News April 11, 2024

కొడుక్కి గన్ ఇచ్చారని పేరెంట్స్‌కు 15 ఏళ్ల జైలు

image

అమెరికాలో ఓ కొడుకు చేసిన తప్పుకు అతడి తల్లిదండ్రులకు శిక్ష పడింది. 2021లో మిచిగాన్‌లోని ఆక్స్‌ఫర్డ్ స్కూల్‌లో ఎథాన్ క్రంబ్లీ అనే టీనేజర్ తుపాకీతో నలుగురిని చంపాడు. పోలీసులు అతడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. తమ కుమారుడి మానసిక స్థితి సరిగా లేదని పేరెంట్స్ కోర్టులో చెప్పారు. అలాంటి పిల్లాడికి తుపాకీ ఎందుకిచ్చారని.. అది ముమ్మాటికీ తప్పేనని చెబుతూ కోర్టు వారికి 15 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

Similar News

News March 6, 2026

NLG: ఐటీఐ అభ్యర్థులకు ‘అప్రెంటిస్‌షిప్ మేళా’

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఈ నెల 9న ‘ప్రధానమంత్రి జాతీయ అప్రెంటిస్‌షిప్ మేళా’ నిర్వహించనున్నారు. స్థానిక అనుముల ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని ప్రిన్సిపల్ అండాలు తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ముందుగా www.apprenticeship.gov.in పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని ఆమె తెలిపారు.

News March 6, 2026

ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్త!

image

TG: పలు జిల్లాల్లో ఇవాళ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని HYD వాతావరణ కేంద్రం అంచనా వేసింది. సిద్దిపేట, జనగామ, వరంగల్, మహబూబాబాద్, యాదాద్రి, నల్గొండ, సూర్యాపేట మినహా మిగతా అన్ని జిల్లాల్లో 36°C-40°Cవరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్పింది. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక ఇళ్ల నుంచి బయటికి వెళ్లేవారు జాగ్రత్తలు తీసుకోవాలని, డీహైడ్రేషన్‌కు గురికాకుండా నీరు తాగాలని వైద్యులు సూచిస్తున్నారు.

News March 6, 2026

ప్రజలకు జగన్ నరకం చూపిస్తున్నారు: CBN

image

AP: పరామర్శల పేరుతో జగన్ ప్రజలకు నరకం చూపిస్తున్నారని అసెంబ్లీ వేదికగా సీఎం చంద్రబాబు విమర్శించారు. ‘గంజాయి బ్యాచ్ పరామర్శలకు వెళ్లడం సిగ్గుచేటు. వైసీపీ డ్రామాలతో అంబులెన్స్‌లు కూడా చిక్కుకుపోతున్నాయి. వాళ్ల వాహనాల టైర్లు మనుషులను తొక్కేస్తున్నాయి. మళ్లీ ఆ నిందను ప్రభుత్వంపైనే వేసే ప్రయత్నం చేస్తున్నారు. పోస్టుమార్టమ్‌కు కారణమైన వాళ్లు పోస్టుమార్టమ్‌కే వెళతారు’ అని సెటైర్ వేశారు.