News April 11, 2024

కొడుక్కి గన్ ఇచ్చారని పేరెంట్స్‌కు 15 ఏళ్ల జైలు

image

అమెరికాలో ఓ కొడుకు చేసిన తప్పుకు అతడి తల్లిదండ్రులకు శిక్ష పడింది. 2021లో మిచిగాన్‌లోని ఆక్స్‌ఫర్డ్ స్కూల్‌లో ఎథాన్ క్రంబ్లీ అనే టీనేజర్ తుపాకీతో నలుగురిని చంపాడు. పోలీసులు అతడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. తమ కుమారుడి మానసిక స్థితి సరిగా లేదని పేరెంట్స్ కోర్టులో చెప్పారు. అలాంటి పిల్లాడికి తుపాకీ ఎందుకిచ్చారని.. అది ముమ్మాటికీ తప్పేనని చెబుతూ కోర్టు వారికి 15 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

Similar News

News March 9, 2026

గ్యాస్ కొరత.. బెంగళూరులో హోటల్స్ బంద్!

image

కమర్షియల్ గ్యాస్ సరఫరా నిలిపేయడంతో హోటళ్లను ఆపరేట్ చేయలేకపోతున్నామని బెంగళూరు హోటల్స్ అసోసియేషన్ ఆవేదన వ్యక్తం చేసింది. ‘పశ్చిమాసియాలో యుద్ధం వల్ల వాణిజ్య వంట గ్యాస్ సరఫరా దాదాపు పూర్తిగా ఆగిపోయింది. రేపటి నుంచి బెంగళూరులోని రెస్టారెంట్లు బంద్ అవుతాయి’ అని ఓ ప్రకటనలో తెలిపింది.

News March 9, 2026

అప్పటిదాకా పెట్రోల్ రేట్లు పెరగవు: ప్రభుత్వ వర్గాలు

image

దేశంలో అవసరమైనంత మేర నిల్వలు ఉన్నాయని, ఇంధన ధరలు పెరగవని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ‘క్రూడాయిల్ ధరలు 130 డాలర్లకు(ఒక బ్యారెల్‌కు) చేరే దాకా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం లేదు. చమురు రేటు బ్యారెల్‌కు 100 డాలర్లుగా స్టెబిలైజ్ అవుతుంది. దేశంలో ఏ పెట్రోల్ పంపులోనూ కొరత లేదు. వివిధ మార్గాల ద్వారా క్రూడ్ సేకరణ ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది’ అని వివరించాయి.

News March 9, 2026

నెయ్యికి కొరత లేదు: టీటీడీ

image

తిరుమల లడ్డూల తయారీలో వాడే నెయ్యికి కొరత లేదని TTD తెలిపింది. మూడంచెల కొనుగోలు విధానం ద్వారా ఆవు నెయ్యి సరఫరా అవుతోందని వెల్లడించింది. ఈ విషయంలో అసత్య ప్రచారాలు నమ్మొద్దని భక్తులకు విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం 7 లక్షలకు పైగా లడ్డూలు అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. టీటీడీ వద్ద నెయ్యి నిల్వలు లేవని, ప్రసాదాల తయారీలో అంతరాయం ఏర్పడుతోందని సోషల్ మీడియాలో కొందరు ప్రచారం చేయడంతో క్లారిటీ ఇచ్చింది.