News January 19, 2025

LSG కెప్టెన్‌గా పంత్!

image

IPL-2025లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్‌గా రిషభ్ పంత్ వ్యవహరిస్తారని ESPN CRIC INFO పేర్కొంది. దీనిపై రేపు అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. ఆక్షన్‌లో అతడిని రూ.27కోట్లకు LSG కొనుగోలు చేసింది. స్క్వాడ్‌లో పూరన్, మార్క్రమ్, మిల్లర్ వంటి ప్లేయర్లున్నా స్వదేశీ కెప్టెన్ వైపే టీమ్ మేనేజ్‌మెంట్ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. పంత్ 2021, 2022, 2024 సీజన్లలో DCకి కెప్టెన్సీ చేసిన విషయం తెలిసిందే.

Similar News

News February 20, 2026

అభిషేక్ వైఫల్యం.. సోదరిపై ట్రోలింగ్స్

image

T20WCలో అభిషేక్ వైఫల్యానికి సోదరి కోమల్ కారణమంటూ కొందరు ట్రోల్ చేస్తున్నారు. ప్రతి మ్యాచ్‌కూ వెళ్తూ స్టాండ్స్‌లో అరుస్తూ అభిషేక్ ఆటను నాశనం చేస్తున్నారంటూ పోస్టులు చేస్తున్నారు. ఫెయిల్యూర్లతో సంబంధం లేకుండా POTM అవార్డుల సమయంలో ఫ్యామిలీ ఫొటోలకు ప్రాధాన్యం ఇస్తున్నారంటున్నారు. అయితే నిరాధారంగా ఆమెను టార్గెట్ చేస్తున్నారని, గ్రౌండులో సోదరుడు ఫెయిలైతే కోమల్‌ ఎలా కారణమని మరికొందరు ప్రశ్నిస్తున్నారు.

News February 20, 2026

ఏడాది చివరికల్లా 5 మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు: సత్యకుమార్

image

AP: సీతంపేట, పార్వతీపురం, దోర్నాల, రంపచోడవరం, బుట్టాయిగూడెంలోని మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులను ఈ ఏడాది చివరి కల్లా వినియోగంలోకి తెస్తామని మంత్రి సత్యకుమార్ అసెంబ్లీలో తెలిపారు. ‘వీటి నిర్మాణానికి గత GOVT ₹12 కోట్లే ఇచ్చింది. మిగతా నిధులన్నింటినీ ఇచ్చి మా ప్రభుత్వమే పూర్తిచేయిస్తోంది. 300 మంది వైద్యుల్ని నియమించాం. ఇన్‌సర్వీస్, సీనియర్ రెసిడెంట్ల విభాగంలో 600మందిని ఏర్పాటు చేశాం’ అని వివరించారు.

News February 20, 2026

వచ్చే నెల కార్పొరేట్ అమెండ్‌మెంట్ బిల్?

image

మార్చి 9న ప్రారంభమయ్యే రెండో విడత బడ్జెట్ సెషన్‌లో కేంద్రం కార్పొరేట్ అమెండ్‌మెంట్ బిల్ ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. కంపెనీస్ యాక్ట్ (2013), LLP ACT (2008) చట్టాల్లోని రూల్స్‌ను ఈ బిల్లుతో సవరించనుంది. సాంకేతికంగా లేదా కార్యకలాపాల్లో జరిగే చిన్న పొరపాట్లపై ఉన్న క్రిమినల్ ప్రాసిక్యూషన్‌ను తొలగించనుంది. డిజిటైజేషన్‌ ద్వారా పర్యవేక్షణ మెరుగవుతుంది. దీంతో వ్యాపార కార్యకలాపాలు సులభతరం కానున్నాయి.