News April 11, 2024
కొడుక్కి గన్ ఇచ్చారని పేరెంట్స్కు 15 ఏళ్ల జైలు

అమెరికాలో ఓ కొడుకు చేసిన తప్పుకు అతడి తల్లిదండ్రులకు శిక్ష పడింది. 2021లో మిచిగాన్లోని ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఎథాన్ క్రంబ్లీ అనే టీనేజర్ తుపాకీతో నలుగురిని చంపాడు. పోలీసులు అతడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. తమ కుమారుడి మానసిక స్థితి సరిగా లేదని పేరెంట్స్ కోర్టులో చెప్పారు. అలాంటి పిల్లాడికి తుపాకీ ఎందుకిచ్చారని.. అది ముమ్మాటికీ తప్పేనని చెబుతూ కోర్టు వారికి 15 ఏళ్ల జైలు శిక్ష విధించింది.
Similar News
News February 20, 2026
ఇది వరి లాంటి కలుపు మొక్క

వరి చేనులో ‘బొంత ఊద’ కలుపు మొక్కలు కలవరపెడుతున్నాయి. ఇవి కూడా వరి మాదిరిగానే పెరుగుతాయి. పూర్తిగా పెరిగే వరకు వీటిని గుర్తుపట్టలేము. అందుకే దీన్ని దొంగ వరి అంటారు. పంటకు అందించే పోషకాలను ఇవి గ్రహించి వరి కంటే ఎక్కువ ఎత్తు పెరుగుతాయి. ఈ కలుపు మొక్కల వల్ల వరిలో పొడ తెగులు, సుడిదోమ ఉద్ధృతి పెరుగుతుందని రైతులు అంటున్నారు. వరిలో ఇలాంటి కలుపును గుర్తిస్తే నిపుణుల సూచనల మేరకు మందులు వాడి నిర్మూలించండి.
News February 20, 2026
బెంగళూరు- BZA మధ్య వందేభారత్ వేయండి.. స్పందించిన లోకేశ్

బెంగళూరులో ఉంటున్న కోస్తాంధ్ర టెకీల రైలు కష్టాలపై ఏపీ మంత్రి లోకేశ్ సానుకూలంగా స్పందించారు. బెంగళూరు నుంచి విజయవాడకు వందేభారత్ రైలు కావాలని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. ఈ అంశాన్ని రైల్వే శాఖ దృష్టికి తీసుకెళ్తామని లోకేశ్ భరోసానిచ్చారు. వెంటనే చర్యలు తీసుకోవాలని MP కేశినేని చిన్నిని కోరారు. ‘వందేభారత్ స్లీపర్’ రైలు తీసుకొచ్చేలా కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్తో చర్చలు జరుపుతున్నట్లు MP తెలిపారు.
News February 20, 2026
RITES లిమిటెడ్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

<


