News December 3, 2024
10-12 ఏళ్లు మాతోనే పంత్: సంజీవ్ గొయెంకా

టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్ రిషభ్ పంత్ తమతోపాటు 10-12 ఏళ్లు ఉంటారని లక్నో జెయింట్స్ ఓనర్ సంజీవ్ గొయెంకా అభిప్రాయపడ్డారు. వేలంలో ఆయనను దక్కించుకోవడంలో తాము సక్సెస్ అయ్యామన్నారు. ‘ప్రస్తుతం మా జట్టులో నలుగురు లీడర్లు ఉన్నారు. పంత్, మార్క్రమ్, పూరన్, మార్ష్ కెప్టెన్సీకి అర్హులే. వీరందరూ గెలవాలనే కసి, తపనతో ఉంటారు. ప్రస్తుతం అన్ని జట్ల కన్నా తమ జట్టే బలంగా, సమతుల్యంగా ఉంది’ అని ఆయన పేర్కొన్నారు.
Similar News
News March 6, 2026
ముంబై న్యూ జెర్సీలో హిట్మ్యాన్

టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ IPL-2026కు ప్రిపేర్ అవుతున్నారు. తాజాగా ముంబై ఇండియన్స్ న్యూ జెర్సీలో ఫొటోలకు పోజులిచ్చారు. కేవలం వన్డేలు మాత్రమే ఆడుతున్న రోహిత్.. ఐపీఎల్ కోసం ఇప్పటికే ప్రాక్టీస్ ప్రారంభించారు. గతంతో పోలిస్తే ఫుల్ ఫిట్నెస్ సాధించిన హిట్మ్యాన్.. ప్రత్యర్థులపై ఎలా చెలరేగుతారో చూడాలి. మార్చి 28 నుంచి ఐపీఎల్ ప్రారంభం అవుతుందని క్రీడావర్గాలు వెల్లడించాయి.
News March 6, 2026
అభిషేక్ మాదిరే వరుణ్ను ఎందుకు సపోర్ట్ చేయరు: సెహ్వాగ్

నిన్న ENGతో మ్యాచ్లో స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి 4 ఓవర్లలో 64 పరుగులు ఇవ్వడంతో విమర్శలు ఎదుర్కొంటున్నారు. వీటిపై మాజీ క్రికెటర్ సెహ్వాగ్ స్పందించారు. ‘ఓపెనర్ అభిషేక్ శర్మ కూడా సరిగ్గా ఆడట్లేదు. అతడిని వెనకేసుకొస్తున్న వారికి బౌలర్కు సపోర్ట్ చేయడానికి ఎందుకు సమస్య? 3 మ్యాచ్లలో రన్స్ ఇవ్వగానే వేరే బౌలర్ కోసం చూస్తున్నామని చెబుతారు. ఆ కొత్త ప్లేయర్ రాణిస్తాడనే గ్యారంటీ ఏమిటి?’ అని ప్రశ్నించారు.
News March 6, 2026
H1-B వీసా రిజిస్ట్రేషన్లు ప్రారంభం

FY 2027కి సంబంధించిన H1-B వీసా రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. మార్చి 19 వరకు గడువు ఉంది. అయితే ఈసారి అమెరికా నిబంధనలను చాలా కఠినం చేసింది. విదేశాల నుంచి ఉద్యోగులను తెచ్చుకునే కంపెనీలు లక్ష డాలర్ల అదనపు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. లాటరీలో కూడా ఎక్కువ శాలరీ, నైపుణ్యం ఉన్నవారికే ప్రాధాన్యం లభించేలా ‘వెయిటెడ్ సెలక్షన్’ పద్ధతి తెచ్చారు. సోషల్ మీడియా వెరిఫికేషన్ కూడా తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే.


