News April 24, 2024

పవన్ కళ్యాణ్ పర్యటనలు వాయిదా

image

AP: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు వాయిదా పడ్డాయి. పిఠాపురం నుంచి తాడేపల్లిగూడెంకు బయల్దేరేందుకు పవన్ హెలికాఫ్టర్ ఎక్కగా.. టేకాఫ్ సమయంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలను వాయిదా వేస్తున్నట్లు జనసేన పార్టీ ప్రకటించింది. త్వరలోనే ఆ నియోజకవర్గాల్లో పవన్ పర్యటిస్తారని పేర్కొంది.

Similar News

News December 11, 2025

ట్రంప్ గోల్డ్ కార్డ్.. US పౌరసత్వానికి రాజమార్గం

image

US ప్రెసిడెంట్ ట్రంప్ ప్రవేశపెట్టిన ‘<<18527355>>గోల్డ్ కార్డ్<<>>’ హాట్‌టాపిక్‌గా మారింది. ఈ స్కీమ్‌ ద్వారా అత్యంత వేగంగా ఆ దేశ పౌరసత్వం పొందచ్చు. భారీగా డబ్బులు ఇచ్చే వ్యక్తులు, కంపెనీలకు లీగల్ స్టేటస్‌, పౌరసత్వం ఇవ్వనున్నారు. వ్యక్తిగతంగా అప్లై చేస్తే $1M, కంపెనీలు స్పాన్సర్‌ చేస్తే $2M చెల్లించాలి. దీంతో పాటు DHS ఫీజు $15,000 కట్టాలి. అదే గ్రీన్ కార్డు కావాలంటే ఏళ్లపాటు నిరీక్షణ, కఠిన నిబంధనలు ఉంటాయి.

News December 11, 2025

ఆయుర్వేద స్నానం గురించి తెలుసా?

image

చాలామంది పనుల హడావుడిలో త్వరత్వరగా స్నానం ముగించేస్తుంటారు. కానీ శరీరానికి కలిగిన శ్రమను మర్చిపోయేలా చేసేదే నిజమైన స్నానం. ఆయుర్వేదం ప్రకారం స్నానం చేసే నీళ్లల్లో కొన్ని పదార్థాలు కలిపి చేస్తే హాయిగా ఉంటుంది. స్నానం చేసే నీటిలో కాస్త గంధం పొడి, మల్లెలు, గులాబీ రేకలు వేసుకుని చేస్తే ఒళ్లంతా చక్కని సువాసన వస్తుంది. కమలాపండు, నిమ్మతొక్కలను వేడినీళ్లలో వేసుకుని స్నానం చేస్తే శరీరం తేలిగ్గా అవుతుంది.

News December 11, 2025

మీకంటే అసద్ యాక్టివ్: T BJP ఎంపీలతో మోదీ

image

తెలంగాణలో BJP MPలు సరైన ప్రతిపక్షపాత్ర పోషించలేకపోతున్నారని ప్రధాని నరేంద్ర మోదీ అసంతృప్తి వ్యక్తంచేశారు. అసదుద్దీన్ సోషల్ మీడియా టీమ్ యాక్టివ్‌గా ఉందని ఉదహరించారు. వారి పనితీరు మారాలని, SMలో చురుగ్గా ఉండాలని హితబోధ చేశారు. AP, TGల NDA MPలకు అల్పాహార విందులో మోదీ ఈ కామెంట్స్ చేశారు. ఏపీలో చంద్రబాబు పాలన భేష్ అంటూ ఈ భేటీలో కితాబు ఇచ్చారు. అందుకే ఏపీకి పెట్టుబడులు ఎక్కువగా వస్తున్నాయన్నారు.