News April 13, 2025
రేపు శ్రీవారి దర్శనానికి పవన్ కళ్యాణ్ సతీమణి

AP: Dy.CM పవన్ కళ్యాణ్ సతీమణి అనా కొణిదల రేపు తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. సింగపూర్లో జరిగిన అగ్నిప్రమాదంలో తమ కుమారుడు మార్క్ శంకర్ సురక్షితంగా బయటపడటంతో స్వామి వారికి మొక్కులు చెల్లించనున్నారు. కాసేపటి క్రితం తిరుమలకు చేరుకున్న ఆమె గాయత్రి సదనంలో టీటీడీ ఉద్యోగుల సమక్షంలో డిక్లరేషన్ పత్రాలపై సంతకం చేశారు. రేపు వేకువజామున సుప్రభాత సేవలో పాల్గొని శ్రీవారిని దర్శించుకుంటారు.
Similar News
News April 11, 2026
పోస్టల్ శాఖలో ఉద్యోగాలు.. ఫలితాలు విడుదల

పోస్టల్ శాఖలో గ్రామీణ డాక్ సేవక్(GDS) ఉద్యోగాల భర్తీకి JANలో ఇచ్చిన 28,636 పోస్టుల భారీ నోటిఫికేషన్ <
News April 11, 2026
మనిషి ప్రాణం, ఆకలి గురించి ఎంత గొప్పగా చెప్పారో!

పని తొడవులు వేరు బంగారమొక్కటి
పరగ ఘటలు వేరు ప్రాణమొక్కటి
అరయ తిండ్లు వేరు ఆకలి యొక్కటి
విశ్వదాభిరామ! వినుర వేమ!!
తాత్పర్యం: ఆభరణాలు ఎన్ని రకాలున్నా వాటిని తయారు చేసే బంగారం ఒక్కటే. మనుషుల రూపాలు, శరీరాలు వేర్వేరుగా ఉన్నా వాటిలో ఉండే ప్రాణం ఒక్కటే. అలాగే ఆహారాలు ఎన్నో ఉన్నా వాటిని కోరే ఆకలి మాత్రం ఒక్కటే.
<<-se>>#PADHYAM<<>>
News April 11, 2026
సంక్రాంతికి బాలయ్య-విజయ్ కనకమేడల సినిమా?

‘నాంది’ ఫేమ్ విజయ్ కనకమేడల డైరెక్షన్లో నందమూరి బాలకృష్ణ ఓ సినిమా చేయబోతున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. ఈ మూవీని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇది కాకుండా గోపీచంద్ మలినేనితో బాలయ్య ఓ మూవీ చేస్తున్నారు. ఆ మూవీయే సంక్రాంతి బరిలో ఉంటుందని తొలుత అనుకున్నప్పటికీ ఇప్పుడు ప్లాన్లో మార్పు జరిగినట్లు తెలుస్తోంది. దీనిపై మేకర్స్ నుంచి స్పష్టత రావాల్సి ఉంది.


