News April 28, 2024
పిఠాపురంలో రెండు రోజులు పవన్ పర్యటన

AP: రేపటి నుంచి రెండు రోజుల పాటు జనసేనాని పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పర్యటించనున్నారు. రేపు ఉదయం 8 గంటలకు ప్రచారం ప్రారంభమవుతుందని మాజీ ఎమ్మెల్యే SVSN వర్మ తెలిపారు. మరుసటి రోజు ర్యాలీ కొనసాగుతుందని పేర్కొన్నారు. రైతులను కలిసి వారి సమస్యలను తెలుసుకోనున్నారు. కాగా నిన్న పవన్కు మద్దతుగా వరుణ్ తేజ్ ప్రచారం నిర్వహించిన సంగతి తెలిసిందే.
Similar News
News November 1, 2025
IPL: LSG హెడ్ కోచ్గా యువరాజ్ సింగ్?

IPL-2026లో LSG హెడ్ కోచ్గా యువరాజ్ సింగ్ వ్యవహరించనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇప్పటికే ఆ ఫ్రాంఛైజీ ఆయనతో చర్చలు జరిపినట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. గత సీజన్లో LSG కోచ్గా ఆసీస్ మాజీ ప్లేయర్ జస్టిన్ లాంగర్ పనిచేశారు. పంత్ కెప్టెన్గా ఉన్నారు. ఈ జట్టు పాయింట్స్ టేబుల్లో ఏడో స్థానానికి పరిమితమైంది. కాగా ఇటీవల NZ క్రికెటర్ విలియమ్సన్ను స్ట్రాటజిక్ అడ్వైజర్గా నియమించింది.
News November 1, 2025
ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా ప్రజా పాలన విజయోత్సవాలు: Dy.CM

TG రైజింగ్, రాష్ట్ర ఆవిర్భావం, అభివృద్ధి అంశాలు కలగలిపి ఒక సమగ్ర ప్రణాళికతో ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా ప్రజా పాలన విజయోత్సవాలు (DEC 1-9) నిర్వహించాలని Dy.CM భట్టి అన్నారు. భవిష్యత్తులో TG ఏం సాధించబోతుందనే విషయాలను ప్రపంచానికి వివరించేలా కార్యక్రమాలు ఉండాలని సమీక్ష సమావేశంలో అధికారులకు సూచించారు. విజయోత్సవాలకు పెట్టుబడిదారులను ఆహ్వానిస్తున్నామని, భారీగా MOUలు జరిగేలా వాతావరణం ఉండాలన్నారు.
News November 1, 2025
ఢిల్లీలో నేటి నుంచి ఈ వాహనాలపై బ్యాన్

ఢిల్లీలో గాలి నాణ్యత క్షీణించిన నేపథ్యంలో నగరంలో రిజిస్టర్ కాని, BS-VI నిబంధనలకు అనుగుణంగా లేని కమర్షియల్ వెహికల్స్పై ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ నిషేదం విధించింది. నేటి నుంచి వాటికి నగరంలోకి అనుమతి ఉండదు. దీని నుంచి BS-IV వాణిజ్య వాహనాలకు 2026, OCT 31 వరకు మినహాయించింది. ఢిల్లీ రిజిస్టర్డ్ కమర్షియల్ గూడ్స్ వెహికల్స్, BS-VI, CNG/LNG, ఎలక్ట్రికల్ కమర్షియల్ వాహనాలకు అనుమతి ఉంటుంది.


