News March 31, 2024

యుద్ధప్రాతిపదికన పెన్షన్లు పంపిణీ చేయాలి: అచ్చెన్నాయుడు

image

AP: సచివాలయ సిబ్బంది, ఇతర ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఒకటో తేదీనే యుద్ధప్రాతిపదికన పెన్షన్లు పంపిణీ చేయాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. వాలంటీర్లను వైసీపీ ప్రచారానికి వాడుకోవడం వల్లే వారిని పింఛన్ల పంపిణీకి దూరంగా ఉంచాలని ఈసీ ఆదేశించిందన్నారు. వారు సస్పెన్షన్‌కు గురి కావడానికి సీఎం జగన్ కారణమయ్యారని విమర్శించారు.

Similar News

News April 20, 2025

చంద్రబాబుకు YS జగన్ బర్త్‌డే విషెస్

image

AP: ముఖ్యమంత్రి చంద్రబాబుకు మాజీ CM వైఎస్ జగన్‌ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు. మీరు ప్రశాంతమైన, ఆరోగ్యకరమైన, దీర్ఘాయుష్షుతో జీవించాలని కోరుకుంటున్నాను’ అని Xలో పోస్ట్ చేశారు. అటు కేంద్రమంత్రులు, మంత్రులు చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు.

News April 20, 2025

స్వల్పంగా తగ్గిన చికెన్ ధరలు

image

రెండు తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్‌లో కిలో స్కిన్‌లెస్ చికెన్ ధర రూ.220గా ఉంది. విజయవాడ, ఖమ్మంలో స్కిన్‌లెస్ రూ.220 నుంచి రూ.230 వరకు పలుకుతోంది. గత వారం కిలో చికెన్ ధర రూ.260 వరకు అమ్మారు. అలాగే కరీంనగర్‌లో రూ.220-240 వరకు పలుకుతోంది. కాకినాడ, విశాఖపట్నంలోనూ రూ.220-240 వరకు ఉంది. చిత్తూరులో కిలో రూ.160-170గా ఉంది.

News April 20, 2025

దూబే వ్యాఖ్యలతో బీజేపీకి సంబంధం లేదు: నడ్డా

image

సుప్రీంకోర్టు మత విద్వేషాలను రెచ్చగొడుతోందన్న బీజేపీ ఎంపీ <<16152959>>నిశికాంత్ దూబే వ్యాఖ్యలను<<>> ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఖండించారు. అవి ఆయన వ్యక్తిగత వ్యాఖ్యలని, వాటితో పార్టీకి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఆ కామెంట్లను బీజేపీ ఎప్పుడూ అంగీకరించదని, మద్దతివ్వదని తేల్చి చెప్పారు. సుప్రీంకోర్టును తాము గౌరవిస్తామని ట్వీట్ చేశారు.

error: Content is protected !!