News February 9, 2025

16 నుంచి పెద్దగట్టు జాతర

image

TG: సూర్యాపేట జిల్లా చివ్వెంల(మ) దురాజ్‌పల్లి లింగమంతులస్వామి జాతరకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 16 నుంచి 20 వరకు ఇది జరగనుంది. మేడారం తర్వాత రెండో అతిపెద్ద జాతరగా పేరుగాంచిన ఈ వేడుకకు ఏపీ, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తమిళనాడు నుంచి లక్షల మంది వస్తారు. అటు జాతరకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

Similar News

News March 28, 2025

ఛార్జీలు పెంపు.. మే 1 నుంచి అమలు

image

ATM ఛార్జీలను పెంచుతున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. నెలవారీ ఉచిత లావాదేవీలు దాటాక ఒక్కో లావాదేవీపై రూ.23 వసూలు చేయనున్నారు. కస్టమర్లు సొంత బ్యాంక్ ఏటీఎంలో నెలకు 5 ట్రాన్సాక్షన్లు ఉచితంగా చేసుకోవచ్చు. ఇతర బ్యాంకుల ఏటీఎంలలో మెట్రో సిటీలు అయితే 5 సార్లు, నాన్-మెట్రో సిటీలు అయితే 3 ట్రాన్సాక్షన్లకు ఛాన్స్ ఉంటుంది. వాటిని మించితే ప్రస్తుతం రూ.21 ఛార్జ్ చేస్తున్నారు. మే 1 నుంచి రూ.23 ఛార్జ్ చేయనున్నారు.

News March 28, 2025

ఏడాదిలో రూ.23,730 పెరిగిన గోల్డ్ ధర

image

దేశంలో బంగారం ధర ఆకాశమే హద్దుగా పెరిగిపోతోంది. గత ఏడాది ఏప్రిల్ 1న ఢిల్లీలో 10 గ్రాముల గోల్డ్ రేటు(24 క్యారెట్లు) రూ.68,420 ఉండగా, ఇవాళ రూ.92,150కి చేరింది. ఏడాదిలో ఏకంగా రూ.23,730 పెరిగింది. <<15912228>>హైదరాబాద్‌లోనూ<<>> స్వచ్ఛమైన పసిడి ధర రూ.90,980 పలుకుతోంది. అంతర్జాతీయ ట్రేడ్ వార్స్ కారణంగా వృద్ధికి ఆటంకం కలుగుతుందనే ఆందోళనలు బంగారానికి డిమాండ్ పెంచుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

News March 28, 2025

31న ‘అర్జున్ S/O వైజయంతి’ ఫస్ట్ సింగిల్

image

కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తోన్న ‘అర్జున్ S/O వైజయంతి’ ఫస్ట్ సింగిల్‌ను ఈ నెల 31న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ‘నాయాల్ది’ అంటూ సాగే ఈ పాట పోస్టర్‌ను SMలో షేర్ చేశారు. ఈ చిత్రంలో కళ్యాణ్ తల్లిగా, పోలీస్ ఆఫీసర్‌గా విజయశాంతి కీలకపాత్ర పోషిస్తుండగా, సయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. అజనీశ్ లోక్‌నాథ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ ఆకట్టుకున్న విషయం తెలిసిందే.

error: Content is protected !!