News April 18, 2024
ప్రజలు మార్పు కోరుకుంటున్నారు: సచిన్ పైలట్

లోక్సభ ఎన్నికల్లో 400 సీట్లు గెలుస్తామని BJP ఎక్కువ ఊహించుకుంటోందని రాజస్థాన్ కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ విమర్శించారు. బీజేపీ వాళ్లు చెప్పే మాటలకు వాస్తవ పరిస్థితులకు చాలా తేడా ఉందని అన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని.. కూటమి ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈవీఎంల టాంపరింగ్ లేకుండా ఎన్నికలు సజావుగా జరిగితే బీజేపీకి 180 సీట్లు కూడా రావని అంతకుముందు ప్రియాంకా గాంధీ పేర్కొన్నారు.
Similar News
News January 31, 2026
బాలికల కోసం స్కాలర్షిప్.. నేడే చివరి తేదీ

ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన మహిళా విద్యార్థులు విద్యను కొనసాగించేందుకు అజీమ్ ప్రేమ్జీ స్కాలర్షిప్ 2025 సాయపడనుంది. దీని ద్వారా ఏటా రూ.30,000 ఆర్థిక సహాయం అందిస్తారు. 2025–26 విద్యా సంవత్సరం నుంచి ఫస్ట్ ఇయర్ అండర్గ్రాడ్యుయేట్, డిప్లొమా కోర్సుల్లో చేరిన విద్యార్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుకు చివరి తేదీ 31 జనవరి 2026. వెబ్సైట్: <
News January 31, 2026
గుళ్లు కూల్చిన గజినీపై పొగడ్తలా: BJP

సోమనాథ్ ఆలయాన్ని ధ్వంసం చేసిన గజినీ మహమ్మద్ను మాజీ ఉపరాష్ట్రపతి, కాంగ్రెస్ నేత హమీద్ అన్సారీ పొగడటంపై BJP మండిపడింది. ‘INC హిందూ ద్వేషులను ప్రశంసిస్తుంది. గజినీ, ఔరంగజేబు లాంటి హిందూ ద్వేషుల నేరాలను, అకృత్యాలను కప్పిపుచ్చుతుంది. హిందూ వ్యతిరేక శక్తులను కీర్తిస్తుంది’ అని విమర్శించింది. విదేశీ ఆక్రమణదారుల పట్ల అన్సారీకి ఉన్న అభిమానం అతని సిక్ మైండ్సెట్కు నిదర్శనమని దుయ్యబట్టింది.
News January 31, 2026
ముగ్గురు అమ్మాయిలతో చాహల్.. మీమ్స్ వైరల్

ధనశ్రీతో విడాకులు, మహ్వాశ్తో బ్రేకప్ తర్వాత షెఫాలీతో చాహల్ రిలేషన్లో ఉన్నట్లు <<18957407>>వార్తలు వస్తున్న<<>> విషయం తెలిసిందే. దీంతో ఆయనపై పలువురు మీమ్స్ను క్రియేట్ చేసి SMలో షేర్ చేస్తున్నారు. బాలీవుడ్ మూవీ ‘కిస్ కిస్కో ప్యార్ కరూ’ తరహాలో ముగ్గురు లేడీస్తో చాహల్ ఉన్నట్లు AI ఫొటోలు వైరలవుతున్నాయి. వీటిపై చాహల్ స్పందిస్తూ ‘మరో ముగ్గురిని వదిలేశారు. నెక్ట్స్ టైమ్ లోతుగా రీసెర్చ్ చెయ్యండి’ అని కామెంట్ చేశారు.


