News April 28, 2024
పిఠాపురంలో రెండు రోజులు పవన్ పర్యటన

AP: రేపటి నుంచి రెండు రోజుల పాటు జనసేనాని పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పర్యటించనున్నారు. రేపు ఉదయం 8 గంటలకు ప్రచారం ప్రారంభమవుతుందని మాజీ ఎమ్మెల్యే SVSN వర్మ తెలిపారు. మరుసటి రోజు ర్యాలీ కొనసాగుతుందని పేర్కొన్నారు. రైతులను కలిసి వారి సమస్యలను తెలుసుకోనున్నారు. కాగా నిన్న పవన్కు మద్దతుగా వరుణ్ తేజ్ ప్రచారం నిర్వహించిన సంగతి తెలిసిందే.
Similar News
News April 18, 2026
చర్చకు సిద్ధమా? పవన్కు ప్రకాశ్రాజ్ సవాల్

మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రతిపక్షాలు కావాలనే అడ్డుకున్నాయని AP D.CM <<19679100>>పవన్<<>> చేసిన ట్వీట్పై ప్రకాశ్రాజ్ స్పందించారు. ‘మోదీని మెప్పించేందుకు ప్రజలకు అబద్ధాలు చెప్పడం ఆపండి. ఈ బిల్లు 2023లోనే ఆమోదం పొందింది. దాన్ని ఇప్పుడూ ఆమోదించవచ్చు. కానీ మీ ముఠా డీలిమిటేషన్ బిల్లును ఆమోదింపజేయాలని చూసింది. ఇది దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని తగ్గిస్తుంది. దీనిపై డిబేట్కు సిద్ధమా’ అని సవాల్ విసిరారు.
News April 18, 2026
B12 లోపంతో నరాలు దెబ్బతినే ప్రమాదం: వైద్యులు

రక్తహీనత లేకపోయినా 40% మందిలో విటమిన్ B12 లోపం వల్ల నరాల వ్యాధులు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మెట్ఫార్మిన్ మందు వాడే 15–30% మధుమేహ బాధితుల్లో ఈ లోపం కనిపిస్తోందని చెబుతున్నారు. ‘B12 స్థాయి 200 pg/mL కంటే తగ్గితే నరాలు శాశ్వతంగా దెబ్బతినే ముప్పు ఉంది. కాబట్టి సకాలంలో B12, MMA, హోమోసిస్టీన్ పరీక్షలు చేయించుకోవాలి. ఆలస్యమైతే నష్టం పూడ్చలేం’ అని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
News April 18, 2026
టెన్త్ ఫలితాలు ఎప్పుడంటే?

తెలంగాణ టెన్త్ పరీక్ష పేపర్ల వాల్యుయేషన్ ఈ నెల 23తో ముగించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. తరువాత మార్కుల నమోదు ప్రక్రియకు మరో పది రోజుల సమయం పట్టనుంది. దీంతో మే 4 లేదా 5 తేదీల్లో ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. టీజీలో మొత్తం 5.17 లక్షల మంది రెగ్యులర్ విద్యార్థులు టెన్త్ పరీక్షలు రాశారు.
అలాగే ఏపీలో ఈ నెలాఖరులో వెల్లడించేందుకు అధికారులు ప్లాన్ చేస్తున్నారు.


