News January 19, 2025
LSG కెప్టెన్గా పంత్!

IPL-2025లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్గా రిషభ్ పంత్ వ్యవహరిస్తారని ESPN CRIC INFO పేర్కొంది. దీనిపై రేపు అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. ఆక్షన్లో అతడిని రూ.27కోట్లకు LSG కొనుగోలు చేసింది. స్క్వాడ్లో పూరన్, మార్క్రమ్, మిల్లర్ వంటి ప్లేయర్లున్నా స్వదేశీ కెప్టెన్ వైపే టీమ్ మేనేజ్మెంట్ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. పంత్ 2021, 2022, 2024 సీజన్లలో DCకి కెప్టెన్సీ చేసిన విషయం తెలిసిందే.
Similar News
News February 26, 2026
సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

<
News February 26, 2026
ఎందుకలా?!: షుగర్ ఉన్నవారిలో తరచూ నీరసం..

షుగర్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయులు అధికంగా ఉన్నా అవయవాల్లోని కణాలకు అవసరమైన శక్తి అందక నీరసంగా అన్పిస్తుంది. దీనికి కారణం ఇన్సులిన్ అనే హార్మోన్ పని చేయకపోవడం. ఇన్సులిన్ను క్లోమం ఉత్పత్తి చేస్తుంది. ఇది రక్తంలోని చక్కెర స్థాయులను నియంత్రించి కణాలకు శక్తిని అందిస్తుంది. శరీరంలో ఇది తగినంత ఉత్పత్తి కాకపోతే రక్తంలో చక్కెర స్థాయులు పెరిగి డయాబెటిస్కు దారి తీస్తుంది. ప్రతిరోజూ 4pmకు ఎందుకలా?!.
News February 26, 2026
బొప్పాయిలో రింగ్ స్పాట్ వైరస్ కట్టడికి చర్యలు

రింగ్ స్పాట్ వైరస్ సోకిన బొప్పాయి మొక్కల్లో దిగుబడి, కాయ నాణ్యత పెంచడానికి లీటరు నీటికి 10 గ్రాముల యూరియా, 1.5 గ్రాములు జింక్ సల్ఫేట్ & ఒక గ్రాము బోరాన్ కలిపి 30 రోజుల వ్యవధిలో 8 నెలల వరకు పిచికారీ చేయాలి. అలాగే వంగ, గుమ్మడి జాతి పంటలను బొప్పాయి చుట్టుపక్కల పెంచకూడదు. బొప్పాయి మొక్కలు నాటే 15 రోజుల ముందు అవిశ రెండు వరుసలు, మొక్కజొన్న, జొన్న మొక్కలను రెండు వరుసల్లో రక్షణ పంటలుగా వేసుకోవాలి.


