News April 11, 2024
కొడుక్కి గన్ ఇచ్చారని పేరెంట్స్కు 15 ఏళ్ల జైలు

అమెరికాలో ఓ కొడుకు చేసిన తప్పుకు అతడి తల్లిదండ్రులకు శిక్ష పడింది. 2021లో మిచిగాన్లోని ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఎథాన్ క్రంబ్లీ అనే టీనేజర్ తుపాకీతో నలుగురిని చంపాడు. పోలీసులు అతడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. తమ కుమారుడి మానసిక స్థితి సరిగా లేదని పేరెంట్స్ కోర్టులో చెప్పారు. అలాంటి పిల్లాడికి తుపాకీ ఎందుకిచ్చారని.. అది ముమ్మాటికీ తప్పేనని చెబుతూ కోర్టు వారికి 15 ఏళ్ల జైలు శిక్ష విధించింది.
Similar News
News March 24, 2025
క్యాన్సర్ కేసులపై ప్రచారంలో నిజం లేదు: మంత్రి

AP: రాష్ట్రంలో క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని మంత్రి సత్యకుమార్ స్పష్టం చేశారు. అనపర్తి నియోజకవర్గంలో 105 మందికి క్యాన్సర్ సోకినట్లు తేలిందని చెప్పారు. బ్రెస్ట్, సర్వైకల్, బ్లడ్, ఓరల్ క్యాన్సర్ కేసులు ఎక్కువగా ఉన్నట్లు చెప్పారు. అనపర్తిని యూనిట్గా తీసుకొని ఇప్పటివరకు 1.19 లక్షల మందికి స్క్రీనింగ్ చేశామన్నారు.
News March 24, 2025
SHOCK: 40% స్టూడెంట్ వీసాల్ని రిజెక్ట్ చేసిన US

అమెరికాలో చదవాలనుకుంటున్న విద్యార్థులకు షాక్. US అడ్మినిస్ట్రేషన్ రికార్డు స్థాయిలో స్టూడెంట్ వీసాలను తిరస్కరిస్తోంది. తాజాగా ఈ రిజెక్షన్ రేటు 40%కి చేరడం గమనార్హం. FY2023-24లో 6.79 లక్షల దరఖాస్తులు రాగా అందులో 2.79 లక్షల వీసాలను తిరస్కరించినట్టు తెలిసింది. US జారీ చేసే స్టూడెంట్ వీసాల్లో 90% వరకు F1 ఉంటాయి. 2023లో లక్ష మందికి F1 వీసాలు రాగా 2024 JAN – SEP కాలంలో ఇవి 64,008కి తగ్గిపోయాయి.
News March 24, 2025
స్కూళ్లలో తప్పనిసరిగా వాటర్ బెల్: సీఎం

AP: ఎండలు ముదిరిన నేపథ్యంలో పాఠశాలల్లో తప్పనిసరిగా వాటర్ బెల్ విధానాన్ని అమలు చేయాలని CM చంద్రబాబు అధికారులను ఆదేశించారు. మంచినీటిని నిత్యం అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు. ‘ఉపాధి హామీ కూలీలు ఉ.6 నుంచి 11 గంటల్లోపే పనులు ముగించుకునేలా చూడాలి. మున్సిపల్ కార్మికులకు మ.12 నుంచి సా.4గంటల్లోపు పనులు అప్పగించొద్దు. మున్సిపాలిటీల్లో నీటి సమస్య పరిష్కారానికి ₹39Cr విడుదల చేస్తాం’ అని పేర్కొన్నారు.