News July 29, 2024

ParisOlympics: మూడో రోజు భారత్ షెడ్యూల్

image

పారిస్ ఒలింపిక్స్‌లో ఇవాళ బ్యాడ్మింటన్, షూటింగ్, హాకీ, TT, ఆర్చరీ విభాగాల్లో భారత అథ్లెట్లు అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. షూటింగ్‌లో రమిత(ఉమెన్స్ 10m AR), అర్జున్ బబుతా(మెన్స్ 10m AR) ఫైనల్‌ మ్యాచ్‌లు ఆడనున్నారు. ఇందులో ఏదో ఒక పతకం ఖాయం. బ్యాడ్మింటన్‌లో సాత్విక్-చిరాగ్, అశ్వినీ-తనిషా జోడీ గ్రూప్ స్టేజీలో ప్రత్యర్థులను ఢీకొట్టనున్నారు. ఏ సమయంలో ఏ మ్యాచ్ ఉందో పైన ఫొటోలో చూడొచ్చు.
<<-se>>#Olympics2024<<>>

Similar News

News November 16, 2025

వైసీపీపై చట్టపరమైన చర్యలు: జనసేన

image

AP: Dy.CM పవన్ కళ్యాణ్ పేషీలో లేని సురేశ్ అనే వ్యక్తి పేషీలో పనిచేస్తూ అవినీతికి పాల్పడినట్లు YCP తప్పుడు ఆరోపణలు చేసిందని జనసేన మండిపడింది. YCPపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు Xలో పోస్ట్ చేసింది. ‘పవన్ కళ్యాణ్ నిబద్ధత, పారదర్శకతపై అనుమానం కలిగించేలా నిరాధార ఆరోపణలు చేసిన వారిపై, వాటిని ప్రచురించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యాం’ అని పేర్కొంది.

News November 16, 2025

మెంటార్‌ని ఎంచుకుంటున్నారా?

image

మీరు రాణించాలనుకొనే రంగంలో సీనియర్లను మెంటార్‌గా ఎంచుకొనే ముందు వారు నిజంగా మీకు మార్గం చూపించడానికి తగిన వారేనా అన్నది గుర్తించాలి. వారిలో ఏ అంశం మిమ్మల్ని ప్రభావితం చేస్తుందో గమనించాలి. అపజయాలు పొందిన వాళ్లనీ మార్గదర్శకుడిగా ఎన్నుకుంటే వారి తప్పుల గురించి తెలుసుకోవచ్చు. మెంటార్ శభాష్ అని వెన్ను తట్టడమే కాకుండా, తప్పు చేస్తున్నప్పుడు నిర్మొహమాటంగా తగదని మందలించే వారై ఉండాలి.

News November 16, 2025

రేషన్ కార్డు ఉంటేనే..

image

TG: ఫీజు రీయింబర్స్‌మెంటును పెద్దఎత్తున అనర్హులు పొందుతున్నారన్న ఆరోపణలతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇన్‌కమ్ సర్టిఫికెట్ దరఖాస్తుకు రేషన్ కార్డును లింక్ చేసింది. అంటే ఇకపై రేషన్ కార్డు ఉంటేనే ఆదాయ ధ్రువీకరణ పత్రం వస్తుంది. మీసేవ సెంటర్లలో రేషన్ కార్డులు లేని వారు అప్లై చేస్తే ‘మిస్సింగ్ ఫుడ్ సెక్యూరిటీ కార్డు’ అని మెసేజ్ వస్తుంది. దీంతో అనర్హులకు అడ్డుకట్ట వేయొచ్చని ప్రభుత్వం భావిస్తోంది.