News January 2, 2025
పెంపుడు కుక్క మృతి.. దాని చైన్తోనే ఉరేసుకున్న యజమాని
బెంగళూరులో విషాదం చోటు చేసుకుంది. తన పెంపుడు కుక్క మరణాన్ని తట్టుకోలేక రాజశేఖర్(33) ఆత్మహత్య చేసుకున్నాడు. నగరంలోని హెగ్గడదేవనపురలో ఉండే ఇతను కొంత కాలంగా జర్మన్ షెపర్డ్ జాతికి చెందిన కుక్కకు బౌన్సీ అని పేరు పెట్టి పెంచుకుంటున్నారు. మంగళవారం అది అనారోగ్యంతో చనిపోగా ఖననం చేశారు. అనంతరం ఇంటికి వచ్చిన రాజశేఖర్.. కుక్కకు ఉపయోగించిన చైన్తోనే ఉరేసుకొని చనిపోయాడు.
Similar News
News January 22, 2025
9 ఏళ్లకే పెళ్లిని అనుమతించేలా చట్టం తెచ్చారు
ఆచారాలకు ప్రాధాన్యత అంటూ కొత్త చట్టాలతో విమర్శల పాలవుతున్న ఇరాక్ పాలకులు మరో వివాదాస్పద బిల్ పాస్ చేశారు. దీంతో గతంలో 18సం.గా ఉన్న అమ్మాయిల కనీస వివాహ వయస్సు నిబంధన మారనుంది. మతంలోని ఒక తెగ/వర్గం నిబంధనల ప్రకారం పెళ్లి చేయొచ్చు. అక్కడ షియత్లు ఎక్కువగా అనుసరించే జాఫరీ ఇస్లామిక్ లా ప్రకారం 9 ఏళ్ల బాలికకూ పెళ్లి చేయొచ్చు. దీంతో మహిళల జీవితాలు ప్రమాదంలో పడతాయని ప్రతిపక్షం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
News January 22, 2025
Stock Markets: రిలీఫ్ ర్యాలీతో ఇన్వెస్టర్లు ఖుష్..
స్టాక్మార్కెట్లు నేడు లాభాల్లో ముగిశాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడం, విలువైన షేర్లు ఆకర్షణీయమైన ధరల్లో లభిస్తుండటంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లు చేపట్టారు. నిఫ్టీ 23,155 (+130), సెన్సెక్స్ 76,404 (+566) వద్ద క్లోజయ్యాయి. IT, ఫార్మా, హెల్త్కేర్, ఫైనాన్స్ షేర్లు పుంజుకున్నాయి. రియాల్టి షేర్లు రక్తమోడాయి. విప్రో, ఇన్ఫీ, టీసీఎస్, టెక్ఎం, హెచ్డీఎఫ్సీ బ్యాంకు టాప్ గెయినర్స్.
News January 22, 2025
రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం?
AP: కూటమి సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెల 1 నుంచి భూముల రిజిస్ట్రేషన్ ధరలు పెంచాలని భావిస్తున్నట్లు సమాచారం. దీనిపై ఇప్పటికే అధికారులు, ప్రజాప్రతినిధులతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. మార్కెట్ విలువ, బుక్ వాల్యూ మధ్య తేడాలున్నాయని, వీటిని సరిచేసి రిజిస్ట్రేషన్ ధరలు పెంచుతారని సమాచారం. దీనిపై సీఎం చంద్రబాబు త్వరలోనే స్పష్టత ఇస్తారని వార్తలు వస్తున్నాయి.