News June 13, 2024

ప్రజలు చరిత్రాత్మక తీర్పు ఇచ్చారు: CM చంద్రబాబు

image

ఏపీ చరిత్రలో 93% స్ట్రైకింగ్ రేట్ విజయం ఎప్పుడూ రాలేదని CM చంద్రబాబు అన్నారు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మాట్లాడారు. ‘ప్రజలు చరిత్రాత్మక తీర్పు ఇచ్చారు. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో విజయం సాధించాం. పేదరికం లేని సమాజాన్ని నిర్మించడమే మా లక్ష్యం’ అని వ్యాఖ్యానించారు. 2003లో అలిపిరి వద్ద జరిగిన క్లేమోర్ మైన్స్ దాడి నుంచి తనను వెంకటేశ్వరుడే రక్షించారని పేర్కొన్నారు.

Similar News

News November 20, 2025

చట్టప్రకారమే KTRపై చర్యలు: మహేశ్ గౌడ్

image

TG: ఫార్ములా ఈ-కార్ రేస్‌లో KTR తప్పు చేశారని TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. ‘BRS హయాంలో జరిగిన ప్రజాధన దోపిడీని సరిచేస్తుందనే కాంగ్రెస్‌కు అధికారమిచ్చారు. అందుకే అన్నింటిపై కమిషన్లు వేశాం. రూల్స్ అతిక్రమించి KTR ప్రభుత్వ సొమ్మును ప్రైవేటు వ్యక్తికి పంపారని కమిషన్ రిపోర్టులో ఉంది. అప్పటి మంత్రిగా ఆయన తప్పు ఒప్పుకోవాలి. గవర్నర్ అనుమతించారు కాబట్టి చట్టం తనపని తాను చేస్తుంది’ అని తెలిపారు.

News November 20, 2025

పెళ్లికి ముందు రక్తపరీక్షలు ఎందుకంటే?

image

ఆరోగ్యకరమైన వైవాహిక జీవితం కోసం, పుట్టబోయే పిల్లల భవిష్యత్తు కోసం పెళ్లికి ముందే జంటలు కొన్ని రక్త పరీక్షలు చేయించుకోవాలంటున్నారు నిపుణులు. తలసేమియా, సికిల్ సెల్ అనీమియా, హెచ్‌ఐవీ, హెపటైటిస్ B, C, సిఫిలిస్ వంటి ఇన్ఫెక్షన్లు, Rh ఫ్యాక్టర్‌ను గుర్తించడానికి రక్త పరీక్షలు కీలకం. భవిష్యత్తును ఆరోగ్యకరంగా, సంతోషంగా ప్లాన్ చేసుకోవడానికి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ముఖ్యమని ప్రతిఒక్కరూ గుర్తించాలి.

News November 20, 2025

మనీలాండరింగ్ కేసులో రాబర్ట్ వాద్రాపై ఈడీ ఛార్జ్‌షీట్

image

కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ భర్త, వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రాపై ఈడీ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. యూకే కేంద్రంగా పనిచేస్తున్న డిఫెన్స్ డీలర్‌ సంజయ్‌ భండారీపై నమోదైన మనీలాండరింగ్ కేసులో వాద్రాపై PMLA కింద ఫిర్యాదు చేసింది. ఆ ఛార్జ్‌షీట్‌ను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టుకు అందజేసింది. కాగా, ఈ ఏడాది జులైలోనే వాద్రా స్టేట్మెంట్‌ రికార్డు చేసినట్టు ఈడీ వెల్లడించింది.