News November 19, 2024
పట్నం నరేందర్ రెడ్డికి జైలులో స్పెషల్ బ్యారక్

TG: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. ఆయనకు తోటి ఖైదీలతో కాకుండా ప్రత్యేక బ్యారక్ కేటాయించాలని జైలు అధికారులను ఆదేశించింది. అలాగే ఇంటి భోజనం కూడా అనుమతించాలని పేర్కొంది. కాగా లగచర్ల ఘటనకు సంబంధించి నరేందర్ను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించింది. అప్పటి నుంచి ఆయన చర్లపల్లి జైల్లో ఉంటున్నారు.
Similar News
News November 17, 2025
ఢిల్లీ పేలుళ్ల కేసు… నేపాల్లో మొబైళ్లు, కాన్పూర్లో సిమ్ల కొనుగోలు

ఢిల్లీ పేలుళ్ల కేసులో అనేక కీలకాంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎర్రకోట వద్ద పేలుళ్లకు 4 వారాల ముందే ఉమర్ బ్లూప్రింట్ రూపొందించాడు. ఇందుకు నేపాల్లో పాత మొబైళ్లను, కాన్పూర్లో సిమ్ కార్డుల్ని కొన్నాడు. సిమ్ల కోసం ID కార్డులందించిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా పేలుడుకు ముందు ఉమర్తో ముగ్గురు డాక్టర్లు కాంటాక్ట్ అయినట్లు గుర్తించారు. ఇందులో ఒకరైన పర్వేజ్ నిందితురాలు డా.షహీన్కు సోదరుడు.
News November 17, 2025
ఢిల్లీ పేలుళ్ల కేసు… నేపాల్లో మొబైళ్లు, కాన్పూర్లో సిమ్ల కొనుగోలు

ఢిల్లీ పేలుళ్ల కేసులో అనేక కీలకాంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎర్రకోట వద్ద పేలుళ్లకు 4 వారాల ముందే ఉమర్ బ్లూప్రింట్ రూపొందించాడు. ఇందుకు నేపాల్లో పాత మొబైళ్లను, కాన్పూర్లో సిమ్ కార్డుల్ని కొన్నాడు. సిమ్ల కోసం ID కార్డులందించిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా పేలుడుకు ముందు ఉమర్తో ముగ్గురు డాక్టర్లు కాంటాక్ట్ అయినట్లు గుర్తించారు. ఇందులో ఒకరైన పర్వేజ్ నిందితురాలు డా.షహీన్కు సోదరుడు.
News November 17, 2025
ఇతిహాసాలు క్విజ్ – 69 సమాధానాలు

ఈరోజు ప్రశ్న: శివుడికి ‘నీలకంఠుడు’ అని ఎందుకు అంటారు?
సమాధానం: పాల సముద్రాన్ని మథించేటప్పుడు భయంకరమైన విషం వెలువడింది. దాన్ని హాలాహలం అని అంటారు. సమస్త లోకాల సంరక్షణ కోసం శివుడు ఆ విషాన్ని తన కంఠంలో (గొంతులో) ఉంచుకుంటాడు. అందువల్ల ఆయన గొంతు నీలం రంగులోకి మారింది. అలా శివుడు నీలకంఠుడు అయ్యాడు.
<<-se>>#Ithihasaluquiz<<>>


