News January 19, 2025
LSG కెప్టెన్గా పంత్!

IPL-2025లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్గా రిషభ్ పంత్ వ్యవహరిస్తారని ESPN CRIC INFO పేర్కొంది. దీనిపై రేపు అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. ఆక్షన్లో అతడిని రూ.27కోట్లకు LSG కొనుగోలు చేసింది. స్క్వాడ్లో పూరన్, మార్క్రమ్, మిల్లర్ వంటి ప్లేయర్లున్నా స్వదేశీ కెప్టెన్ వైపే టీమ్ మేనేజ్మెంట్ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. పంత్ 2021, 2022, 2024 సీజన్లలో DCకి కెప్టెన్సీ చేసిన విషయం తెలిసిందే.
Similar News
News March 10, 2026
కూతురికి బర్త్డే విషెస్.. అరుదైన ఫొటోలు షేర్ చేసిన చిరు

తన కుమార్తె సుష్మిత కొణిదెల పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి షేర్ చేసిన అరుదైన ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి. చిన్నప్పుడు ఊయలలో ఉన్నప్పటి నుంచి నేడు తండ్రి సినిమాకే నిర్మాతగా మారి పక్కన నిల్చున్న వరకు ఉన్న జర్నీని గుర్తుచేసుకున్నారు. ‘నా సినిమాలు చూసే స్థాయి నుంచి నాతో సినిమా తీసి బ్లాక్బస్టర్ ఇచ్చే స్థాయికి ఎదగడం తండ్రిగా మర్చిపోలేని అనుభూతి’ అంటూ చిరు ఎమోషనల్ పోస్ట్ రాసుకొచ్చారు.
News March 10, 2026
గడ్డి మందు పిచికారీ – ఈ జాగ్రత్తలు తప్పనిసరి

కలుపు నివారణకు పారాక్వాట్ డైక్లోరైడ్ వినియోగం విపరీతంగా పెరిగింది. దీన్ని ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా పిచికారీ చేస్తున్నారు. ఈ మందు పొరపాటున గాలి ద్వారా శరీరంలోకి వెళ్తే లంగ్స్, లివర్, కిడ్నీలపై ప్రభావం చూపుతుంది. తక్కువ సమయంలోనే మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్తో మరణం సంభవిస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే గడ్డి మందును పిచికారీ చేసేటప్పుడు రైతులు మాస్కులు, చేతికి గ్లౌజులు ధరించాలి.
News March 10, 2026
కలుపు ముప్పు తగ్గాలంటే ఇలా చేయాలి

పంట వేసేందుకు పొలాన్ని 2 నుంచి 3 దఫాలుగా దున్నడం వల్ల తొలిదశలోనే కలుపు విత్తనాలు మెులిచి మున్ముందు కలుపు సమస్య అంతగా ఉండదు. ప్లాస్టిక్ మల్చింగ్ షీట్స్, పంట వ్యర్థాలను, వరి గడ్డిని నేలపై చదునుగా పరచడం, అంతరకృషి వంటివి కలుపును తగ్గించి పంటకు, నేలకు మేలు చేస్తుందనే వాస్తవాన్ని రైతులు తెలుసుకోవాలి. కలుపు మందును వాడాల్సి వస్తే తప్పకుండా నిపుణులు సూచన మేరకే వాడాలి. వ్యాపారుల ప్రమేయం ఉండకపోవడం మంచిది.


