News June 13, 2024
ప్రజలు చరిత్రాత్మక తీర్పు ఇచ్చారు: CM చంద్రబాబు

ఏపీ చరిత్రలో 93% స్ట్రైకింగ్ రేట్ విజయం ఎప్పుడూ రాలేదని CM చంద్రబాబు అన్నారు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మాట్లాడారు. ‘ప్రజలు చరిత్రాత్మక తీర్పు ఇచ్చారు. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో విజయం సాధించాం. పేదరికం లేని సమాజాన్ని నిర్మించడమే మా లక్ష్యం’ అని వ్యాఖ్యానించారు. 2003లో అలిపిరి వద్ద జరిగిన క్లేమోర్ మైన్స్ దాడి నుంచి తనను వెంకటేశ్వరుడే రక్షించారని పేర్కొన్నారు.
Similar News
News January 26, 2026
మంత్రులు భేటీ అయితే తప్పేముంది: మహేశ్

TG: నలుగురు మంత్రులు అత్యవసరంగా <<18968187>>సమావేశమయ్యారనే<<>> వార్తలపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. సీఎం విదేశాల్లో ఉన్నప్పుడు పరిపాలనా అంశంలో మంత్రులు భేటీ అయితే తప్పేమీ లేదన్నారు. డిప్యూటీ సీఎం భట్టి ఈ విషయంగానే సమావేశం నిర్వహించినట్లు భావిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై సీఎం రేవంత్ విదేశాల నుంచి వచ్చాక హైకమాండ్తో చర్చిస్తామని తెలిపారు.
News January 26, 2026
పాక్ను ఇండియన్స్ ఉతికి ఆరేస్తారు.. T20 WCపై మాజీ క్రికెటర్ వ్యాఖ్యలు

ప్రస్తుతం T20ల్లో టీమ్ ఇండియా ఫామ్ను చూసి ఆడటానికి ఏ జట్టైనా భయపడుతుందని మాజీ క్రికెటర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ అన్నారు. ఇలాంటి బాదుడును తానెప్పుడూ చూడలేదంటూ న్యూజిలాండ్ సిరీస్లో ఇండియన్ ప్లేయర్స్ విధ్వంసకర బ్యాటింగ్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పాక్ T20 WCకు రాకపోవడమే మంచిదని.. లేదంటే ఉతికి ఆరేస్తారని సరదాగా అన్నారు. కొలంబోలో సిక్స్ కొడితే మద్రాస్లో పడుతుందంటూ ఫన్నీగా వ్యాఖ్యానించారు.
News January 26, 2026
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై ప్రధానికి ధర్మాన లేఖ

AP: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై PM మోదీకి మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు లేఖ రాశారు. భూమి రికార్డులను ఆధునికీకరించాలని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా YCP చట్టం తెచ్చినట్లు వివరించారు. CBN ప్రభుత్వం దాన్ని రద్దు చేసిందన్నారు. నీతి ఆయోగ్ ప్రతిపాదించిన ముసాయిదా బిల్లును అన్ని రాష్ట్రాలు చట్టం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు CMలతో సమావేశమై చర్చించాలని సూచించారు.


