News March 29, 2024

నేడు రేవంత్ అధ్యక్షతన పీఈసీ సమావేశం

image

TG: సీఎం రేవంత్ అధ్యక్షతన ఇవాళ సా.5 గంటలకు కాంగ్రెస్ పీఈసీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో మంత్రులు, పార్టీ ముఖ్య నేతలు పాల్గొననున్నారు. లోక్ సభ ఎన్నికలు, ఏప్రిల్ 6న తుక్కుగూడలో జరిగే సభ ఏర్పాట్లు, ఎంపీ స్థానాలు, 100 రోజుల పాలన వంటి అంశాలపై చర్చించనున్నారు. తుక్కుగూడ సభలో 5 గ్యారంటీలను ప్రకటించనున్నట్లు సీఎం రేవంత్ ఇప్పటికే వెల్లడించారు. ఈ సభకు రాహుల్ గాంధీ, ఖర్గే హాజరవుతారని పేర్కొన్నారు.

Similar News

News February 11, 2026

ఇళ్ల క్రమబద్ధీకరణ గడువు పొడిగింపు

image

AP: క్యాబినెట్ భేటీలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ భూముల్లోని ఇళ్ల క్రమబద్ధీకరణ గడువును జూన్ వరకు పొడిగించింది. భూముల బదిలీకి సంబంధించి చట్టసవరణకు ముసాయిదా బిల్లు, ఏపీ ఏఐ లివింగ్ ల్యాబ్స్ ప్రారంభం సహా మొత్తం 24 అంశాలకు ఆమోదం తెలిపింది. ఆగిరిపల్లిలో బయోగ్యాస్ ప్లాంట్‌కు 45.6 ఎకరాలు, సంజామలలో సౌర విద్యుత్ ప్రాజెక్టుకు 1500 ఎకరాలు, ఆనందపురంలో 18.57 ఎకరాలు కేటాయించాలని నిర్ణయించింది.

News February 11, 2026

AIకి ప్రిపేర్ అవ్వకపోతే వెళ్లిపోవచ్చన్న గూగుల్

image

కంపెనీ AI ప్రణాళికలకు సిద్ధంగా లేని ఉద్యోగులు స్వచ్ఛందంగా విరమణ తీసుకోవచ్చని గూగుల్ పేర్కొంది. వారికోసం ఓ ప్యాకేజీని సైతం తీసుకొచ్చింది. USలో పనిచేసే గ్లోబల్ బిజినెస్ ఆర్గనైజేషన్(GBO)లోని కొందరు ఉద్యోగులకు ఈ ప్యాకేజీ వర్తించనుంది. GBO అనేది గూగుల్ సంస్థ ఉత్పత్తులు, గ్లోబల్ రెవెన్యూ గ్రోత్ తదితరాలను పర్యవేక్షిస్తుంటుంది. అటు అమెజాన్, మెటా తదితర టెక్ కంపెనీలు ఇలాంటి ప్యాకేజీలు ఆఫర్ చేస్తున్నాయి.

News February 11, 2026

సంక్రాంతి బరిలో మరో హీరో?

image

చాన్నాళ్లుగా హిట్ కోసం ఎదురుచూస్తున్న నితిన్ వచ్చే సంక్రాంతికి అదృష్టం పరీక్షించుకోనున్నట్లు తెలుస్తోంది. ‘ఆయ్’ ఫేమ్ అంజి డైరెక్షన్‌లో మూవీని ఓకే చేసినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. టైటిల్‌తోనే పండుగ వైబ్ వచ్చేలా ‘సంక్రాంతి శుభాకాంక్షలు’ అనే పేరును లాక్ చేసినట్లు చర్చించుకుంటున్నాయి. అటు చిరు, బాలయ్య, వెంకీ, నాగ్‌తో పాటు శర్వానంద్, తేజా సజ్జ మూవీలు సంక్రాంతికి రిలీజ్ అవుతాయని టీటౌన్ వర్గాల మాట.