News April 24, 2024

మే 24న పాలిసెట్

image

TG: మే 24న ‘పాలిసెట్-2024’ని నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. లేట్ ఫీజు లేకుండా ఏప్రిల్ 28 వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చని తెలిపారు. రూ.300 ఆలస్య రుసుముతో మే 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మే 24న పరీక్ష నిర్వహించి, 10 రోజుల తర్వాత ఫలితాలు విడుదల చేయనున్నారు. రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలకు ‘పాలిసెట్’ నిర్వహిస్తారు. సైట్: https://polycet.sbtet.telangana.gov.in

Similar News

News January 13, 2025

ఇన్ఫోసిస్: వచ్చే నెలలో జీతాల పెంపు?

image

ఇన్ఫోసిస్‌ ఉద్యోగులకు గుడ్‌న్యూస్. వారికి ఫిబ్రవరిలో జీతాలు పెంచేందుకు కంపెనీ సిద్ధమైనట్లు నేషనల్ మీడియా వెల్లడించింది. కన్సల్టెంట్లు, సీనియర్ ఇంజినీర్లు, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, సిస్టమ్ ఇంజినీర్లు తదితరులకు జనవరి 1 నుంచే ఈ పెంపు వర్తిస్తుందని తెలిపింది. సంస్థలోని ఉన్నతోద్యోగులకు హైక్ లెటర్స్ మార్చిలో అందజేసే అవకాశం ఉందని పేర్కొంది. కంపెనీ చివరిసారిగా 2023 NOVలో <<15078700>>హైక్ ఇచ్చిన<<>> విషయం తెలిసిందే.

News January 13, 2025

న‌చ్చ‌క‌పోతే కోహ్లీ అవ‌కాశాలు ఇవ్వ‌డు: ఉత‌ప్ప‌

image

జ‌ట్టులో ఎవ‌రైనా న‌చ్చ‌క‌పోతే విరాట్ కోహ్లీ అవ‌కాశాలు ఇచ్చేవాడు కాదని, వాళ్ల‌ను పూర్తిగా ప‌క్క‌న పెట్టేస్తాడ‌ని ఉతప్ప ఆరోపించారు. అందుకే 2019 ప్ర‌పంచ కప్‌కి అంబ‌టి రాయుడు ఎంపిక కాలేద‌ని, కోహ్లీకి అత‌నంటే ఇష్టం లేదని పేర్కొన్నారు. రాయుడికి వ‌ర‌ల్డ్ క‌ప్ జెర్సీ, కిట్‌బ్యాగ్ పంపిన త‌రువాత కూడా జ‌ట్టులోకి తీసుకోలేద‌న్నారు. ఒక‌ర్ని ఇంటికి పిలిచి మొహం మీద త‌లుపులు వేయ‌డం త‌గ‌ద‌ని ఉత‌ప్ప వ్యాఖ్యానించారు.

News January 13, 2025

‘గేమ్ ఛేంజర్’ యూనిట్‌కు బెదిరింపులు.. కేసు నమోదు

image

‘గేమ్ ఛేంజర్’ ప్రింట్ ఆన్‌లైన్‌లో లీక్ కావడం వెనుక 45 మందితో కూడిన బృందం ఉందంటూ మూవీ యూనిట్ HYD సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వీళ్లే తమ చిత్రంపై సోషల్ మీడియాలో నెగటివ్ ప్రచారం చేశారని పేర్కొంది. తాము అడిగినంత డబ్బు ఇవ్వకపోతే లీక్ చేస్తామంటూ విడుదలకు 2 రోజుల ముందే చిత్ర బృందంలోని కీలక వ్యక్తులను బెదిరించినట్లు ఆధారాలను సమర్పించింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.