News January 10, 2025
గర్భిణులకు సీమంతం చేసిన పవన్ కళ్యాణ్
AP: పిఠాపురంలో నిర్వహించిన పల్లె పండుగ వారోత్సవాల్లో Dy.CM పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. అక్కడ శిశుసంక్షేమశాఖ ఆధ్వర్యంలో పవన్ గర్భిణులకు సీమంతం చేశారు. అనంతరం వారికి అందజేస్తున్న పోషకాహారం గురించి తెలుసుకున్నారు. అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు భోగి పళ్ల ఉత్సవం నిర్వహించారు. అక్కడ ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనను తిలకించారు. వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వివిధ రకాల స్టాళ్లను పరిశీలించారు.
Similar News
News January 26, 2025
వీర జవాన్లకు సీఎం రేవంత్ నివాళి
TG: గణతంత్ర దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లోని వీర జవాన్ల స్తూపానికి సీఎం రేవంత్ రెడ్డి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర్య సంగ్రామంలో సైనికుల త్యాగాలను ఆయన గుర్తు చేసుకున్నారు. అనంతరం సీఎం అక్కడే జరిగే రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొంటారు.
News January 26, 2025
వెబ్ సిరీస్ చూసి.. భార్యను ముక్కలుగా నరికి..
భార్యను ముక్కలుగా నరికిన ఘటనలో రోజుకో కొత్త కోణం వెలుగులోకి వస్తోంది. శవాన్ని ఎలా ముక్కలు చేసి, మాయం చేయాలి? అనే విషయాలను నిందితుడు గురుమూర్తి OTTలోని ఓ క్రైమ్ వెబ్సిరీస్లో చూసినట్లు విచారణలో తేలింది. ముక్కలను కరిగించడానికి అవసరమైన కెమికల్స్ కోసం యూట్యూబ్ వీడియోస్ చూశాడట. సెన్సార్ కట్లు లేకుండా OTTలో ఏదైనా చూపించడం వల్లే ఇలాంటి అనర్థాలు జరుగుతున్నాయని నెటిజన్లు మండిపడుతున్నారు. మీరేమంటారు?
News January 26, 2025
డా.నాగేశ్వర్రెడ్డి గురించి తెలుసా?
దేశంలో 3 పద్మ పురస్కారాలను అందుకున్న ఏకైక వైద్యుడిగా డా. నాగేశ్వర్రెడ్డి నిలిచారు. 2002లో పద్మ శ్రీ, 2016లో పద్మ భూషణ్ అందుకున్న ఆయనకు కేంద్రం తాజాగా పద్మ విభూషణ్ ప్రకటించింది. వైజాగ్లో జన్మించిన ఆయన కర్నూలులో MBBS, మద్రాస్లో MD, చండీగఢ్లో DM పూర్తి చేశారు. అంచెలంచెలుగా ఎదిగి HYDలో AIG ఆస్పత్రిని స్థాపించారు. రూ.కోట్ల జీతం కోసం విదేశాలకు వెళ్లకుండా ఇక్కడే వైద్య సేవలను అందిస్తున్నారు.