News March 20, 2024

రోహిత్‌పై పార్థివ్ ప్రశంసల వర్షం

image

ముంబై మాజీ సారథి రోహిత్ శర్మపై పార్థివ్ పటేల్ ప్రశంసల వర్షం కురిపించారు. CSK సారథిగా ధోనీ కొన్ని తప్పులు చేశాడేమో కానీ రోహిత్ ఎప్పుడూ తప్పిదాలు చేయలేదన్నారు. హార్దిక్, బుమ్రాను యాజమాన్యం పక్కనపెట్టాలని భావించినా.. రోహిత్ మద్దతుగా నిలిచారన్నారు. ఆ తర్వాత వీరిద్దరూ అత్యుత్తమ ప్రదర్శన చేసి జట్టు విజయాల్లో భాగమయ్యారని తెలిపారు. రోహిత్ కెప్టెన్సీలో MI రెండు సార్లు ఒక పరుగు తేడాతో కప్ గెలిచిందన్నారు.

Similar News

News March 6, 2026

ములుగు జిల్లా యువకుడికి సివిల్స్ ర్యాంక్

image

కష్టపడి చదివితే ఏదైనా సాధ్యమేనని ములుగు జిల్లా ఏటూరునాగారానికి చెందిన దైనంపల్లి ప్రవీణ్ నిరూపించారు. ఇటీవల గ్రూప్-1 పరీక్షల్లో 105వ ర్యాంక్ సాధించి డీఎస్పీగా ఎంపికైన ఆయన, నేడు విడుదలైన UPSC సివిల్స్ ఫలితాల్లో 793వ ర్యాంక్ సాధించారు. చిన్నతనంలో తల్లిదండ్రులను కోల్పోయిన ప్రవీణ్‌ను పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న ఆయన నానమ్మ పెంచారు. ప్రవీణ్ విజయం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News March 6, 2026

నేపాల్.. మ్యాజిక్ ఫిగర్‌ను దాటేసిన బాలేంద్ర షా పార్టీ

image

నేపాల్ పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో బాలేంద్ర షాకు చెందిన రాష్ట్రీయ స్వతంత్రత పార్టీ(RSP) మ్యాజిక్ ఫిగర్‌ను దాటేసింది. 90కి పైగా స్థానాల్లో లీడింగ్‌లో కొనసాగుతోంది. నేపాల్‌లో 275 స్థానాలు ఉండగా 165 స్థానాలకు ప్రజల ఓటింగ్ ద్వారా విజేతను ప్రకటిస్తారు. మిగిలిన 110 సీట్లను రాజకీయ పార్టీలకు వచ్చిన మొత్తం ఓట్ల శాతం ఆధారంగా కేటాయిస్తారు. 165 సీట్లలో 84 గెలిచిన పార్టీ అధికారం చేపడుతుంది.

News March 6, 2026

T20 ఫ్రాంచైజీని కొంటున్న ద్రవిడ్, అశ్విన్

image

యురోపియన్ T20 ప్రీమియర్ లీగ్‌లో భారత మాజీ క్రికెటర్లు ద్రవిడ్, అశ్విన్ భాగం కాబోతున్నారు. గ్లాస్గో ఫ్రాంచైజీని ఇండియాకు చెందిన ఇన్వెస్ట్‌మెంట్ గ్రూపుతో కలిసి వారు కొనుగోలు చేయనున్నారని BBC Sport తెలిపింది. అందులోనే డచ్ ఫ్రాంచైజీని సౌతాఫ్రికా ఇన్వెస్టర్లు కొననున్నట్లు వెల్లడించింది. దీనిలో డుప్లెసిస్, క్లాసెన్, జాంటీ రోడ్స్ ఇన్వెస్టర్లుగా ఉన్నారు. 6 జట్లు ఉండే ఈ లీగ్ ఆగస్టులో ప్రారంభం కానుంది.