News September 12, 2024

పవన్ కళ్యాణ్ చొరవ.. 7 నెలల తర్వాత జీతాలు

image

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో కార్మికులు 7 నెలల తర్వాత జీతాలు అందుకున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని సత్యసాయి తాగునీటి సరఫరా పథకం కింద పనిచేసే 536 మంది కార్మికులు 7 నెలల జీతాలు చెల్లించాలని రెండు రోజులుగా సమ్మె చేస్తున్నారు. ఈ విషయం పవన్ దృష్టికి చేరడంతో రూ.30 కోట్లు విడుదల చేయాలని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖను ఆదేశించారు. దీంతో డిప్యూటీ సీఎంకు కార్మికులు ధన్యవాదాలు తెలిపారు.

Similar News

News August 27, 2025

తీవ్ర అల్పపీడనం.. బయటికి రావొద్దని హెచ్చరిక

image

AP: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రంగా మారిందని APSDMA తెలిపింది. ఇది రాబోయే 24 గంటల్లో ఒడిశా మీదుగా కదిలే అవకాశం ఉందని వెల్లడించింది. దీని ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, ప.గో, తూ.గో, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది. వినాయక మండపాల నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ప్రజలు అవసరమైతేనే బయటకు రావాలని పేర్కొంది.

News August 27, 2025

ఖైరతాబాద్ మహాగణపతి ముందే మహిళ ప్రసవం

image

TG: వినాయక చవితి రోజు ఖైరతాబాద్ మహా గణపతి వద్ద అద్భుతం చోటు చేసుకుంది. రాజస్థాన్‌కు చెందిన నిండు గర్భిణి రేష్మ దర్శనం కోసం క్యూ లైన్‌లో నిల్చున్న సమయంలో పాపకు జన్మనిచ్చింది. గమనించిన సిబ్బంది పక్కనే ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తల్లీబిడ్డలను తరలించారు. వైద్యులు ఆమెకు చికిత్స అందించారు. ప్రస్తుతం వారిద్దరూ క్షేమంగా ఉన్నారు. గణనాథుడి ముందే పుట్టిన ఆ చిన్నారిది ఎంతో అదృష్టమని భక్తులు తెలిపారు.

News August 27, 2025

IPLకు రిటైర్మెంట్ ప్రకటించిన అశ్విన్

image

భారత మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ IPLకు రిటైర్మెంట్ ప్రకటించారు. ‘IPL ప్లేయర్‌గా నా ప్రయాణం ఇవాళ ముగిసింది. కానీ వివిధ లీగుల్లో గేమ్ ఎక్స్‌ప్లోరర్‌గా నా సమయం మొదలైంది. ఇంతకాలం వండర్‌ఫుల్ మెమొరీస్ మిగిల్చిన అన్ని ఫ్రాంచైజీలు, IPL, BCCIకి థాంక్స్. భవిష్యత్‌ను ఆస్వాదించేందుకు వేచి చూస్తున్నా’ అని అశ్విన్ ట్వీట్ చేశారు. కాగా ఈ ఏడాది అతడు చెన్నై సూపర్‌కింగ్స్‌ తరఫున ఆడిన విషయం తెలిసిందే.