News March 29, 2024

నేడు రేవంత్ అధ్యక్షతన పీఈసీ సమావేశం

image

TG: సీఎం రేవంత్ అధ్యక్షతన ఇవాళ సా.5 గంటలకు కాంగ్రెస్ పీఈసీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో మంత్రులు, పార్టీ ముఖ్య నేతలు పాల్గొననున్నారు. లోక్ సభ ఎన్నికలు, ఏప్రిల్ 6న తుక్కుగూడలో జరిగే సభ ఏర్పాట్లు, ఎంపీ స్థానాలు, 100 రోజుల పాలన వంటి అంశాలపై చర్చించనున్నారు. తుక్కుగూడ సభలో 5 గ్యారంటీలను ప్రకటించనున్నట్లు సీఎం రేవంత్ ఇప్పటికే వెల్లడించారు. ఈ సభకు రాహుల్ గాంధీ, ఖర్గే హాజరవుతారని పేర్కొన్నారు.

Similar News

News January 21, 2026

జగన్ పాదయాత్ర YCPని అధికారంలోకి తెస్తుందా?

image

AP: గతంలో కలిసొచ్చిన పాదయాత్రనే జగన్ మళ్లీ నమ్ముకున్నట్లు తెలుస్తోంది. అప్పట్లో ‘ప్రజా సంకల్పయాత్ర’ పేరుతో 3,600kmపైగా నడిచిన ఆయన 151 సీట్లతో గెలిచారు. ఈసారి ఎన్నికలకు ఏడాదిన్నర ముందే ప్రజల్లోకి వెళ్లి కూటమి పాలనను ఎండగట్టడంతో పాటు అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. రాష్ట్రంలో పాదయాత్రలు వర్కౌట్ అవుతున్న వేళ జగన్ ఆ ఫార్ములాతోనే మళ్లీ సీఎం అవుతారని అనుకుంటున్నారా?

News January 21, 2026

RGSSHలో ఇంటర్వ్యూతో ఉద్యోగాలు

image

రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్(RGSSH) 14 సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి MBBS, DNB, PG డిప్లొమా, MS/MD, MCh, DM అర్హతతో పాటు పని అనుభవం గలవారు జనవరి 28న ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 37ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. వెబ్‌సైట్: https://rgssh.delhi.gov.in

News January 21, 2026

సింగరేణి బాధ్యత కేంద్రం తీసుకుంటుంది: కిషన్‌రెడ్డి

image

తెలంగాణ ప్రభుత్వం అంగీకరిస్తే సింగరేణి నిర్వహణ బాధ్యత కేంద్రం తీసుకుంటుందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. మంత్రుల మధ్య వాటాల గొడవతోనే సింగరేణి వివాదం వెలుగులోకి వచ్చిందని తెలిపారు. అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందుకు సంబంధించి సీఎం రేవంత్‌కు లేఖ రాస్తానని పేర్కొన్నారు.