News May 19, 2024

రేపటి నుంచి CISF పహారాలో పార్లమెంట్

image

నూతన పార్లమెంట్ భద్రత బాధ్యతలను రేపటి నుంచి CISF చేపట్టనుంది. 3,317 మంది సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. ఇప్పటివరకు CRPF, పార్లమెంట్ డ్యూటీ గ్రూప్, సెక్యూరిటీ గ్రూప్, ఢిల్లీ పోలీస్ సంయుక్తంగా పనిచేసేవి. గత డిసెంబర్‌లో ఆగంతకులు పార్లమెంటులో ప్రవేశించడంతో కలకలం చెలరేగింది. దీంతో భద్రత బాధ్యతలను CISFకు అప్పగించాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకోసం సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇప్పించింది.

Similar News

News July 11, 2025

BJP రామచంద్రా.. భద్రాద్రిని కాపాడండి: కేటీఆర్

image

AP రాష్ట్రం పురుషోత్తపట్నంలో ఉన్న భద్రాచలం రాములోరి భూములను ఆక్రమించుకుంటుంటే BJP రామచంద్రా నోరు తెరవరేం అని BJP రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును మాజీ మంత్రి కేటీఆర్ పరోక్షంగా విమర్శించారు. తమ భాగస్వామ్య ప్రభుత్వం చేరలో ఉన్నామని వదిలేస్తున్నారా అని మండిపడ్డారు. ప్రధాని మోదీతో మాట్లాడతారో లేదా మీ దోస్తు(చంద్రబాబు నాయుడు) దగ్గర మోకరిల్లుతారో మీ ఇష్టం.. ఆక్రమణల చెర నుంచి విడిపించాలని డిమాండ్ చేశారు.

News July 11, 2025

ఇలా చేస్తే మీ ఆధార్ వివరాలు సేఫ్: UIDAI

image

ఆధార్ సమాచారం దుర్వినియోగం కాకుండా కాపాడుకునేందుకు బయోమెట్రిక్ లాక్ చేసుకోవాలని UIDAI పేర్కొంది. దీనికోసం <>ఆధార్ వెబ్‌సైట్‌లో<<>> ఆధార్ నంబర్, క్యాప్చా, OTPతో లాగిన్ అవ్వాలి. LOCK/ UNLOCK ఆప్షన్‌ను క్లిక్ చేయాలి. తర్వాత నెక్స్ట్ క్లిక్ చేసి బయోమెట్రిక్స్ తాత్కాలిక/పర్మినెంట్‌ లాక్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. CONSENT బాక్స్‌పై క్లిక్ చేసి నెక్స్ట్ బటన్ నొక్కితే ఈ ప్రక్రియ పూర్తవుతుంది. SHARE IT

News July 11, 2025

జగన్ పర్యటన.. మొత్తం నాలుగు కేసులు నమోదు

image

AP: YS జగన్ చిత్తూరు(D) బంగారుపాళ్యం పర్యటనపై తాజాగా మరో కేసు నమోదైంది. అనుమతి లేకున్నా రోడ్‌షో చేపట్టారని పోలీసులు కేసు నమోదు చేశారు. పరిమితికి మించి జన సమీకరణ చేపట్టారని, రోడ్డుపై మామిడికాయలు పారబోసి షరతులు ఉల్లంఘించారని, ఫొటోగ్రాఫర్‌పై జరిగిన దాడి ఘటనపై 3 వేర్వేరు కేసులు పెట్టారు. CC ఫుటేజ్, వీడియోలను పరిశీలిస్తున్న పోలీసులు మరికొందరిపై కేసులు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.