News April 11, 2024

కొడుక్కి గన్ ఇచ్చారని పేరెంట్స్‌కు 15 ఏళ్ల జైలు

image

అమెరికాలో ఓ కొడుకు చేసిన తప్పుకు అతడి తల్లిదండ్రులకు శిక్ష పడింది. 2021లో మిచిగాన్‌లోని ఆక్స్‌ఫర్డ్ స్కూల్‌లో ఎథాన్ క్రంబ్లీ అనే టీనేజర్ తుపాకీతో నలుగురిని చంపాడు. పోలీసులు అతడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. తమ కుమారుడి మానసిక స్థితి సరిగా లేదని పేరెంట్స్ కోర్టులో చెప్పారు. అలాంటి పిల్లాడికి తుపాకీ ఎందుకిచ్చారని.. అది ముమ్మాటికీ తప్పేనని చెబుతూ కోర్టు వారికి 15 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

Similar News

News March 3, 2026

ప.గో జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు

image

జిల్లాలో శబ్ద, వాయు కాలుష్య నియంత్రణపై కలెక్టర్ నాగరాణి భీమవరంలో అధికారులతో సమీక్షించారు. ఉత్సవాలు, ఆలయాలు, ఆసుపత్రుల వద్ద బాణాసంచా కాల్చకుండా రెవెన్యూ, పోలీస్ శాఖలు కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాలుష్యం వల్ల ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో కుటుంబ సర్వే, ఈ-కేవైసీ ప్రక్రియలను వేగవంతం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

News March 3, 2026

TODAY HEADLINES

image

✦ మిడిల్ ఈస్ట్‌లో కొనసాగుతున్న యుద్ధం.. ఖమేనీ భార్య మృతి
✦ మేం యుద్ధాన్ని స్టార్ట్ చేయలేదు కానీ ముగిస్తాం: US
✦ సౌదీ, బహ్రెయిన్, ఇజ్రాయెల్ పాలకులకు పీఎం మోదీ ఫోన్
✦ HPV వ్యాక్సిన్ సురక్షితమే: కేంద్రం
✦ యుద్ధం వల్ల కుప్పకూలిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. రూ.లక్షల కోట్లు ఆవిరి
✦ నిజాయతీ కలిగిన అధికారులకే అవకాశం: CM CBN
✦ దేశం కోసం రాహుల్ ప్రధాని కావాల్సిందే: CM రేవంత్

News March 3, 2026

ఇరాన్ మౌనంగా ఉండదు.. అధ్యక్షుడి వార్నింగ్

image

అమెరికా-ఇజ్రాయెల్ మానవత్వ విలువలను పట్టించుకోవట్లేదని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ విమర్శించారు. ఆస్పత్రులు, దేశ భవిష్యత్ అయిన స్కూళ్లను టార్గెట్ చేసుకున్నారని ట్వీట్ చేశారు. రోగులు, పిల్లలపై దాడి చేయడం అత్యంత హేయమైన చర్య అని పేర్కొన్నారు. ప్రపంచమంతా దీన్ని ఖండించాలని, తాను దేశం తరఫున నిలబడతానని స్పష్టం చేశారు. ఇరాన్ ఇలాంటి నేరాలకు లొంగిపోదని, మౌనంగా ఉండదని హెచ్చరించారు.