News December 15, 2024

UPI ద్వారా రూ.223 లక్షల కోట్ల చెల్లింపులు: కేంద్రం

image

ఈ ఏడాది జనవరి-నవంబర్ మధ్య యూపీఐ ద్వారా 15,547 కోట్ల ట్రాన్సాక్షన్స్ జరిగినట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. మొత్తం రూ.223 లక్షల కోట్ల చెల్లింపులు జరిగాయని తెలిపింది. దేశంలో ఆర్థిక లావాదేవీలపై యూపీఐ ప్రభావాన్ని ఇది తెలియజేస్తోందని పేర్కొంది. ప్రస్తుతం భారత్‌తో పాటు యూఏఈ, సింగపూర్, భూటాన్, నేపాల్, శ్రీలంక, ఫ్రాన్స్, మారిషస్ దేశాల్లోనూ యూపీఐ అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే.

Similar News

News January 17, 2025

హీరోపై దాడి.. నిందితుడి కోసం వేట, ఒకరి అరెస్టు

image

సైఫ్ అలీఖాన్‌పై కత్తి దాడి కేసు నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అతడు చివరిసారిగా ముంబైలోని బాంద్రా రైల్వేస్టేషన్‌లో పోలీసులు గుర్తించారు. ఈ ఉదయం వాసాయి-విరార్ వైపు వెళ్లినట్లు అనుమానిస్తున్నారు. పోలీసు టీంలు వాసాయి, నల్లసోపారా, విరార్ ప్రాంతాల్లో గాలిస్తున్నారు. మరోవైపు ఈ కేసుకు సంబంధించి ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు. కాగా సైఫ్ అలీఖాన్ లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

News January 17, 2025

పంచాయతీ కార్యదర్శులకు షాక్!

image

TG: నల్గొండ(D)లో అనుమతి లేకుండా నెలల తరబడి విధులకు గైర్హాజరైన 99 మంది పంచాయతీ కార్యదర్శుల సర్వీసును జిల్లా కలెక్టర్ బ్రేక్ చేశారు. దీంతో గైర్హాజరైన కాలానికి సంబంధించిన సర్వీసును వారు కోల్పోనున్నారు. దీని వల్ల సర్వీస్ రెగ్యులరైజేషన్, ఇంక్రిమెంట్లు, పెన్షన్ల విషయంలో వారికి నష్టం జరిగే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం వీరిని తిరిగి విధుల్లోకి తీసుకున్నారు. పాత స్థానాల్లో కాకుండా వేరే చోట పోస్టింగ్ ఇచ్చారు.

News January 17, 2025

మళ్లీ పెరిగిన బంగారం ధరలు

image

ఇవాళ హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. 10 గ్రా. 24 క్యారెట్ల గోల్డ్ రూ.650 పెరిగి రూ.81,270కి చేరింది. 22 క్యారెట్ల పసిడి రూ.600 పెరిగి రూ.74,500 పలుకుతోంది. కేజీ వెండి రూ.1000 పెరిగి రూ.1,04,000కు చేరింది.