News July 10, 2024
త్వరలో పెండింగ్ మెస్ ఛార్జీలు విడుదల: స్వామి

AP: సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాలకు పెండింగ్ బకాయిలు త్వరలో విడుదల చేస్తామని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి ప్రకటించారు. మెస్ ఛార్జీలు 10 నెలలుగా పెండింగ్లో ఉన్నాయని విద్యార్థి సంఘాల నేతలు మంత్రి దృష్టికి తెచ్చారు. ఏ విద్యార్థికి లోటు లేకుండా చూస్తామని మంత్రి ఈ సందర్భంగా వారికి హామీ ఇచ్చారు. త్వరలోనే ఖాళీలు భర్తీ చేసి సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లకు పూర్వవైభవం తెస్తామని వెల్లడించారు.
Similar News
News December 21, 2025
NLCIL 575పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్(<
News December 21, 2025
రేషన్ లబ్ధిదారుల కోసం ‘T-రేషన్’ యాప్

TG: రేషన్ లబ్ధిదారుల కోసం ప్రభుత్వం ‘T-రేషన్’ యాప్ తీసుకొచ్చింది. కార్డు యాక్టీవ్లో ఉందా? ఆధార్తో లింక్ అయిందా? మీ రేషన్ డీలర్, షాప్ నంబర్, లొకేషన్, రేషన్ కోటా, ఇప్పటివరకు ఎంత అందుకున్నారు వంటి వివరాలు ఈ యాప్లో చెక్ చేసుకోవచ్చు. వివరాలన్నీ తెలుగులో అందుబాటులో ఉంటాయి. ప్లేస్టోర్ నుంచి యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాగా ప్రభుత్వం ఇటీవల మీసేవా వాట్సాప్, యూరియా యాప్నూ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.
News December 21, 2025
పవన్కు భయపడే వారు ఎవరూ లేరు: పేర్ని నాని

AP: పవన్ కళ్యాణ్ <<18621637>>వ్యాఖ్యలపై<<>> YCP నేత, మాజీమంత్రి పేర్ని నాని తీవ్రస్థాయిలో స్పందించారు. పవన్ మాటలు సినిమా డైలాగుల్లా ఉన్నాయని, భయపడే వారు ఎవరూ లేరన్నారు. కూటమి MLAలు ఉత్తరాంధ్రలో దోచుకుంటున్నారని ఆరోపించారు. దమ్ముంటే పవన్ తన ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయాలని సవాల్ విసిరారు. మెడికల్ కాలేజీలను దోచుకోవాలని చూస్తే ఊరుకునేది లేదని తమ ప్రభుత్వం వచ్చాక జైలుకు పంపుతామని హెచ్చరించారు.


