News June 21, 2024

కేంద్రాన్ని ఆశ్రయించిన పేటీఎం ఉద్యోగులు

image

పేటీఎంలో వేటుకు గురైన పలువురు ఉద్యోగులు కేంద్ర కార్మిక మంత్రిత్వశాఖను ఆశ్రయించారు. ఎలాంటి పరిహారం చెల్లించకుండా తమను తొలగించడం చట్టవిరుద్ధమని ఆరోపించారు. తమ ఉద్యోగాలను సంస్థ పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దాదాపు 50 మంది ఉద్యోగులు కేంద్రానికి ఫిర్యాదులు చేసినట్లు తెలుస్తోంది. ఒకవేళ కేంద్రం నుంచి సానుకూల స్పందన రాకుంటే కోర్టును ఆశ్రయిస్తామని ఉద్యోగులు చెబుతున్నారు.

Similar News

News November 15, 2025

రెండు చోట్ల ఓడిన బిహార్ ‘సింగం’

image

నిన్న వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బిహార్ ‘సింగం’గా పిలవబడే మాజీ ఐపీఎస్ శివ్‌దీప్ లాండే ఓటమిపాలయ్యారు. అరారియా, జమాల్‌పూర్‌ నియోజకవర్గాల నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. జమాల్‌పూర్‌లో జేడీయూ నేత నచికేత మండల్ 96,683 ఓట్లతో, అరారియాలో కాంగ్రెస్ అభ్యర్థి అబిదుర్ రెహ్మాన్ 91,529 ఓట్లతో విజయం సాధించారు. లాండేకు ప్రజాదరణ ఉన్నప్పటికీ దానిని ఓట్లుగా మార్చుకునే ప్రయత్నంలో విఫలమయ్యారు.

News November 15, 2025

నిర్మాణాత్మక సంస్కరణలకు సిద్ధం: మంత్రి లోకేశ్

image

AP: ఏఐ మానవాళికి ముప్పుకాదని, అది హ్యుమానిటీని పెంచుతుందని మంత్రి లోకేశ్ చెప్పారు. CII సదస్సులో ‘AI-భవిష్యత్తులో ఉద్యోగాలు’ అంశంపై ఆయన మాట్లాడారు. ‘ప్రతి పారిశ్రామిక విప్లవం అధిక ఉద్యోగాలను కల్పిస్తుందికానీ తొలగించదు. IT, ఫుడ్ ప్రాసెసింగ్‌లో పారిశ్రామికవేత్తలు పురోగతి సాధిస్తున్నారు. వీరితో పనిచేసేందుకు ప్రభుత్వం ఉత్సాహంగా ఉంది. నిర్మాణాత్మక సంస్కరణలు తెచ్చేందుకు సిద్ధం’ అని పేర్కొన్నారు.

News November 15, 2025

ఇకనైనా ‘వలస’ జీవులకు విముక్తి లభించేనా?

image

బిహార్‌లో మరోసారి ఎన్డీఏ తమ ప్రభుత్వాన్ని నెలకొల్పనుంది. ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లి జీవనోపాధి పొందుతున్న లక్షలాది మంది తిరిగి తమ ఉపాధి క్షేత్రాలకు తిరిగిరానున్నారు. ఈక్రమంలో ఏళ్లు గడుస్తున్నా వలస జీవుల బతుకులు మారట్లేదని, ప్రజలకు ఉపాధి కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమవుతూనే ఉన్నాయనే చర్చ జరుగుతోంది. స్థిరమైన ప్రభుత్వం రావడంతో ఇకనైనా కంపెనీలు నెలకొల్పి స్థానికంగా ఉపాధి కల్పించాలని సూచిస్తున్నారు.