News November 18, 2024

PDS ధాన్యం పక్కదారి.. రూ.69 వేల కోట్ల నష్టం

image

PDS ద్వారా కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు స‌ర‌ఫ‌రా చేసిన ఆహార ధాన్యాలు ప‌క్క‌దారి ప‌ట్ట‌డంతో ₹69 వేల కోట్ల న‌ష్టం వాటిల్లిన‌ట్టు ఎకాన‌మిక్ థింక్ ట్యాంక్ అధ్య‌య‌నంలో తేలింది. 28% లబ్ధిదారుల‌కు ధాన్యం చేర‌డం లేద‌ని వెల్ల‌డైంది. ఆగ‌స్టు, 2022-జులై, 2023 మ‌ధ్య కాలానికి సంబంధించి సంస్థ అధ్య‌య‌నం చేసింది. ధాన్యాన్ని ఓపెన్ మార్కెట్, ఇత‌ర ఎగుమ‌తుల‌కు మ‌ళ్లించివుంటార‌న్న అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

Similar News

News October 19, 2025

దీపావళి: దీపారాధనకు పాత ప్రమిదలను వాడొచ్చా?

image

పాత(లేదా) గతేడాది వాడిన మట్టి ప్రమిదలను ఈసారి కూడా వెలిగించడం మంచిది కాదని పండితులు చెబుతున్నారు. ‘ప్రమిదలు దైవిక శక్తులతో పాటు ప్రతికూల శక్తులను కూడా గ్రహిస్తాయి. వాటిని తిరిగి వాడితే అది మన అదృష్టాన్ని, సంపదను ప్రభావితం చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీపావళి రోజున కొత్త ప్రమిదలను వాడటమే శ్రేయస్కరం. పాత ప్రమిదలను తులసి కోటళ్లో, గౌరవంగా పవిత్ర నదుల్లో, పవిత్ర చెట్ల మొదళ్లలో ఉంచడం మంచిది.

News October 19, 2025

వీధి వ్యాపారులతో ముచ్చటించిన సీఎం

image

AP: సీఎం చంద్రబాబు విజయవాడ బీసెంట్ రోడ్‌లో పర్యటించారు. పలువురు చిరు, వీధి వ్యాపారులు, జనరల్ స్టోర్, చెప్పుల షాపు నిర్వాహకులతో మాట్లాడారు. జీఎస్టీ 2.0తో ధరల తగ్గింపు గురించి ఆయా వర్గాల వారిని అడిగి తెలుసుకున్నారు. వ్యాపారుల సమస్యలు తెలుసుకోవడంతో పాటు యజమానులు, సామాన్య ప్రజలతో ముచ్చటించారు.

News October 19, 2025

విజయం దిశగా భారత్

image

ఉమెన్ వరల్డ్ కప్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచులో భారత బ్యాటర్లు నిలకడగా రాణిస్తున్నారు. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (70) రన్స్ చేసి ఔటయ్యారు. ఓపెనర్ స్మృతి మంధాన (63*) క్రీజులో ఉన్నారు. కౌర్, స్మృతి 120కి పైగా భాగస్వామ్యం నమోదు చేశారు. ప్రస్తుతం భారత్ స్కోర్ 31 ఓవర్లలో 170/3గా ఉంది. టీమ్ ఇండియా విజయానికి 114 బంతుల్లో 119 రన్స్ అవసరం. మరి ఈ మ్యాచులో ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి.