News March 23, 2024

పార్టీ మారేవారిని ప్రజలే చెప్పులతో కొడతారు: పల్లా

image

TG: బీఆర్ఎస్ నుంచి గెలిచి ఇతర పార్టీల్లోకి వెళ్లేవారిని ప్రజలే చెప్పులతో కొడతారని ఆ పార్టీ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ధ్వజమెత్తారు. అక్రమాలకు పాల్పడేందుకే కొందరు పార్టీ మారుతున్నారని ఆరోపించారు. వారి అక్రమాలను బీఆర్ఎస్ బయట పెడుతుందన్నారు. ఇక అకాల వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల ఎకరాల్లో పంట దెబ్బతిందని.. సీఎం, మంత్రులు కనీసం రైతులను పరామర్శించలేదని పల్లా మండిపడ్డారు.

Similar News

News July 8, 2024

YS దృష్టిని ఆకర్షించాలని చూసేవాడిని: రేవంత్

image

మాజీ CM YSRతో తనకు భిన్నమైన అనుభవాలున్నాయని TG CM రేవంత్ తెలిపారు. ‘2007లో MLCగా తొలిసారి అసెంబ్లీకి వెళ్లా. YS దృష్టిని ఆకర్షించాలని, సమస్యలను ప్రస్తావించి బలమైన వాదనలు వినిపించాలని రాత్రంతా చదువుకునేవాడిని. 2009లో MLA అయ్యా. అప్పుడు కూడా బడ్జెట్‌పై నేను మాట్లాడితే పిల్లవాడినని కాకుండా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఆయన సమాధానం ఇచ్చేవారు’ అని మంగళగిరిలో YS జయంతి ఉత్సవాల్లో రేవంత్ గుర్తు చేసుకున్నారు.

News July 8, 2024

పెద్దిరెడ్డికి 2+2 భద్రత ఇవ్వండి.. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

image

AP: పుంగనూరు MLA పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి 2+2 భద్రతను కల్పించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని సూచించింది. ప్రాణహాని ఉందని ఆయన చెప్పినందున దీన్ని ప్రత్యేక కేసుగా పరిగణిస్తున్నట్లు తెలిపింది. తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. గతంలో తనకు ఉన్న 5+5 భద్రతను 1+1కు తగ్గించారని పెద్దిరెడ్డి <<13526971>>పిటిషన్<<>> దాఖలు చేసిన విషయం తెలిసిందే.

News July 8, 2024

రేపు బ్యాంకర్ల కమిటీతో సీఎం చంద్రబాబు భేటీ

image

AP: సీఎం చంద్రబాబు రేపు సచివాలయంలో రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీతో సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు భేటీ ప్రారంభం కానుంది. వ్యవసాయ రుణ లక్ష్యాలు, ఇతర రుణ కేటాయింపులు, సంక్షేమ పథకాల అమలుకు నిధులు తదితర అంశాలపై చర్చించనున్నారు. గృహాల నిర్మాణానికి గతంలో తీసుకున్న రుణాలపైనా చర్చించే అవకాశం ఉంది.