News March 29, 2024

నేడు రేవంత్ అధ్యక్షతన పీఈసీ సమావేశం

image

TG: సీఎం రేవంత్ అధ్యక్షతన ఇవాళ సా.5 గంటలకు కాంగ్రెస్ పీఈసీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో మంత్రులు, పార్టీ ముఖ్య నేతలు పాల్గొననున్నారు. లోక్ సభ ఎన్నికలు, ఏప్రిల్ 6న తుక్కుగూడలో జరిగే సభ ఏర్పాట్లు, ఎంపీ స్థానాలు, 100 రోజుల పాలన వంటి అంశాలపై చర్చించనున్నారు. తుక్కుగూడ సభలో 5 గ్యారంటీలను ప్రకటించనున్నట్లు సీఎం రేవంత్ ఇప్పటికే వెల్లడించారు. ఈ సభకు రాహుల్ గాంధీ, ఖర్గే హాజరవుతారని పేర్కొన్నారు.

Similar News

News January 14, 2025

‘డాకు మహారాజ్’ 2 రోజుల కలెక్షన్లు ఇవే..

image

నందమూరి బాలకృష్ణ నటించిన ‘డాకు మహారాజ్’ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబడుతోంది. రెండు రోజుల్లో రూ.74 కోట్లకు పైగా గ్రాస్ వచ్చినట్లు చిత్ర నిర్మాణ సంస్థ వెల్లడించింది. ఈ సంక్రాంతి బ్లాక్‌బస్టర్ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరిస్తోందని పేర్కొంది. కాగా ఈ మూవీ తొలి రోజైన ఆదివారం రూ.56 కోట్లు వసూలు చేసింది.

News January 14, 2025

శివకార్తికేయన్ ఫ్యామిలీని చూశారా?

image

తమిళ హీరో శివకార్తికేయన్ ఇటీవల వచ్చిన అమరన్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. తాజాగా ఆయన సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. కుటుంబంతో కలిసి దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆయన ఫ్యామిలీ క్యూట్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ హీరోకు భార్య ఆర్తి, ఒక పాప, ఇద్దరు బాబులు ఉన్నారు. శివకార్తికేయన్, ఆర్తి 2010లో పెళ్లి చేసుకున్నారు.

News January 14, 2025

పండగ వేళ తగ్గిన బంగారం ధరలు

image

సంక్రాంతి పండగ వేళ ప్రీషియస్ మెటల్స్ ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.110 తగ్గి రూ.79,960 వద్ద కొనసాగుతోంది. 22 క్యారెట్ల గోల్డ్ రూ.100 తగ్గి రూ.73,300 వద్ద ఉంది. వెండి కిలో రూ.2000 పడిపోయి రూ.1,00,000 వద్ద ట్రేడవుతోంది. ఇక ప్లాటినం 10 గ్రాముల ధర రూ.60 తగ్గి రూ.26,540 వద్ద ఉంది. ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసేంత వరకు ధరల్లో అనిశ్చితి తప్పకపోవచ్చని విశ్లేషకులు అంటున్నారు.