడి రైతు చింతాదేవి, YouTubeలోని పాడిపరిశ్రమలో రాణిస్తున్న వారి అనుభవాలను తెలుసుకొని ముందుకుసాగారు. 2024లో తన దగ్గర ఉన్న రూ.1.25 లక్షలు, బ్యాంకు నుంచి రూ.2లక్షల రుణంతో.. పంజాబ్ నుంచి హోల్స్టెయిన్ ఫ్రైసియన్(HF) ఆవులను కొని ఫామ్ ప్రారంభించారు. తొలుత తక్కువ ఆవులే ఉండగా ఇప్పుడు వాటి సంఖ్య 14కు చేరింది.


