News April 13, 2025
రేపు శ్రీవారి దర్శనానికి పవన్ కళ్యాణ్ సతీమణి

AP: Dy.CM పవన్ కళ్యాణ్ సతీమణి అనా కొణిదల రేపు తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. సింగపూర్లో జరిగిన అగ్నిప్రమాదంలో తమ కుమారుడు మార్క్ శంకర్ సురక్షితంగా బయటపడటంతో స్వామి వారికి మొక్కులు చెల్లించనున్నారు. కాసేపటి క్రితం తిరుమలకు చేరుకున్న ఆమె గాయత్రి సదనంలో టీటీడీ ఉద్యోగుల సమక్షంలో డిక్లరేషన్ పత్రాలపై సంతకం చేశారు. రేపు వేకువజామున సుప్రభాత సేవలో పాల్గొని శ్రీవారిని దర్శించుకుంటారు.
Similar News
News November 24, 2025
ఆయుధాలు వీడేందుకు సిద్ధం: మావోయిస్టుల లేఖ

ఆయుధాలు వీడేందుకు సిద్ధంగా ఉన్నామంటూ MH, MP, ఛత్తీస్గఢ్ సీఎంలకు మావోయిస్టు ప్రతినిధి పేరిట లేఖ రాశారు. ‘పోరాటం నిలిపివేయాలన్న కేంద్ర కమిటీ సభ్యుడు కామ్రేడ్ సోను దాదా నిర్ణయానికి మద్దతిస్తున్నాం. ఆయుధాలు విడిచి ప్రభుత్వ పునరావాసం పొందాలనుకుంటున్నాం. అయితే సమష్టి నిర్ణయానికి రావడానికి మాకు 15 FEB 2026 వరకు సమయం ఇవ్వాలని కోరుతున్నాం. దీని వెనుక ఎలాంటి నిగూఢ ఉద్దేశం లేదు’ అని తెలిపారు.
News November 24, 2025
ఆయుధాలు వీడేందుకు సిద్ధం: మావోయిస్టుల లేఖ

ఆయుధాలు వీడేందుకు సిద్ధంగా ఉన్నామంటూ MH, MP, ఛత్తీస్గఢ్ సీఎంలకు మావోయిస్టు ప్రతినిధి పేరిట లేఖ రాశారు. ‘పోరాటం నిలిపివేయాలన్న కేంద్ర కమిటీ సభ్యుడు కామ్రేడ్ సోను దాదా నిర్ణయానికి మద్దతిస్తున్నాం. ఆయుధాలు విడిచి ప్రభుత్వ పునరావాసం పొందాలనుకుంటున్నాం. అయితే సమష్టి నిర్ణయానికి రావడానికి మాకు 15 FEB 2026 వరకు సమయం ఇవ్వాలని కోరుతున్నాం. దీని వెనుక ఎలాంటి నిగూఢ ఉద్దేశం లేదు’ అని తెలిపారు.
News November 24, 2025
టమాటా కేజీ రూ.80!

TG: నిన్న, మొన్నటి వరకు కేజీ రూ.20-40కే లభించిన టమాటా ఇప్పుడు కొండెక్కింది. ప్రస్తుతం కిలో రూ.60 నుంచి రూ.80 వరకు పలుకుతోంది. దీంతో మార్కెట్లలో టమాట రేటు చూసి సామాన్యులు నోరెళ్లబెడుతున్నారు. కొన్ని మార్కెట్లలో అయితే టమాటానే దొరకడం లేదు. ధర వెచ్చించలేక వ్యాపారులు కొనుగోలు చేయడంలేదు. ఇటీవల మొంథా తుఫాన్ ప్రభావంతో టమాట పంటలు తీవ్రంగా దెబ్బ తినడమే ధరల పెరుగుదలకు కారణమని వ్యాపారులు తెలిపారు.


