News April 11, 2024
కొడుక్కి గన్ ఇచ్చారని పేరెంట్స్కు 15 ఏళ్ల జైలు

అమెరికాలో ఓ కొడుకు చేసిన తప్పుకు అతడి తల్లిదండ్రులకు శిక్ష పడింది. 2021లో మిచిగాన్లోని ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఎథాన్ క్రంబ్లీ అనే టీనేజర్ తుపాకీతో నలుగురిని చంపాడు. పోలీసులు అతడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. తమ కుమారుడి మానసిక స్థితి సరిగా లేదని పేరెంట్స్ కోర్టులో చెప్పారు. అలాంటి పిల్లాడికి తుపాకీ ఎందుకిచ్చారని.. అది ముమ్మాటికీ తప్పేనని చెబుతూ కోర్టు వారికి 15 ఏళ్ల జైలు శిక్ష విధించింది.
Similar News
News February 27, 2026
సాగర్లో తగ్గుతున్న నీటి నిల్వలు!

TG: నాగార్జున సాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం 537 అడుగుల మేరకు 182 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అయితే కనీస నీటిమట్టం 510 అడుగులకు పైన 51 టీఎంసీల లభ్యత మాత్రమే ఉందని అధికారులు ప్రభుత్వానికి లేఖ రాశారు. రానున్న రోజుల్లో తాగు, సాగు అవసరాలకు 65 టీఎంసీల అవసరం ఉందని తెలిపారు. అందువల్ల కనీస నీటిమట్టాన్ని కొనసాగించేందుకు కుడి, ఎడమ కాలువలకు జలాల విడుదలలో నియంత్రణ అవసరమని పేర్కొన్నారు.
News February 27, 2026
IMMTలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

<
News February 27, 2026
రాష్ట్రంలో పరువు హత్య.. దారుణంగా చంపేశారు

AP: తూ.గో జిల్లా ద్వారపూడిలో పరువు హత్య కలకలం రేపింది. రాయవరం డిప్యూటీ తహశీల్దార్ సంధ్య(40), ద్వారపూడికి చెందిన సూర్యప్రకాశ్ రావు(41) నిన్న ఉదయం అన్నవరంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇద్దరి కులాలు వేరు కావడంతో సంధ్య సోదరులు ద్వారపూడి వెళ్లి బైక్పై వస్తున్న నూతన దంపతులను అడ్డుకున్నారు. ఆగ్రహంతో సూర్యప్రకాశ్ను రాళ్లతో కొట్టి చంపేశారు. తర్వాత స్థానికులు నిందితులను చితకబాది, పోలీసులకు అప్పగించారు.


