News December 15, 2024

UPI ద్వారా రూ.223 లక్షల కోట్ల చెల్లింపులు: కేంద్రం

image

ఈ ఏడాది జనవరి-నవంబర్ మధ్య యూపీఐ ద్వారా 15,547 కోట్ల ట్రాన్సాక్షన్స్ జరిగినట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. మొత్తం రూ.223 లక్షల కోట్ల చెల్లింపులు జరిగాయని తెలిపింది. దేశంలో ఆర్థిక లావాదేవీలపై యూపీఐ ప్రభావాన్ని ఇది తెలియజేస్తోందని పేర్కొంది. ప్రస్తుతం భారత్‌తో పాటు యూఏఈ, సింగపూర్, భూటాన్, నేపాల్, శ్రీలంక, ఫ్రాన్స్, మారిషస్ దేశాల్లోనూ యూపీఐ అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే.

Similar News

News October 17, 2025

చతుర్వేదాల ఆవిర్భావం ఎలా జరిగిందంటే?

image

వేదాలు అపౌరుషేయాలు. అంటే వాటిని మనుషులు రచించలేదని అర్థం. పరమాత్మే మన కోసం వర ప్రసాదాలుగా అందించాడు. సృష్టి ఆరంభంలో గాయత్రి వంటి ఛందస్సుతో 4 వేదాలను ప్రకటించాడు. అగ్ని ద్వారా ఋగ్వేదాన్ని, వాయువు ద్వారా యజుర్వేదాన్ని, సూర్యుని ద్వారా సామవేదాన్ని, అంగీరసుని ద్వారా అధర్వణ వేదాన్ని అందించాడు. ఈ నలుగురి ద్వారానే ఈ వేదజ్ఞానం మహర్షులకు లభించింది. వారి నుంచే ఆ జ్ఞానాన్ని మనం పొందుతున్నాం. <<-se>>#VedikVibes<<>>

News October 17, 2025

నేడు విద్యుత్ ఉద్యోగులతో మరోసారి చర్చలు

image

AP: ప్రధాని పర్యటన నేపథ్యంలో విద్యుత్ ఉద్యోగులు <<18008727>>సమ్మె<<>>ను తాత్కాలికంగా వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఈనెల 15న జరిగిన చర్చల్లో కొన్ని అంశాలపై చర్చలు కొలిక్కి వచ్చాయని JAC నేత కృష్ణయ్య తెలిపారు. దీంతో మిగిలిన అంశాలపై ఇవాళ చర్చించి సమ్మెపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఈ మేరకు మధ్యాహ్నం 3 గం.కు విజయవాడలో చర్చలు ప్రారంభం కానున్నాయి.

News October 17, 2025

CM చంద్రబాబు, లోకేశ్ విదేశీ పర్యటనలు

image

AP: మంత్రి లోకేశ్ రేపట్నుంచి ఈనెల 25 వరకు AUSలో పర్యటించనున్నారు. వచ్చేనెల 14, 15న విశాఖలో జరగనున్న భాగస్వామ్య సదస్సుకు ప్రారిశ్రామికవేత్తలను ఆహ్వానించనున్నారు. పెట్టుబడులు, ఉపాధి కల్పనే ప్రధాన లక్ష్యంగా సీఎం చంద్రబాబు కూడా విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. నవంబర్ 2 నుంచి 5వ తేదీ వరకు లండన్‌లో పర్యటించనున్నారు. విశాఖలో జరగనున్న పెట్టుబడుల సదస్సుకు పారిశ్రామికవేత్తలను ఆహ్వానించనున్నారు.