News April 28, 2024
పిఠాపురంలో రెండు రోజులు పవన్ పర్యటన

AP: రేపటి నుంచి రెండు రోజుల పాటు జనసేనాని పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పర్యటించనున్నారు. రేపు ఉదయం 8 గంటలకు ప్రచారం ప్రారంభమవుతుందని మాజీ ఎమ్మెల్యే SVSN వర్మ తెలిపారు. మరుసటి రోజు ర్యాలీ కొనసాగుతుందని పేర్కొన్నారు. రైతులను కలిసి వారి సమస్యలను తెలుసుకోనున్నారు. కాగా నిన్న పవన్కు మద్దతుగా వరుణ్ తేజ్ ప్రచారం నిర్వహించిన సంగతి తెలిసిందే.
Similar News
News January 21, 2026
శబరిమల ఆలయం ఎప్పుడు తెరుస్తారంటే?

శబరిమలలో 2నెలలు కొనసాగిన మండల-మకరవిలక్కు ముగియడంతో ఆలయాన్ని అధికారులు మూసేశారు. మళ్లీ ఫిబ్రవరిలో జరగబోయే నెలవారీ పూజల కోసం ఆలయాన్ని తిరిగి తెరవనున్నారు. ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డ్ తెలిపిన వివరాల ప్రకారం ఆలయాన్ని FEB 12 సా.5 గంటలకు తెరుస్తారు. పూజలు 17వ తేదీ రా.10గం.కు వరకు కొనసాగుతాయి. అప్పుడూ భక్తులు స్వామివారిని దర్శించుకోవచ్చు. గతంలో మాదిరే ఆన్లైన్ బుకింగ్, దర్శన టోకెన్లు కొనసాగుతాయి.
News January 21, 2026
దావోస్లో సీఎం రేవంత్, చిరంజీవి

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనలో మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ‘జాయిన్ ది రైజ్’ కార్యక్రమంలో తెలంగాణ విజన్ను ప్రదర్శించగా.. ఆ కార్యక్రమంలో సీఎం రేవంత్, చిరంజీవి, మంత్రులు పక్కపక్కనే కూర్చున్నారు. ఆప్యాయంగా మాట్లాడుకుని కలిసి విందులో పాల్గొన్నారు. అయితే గ్లోబల్ బిజినెస్ లీడర్లు, పాలసీ నిర్ణేతలు పాల్గొనే ఈ ప్రోగ్రాంకు మెగాస్టార్ ఎందుకు వెళ్లారనే దానిపై క్లారిటీ రాలేదు.
News January 21, 2026
మహిళల్లో షుగర్ వచ్చే ముందు కనిపించే లక్షణాలు

మహిళల్లో మధుమేహం వచ్చేముందు కొన్ని ప్రత్యేక లక్షణాలు కనిపిస్తాయి. వాటిని విస్మరించకూడదంటున్నారు నిపుణులు. కొన్నిసార్లు మధుమేహం హార్మోన్ల అసమతుల్యతకు కారణమవుతుంది. దీంతో పీరియడ్స్ గతి తప్పుతాయి. చర్మం ఎర్రగా మారడం, దురద రావడం, జననేంద్రియాలు పొడిబారడంతో పాటు నాడీ వ్యవస్థ దెబ్బతిని చేతులు, కాళ్ళలో జలదరింపు వంటి లక్షణాలు కనిపిస్తాయి. వీటిని గమనించిన వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.


