News April 18, 2024

ప్రజలు మార్పు కోరుకుంటున్నారు: సచిన్ పైలట్

image

లోక్‌సభ ఎన్నికల్లో 400 సీట్లు గెలుస్తామని BJP ఎక్కువ ఊహించుకుంటోందని రాజస్థాన్ కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ విమర్శించారు. బీజేపీ వాళ్లు చెప్పే మాటలకు వాస్తవ పరిస్థితులకు చాలా తేడా ఉందని అన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని.. కూటమి ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈవీఎంల టాంపరింగ్ లేకుండా ఎన్నికలు సజావుగా జరిగితే బీజేపీకి 180 సీట్లు కూడా రావని అంతకుముందు ప్రియాంకా గాంధీ పేర్కొన్నారు.

Similar News

News October 13, 2024

అల్పపీడనం.. భారీ నుంచి అతిభారీ వర్షాలు

image

AP: దక్షిణ బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని APSDMA తెలిపింది. అది 48 గంటల్లో బలపడి ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరాలవైపు కదిలే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో బుధ, గురువారాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. అటు తమిళనాడులోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు.

News October 13, 2024

త్వరలో మరో పార్టీలో చేరుతా: రాపాక

image

AP: వైసీపీని వీడనున్నట్లు రాజోలు మాజీ ఎమ్మెల్యే <<14347126>>రాపాక<<>> వరప్రసాద్ తెలిపారు. వైసీపీలో తనకు అన్యాయం జరిగిందని వాపోయారు. ‘గతంలో పార్టీ చెప్పిన ప్రతి కార్యక్రమాన్ని నూరు శాతం నిర్వహించా. అయినా ఎన్నికల్లో నాకు టికెట్ ఇవ్వలేదు. TDP నుంచి వచ్చిన గొల్లపల్లి సూర్యారావుకు ఇచ్చారు. ఇప్పుడు ఆయననే ఇన్‌ఛార్జ్‌గానూ నియమించారు. ఇష్టం లేకపోయినా MPగా పోటీ చేశా. త్వరలో మరో పార్టీలో చేరుతా’ అని మీడియాకు వెల్లడించారు.

News October 13, 2024

విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్!

image

ఈ దీపావ‌ళికి దేశీయ మార్గాల్లో విమాన‌ టికెట్ల ధ‌ర‌లు సగటున 20-25% త‌గ్గిన‌ట్టు ప‌లు సంస్థ‌లు చెబుతున్నాయి. 30 రోజుల అడ్వాన్స్ బుకింగ్‌పై వ‌న్ వేలో ఈ స‌గ‌టు త‌గ్గింపు ధ‌ర‌లు వ‌ర్తిస్తున్నాయి. పెరిగిన విమానాల సంఖ్య‌, ఇంధ‌న ధ‌ర‌ల తగ్గింపు వల్ల ధ‌ర‌లు దిగొచ్చిన‌ట్టు అంచ‌నా వేస్తున్నాయి. HYD-ఢిల్లీ మార్గాల్లో 32% ధ‌ర‌లు త‌గ్గిన‌ట్టు విశ్లేషిస్తున్నాయి. గత ఏడాది కంటే ధరలు తగ్గినట్టు సంస్థలు పేర్కొన్నాయి.