News March 23, 2024

టీడీపీ వర్క్‌షాప్‌లో ఫోన్ ట్యాపింగ్: బొండా ఉమా

image

AP: చంద్రబాబు ఇవాళ నిర్వహించిన టీడీపీ వర్క్‌షాప్‌లో ఫోన్ ట్యాపింగ్ చేశారని బొండా ఉమా ఆరోపించారు. ట్యాపింగ్ చేస్తున్నాడంటూ ఓ వ్యక్తిని పట్టుకున్నారు. విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని ఫోన్‌ను ట్యాప్ చేస్తున్నట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని తెలిపారు. ఐజీ పంపితేనే వచ్చానని పట్టుబడిన కానిస్టేబుల్ చెప్పాడని, ఉన్నతాధికారి సీతారామాంజనేయులు నేతృత్వంలో ట్యాపింగ్ జరుగుతోందని బొండా ఉమా ఆరోపించారు.

Similar News

News April 12, 2026

చేపను ఇవ్వడం కాదు పట్టడం నేర్పాలి.. ఏమంటారు?

image

దేశంలో ఉచిత పథకాల వల్ల ప్రజలు బద్ధకస్థులు అవుతున్నారని, వాటిని రద్దు చేయాలని కొంతమంది ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సైతం అదే మాట చెప్పారు. ‘ప్రభుత్వం ఉచితాలు రద్దు చేసి విద్య, వైద్యంపై దృష్టి పెట్టాలి. పార్టీలు ఇలాంటి వాగ్దానాలు చేసినప్పుడు వాటి బడ్జెట్ ఎంత? ఎలా నిధులు సమకూరుస్తారు? అని ప్రజలు అడగాలి’ అని ఓ కార్యక్రమంలో అన్నారు.

News April 12, 2026

11AMకు ఇంటర్ ఫలితాలు.. Way2Newsలో వేగంగా..

image

TG: ఇంటర్ విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న రిజల్ట్స్ ఇవాళ విడుదల కాబోతున్నాయి. ఉ.11 గం.కు ప్రభుత్వ సలహాదారు K.కేశవరావు ఫలితాలు రిలీజ్ చేయబోతున్నారు. Way2Newsలో అత్యంత వేగంగా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. యాప్ ఓపెన్ చేయగానే కనిపించే స్క్రీన్‌లో హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేస్తే చాలు. ఎలాంటి యాడ్స్ లేకుండా క్షణాల్లో మార్కులు వచ్చేస్తాయి. వాటిని ఈజీగా మీ సన్నిహితులకు షేర్ చేసుకోవచ్చు.

News April 12, 2026

మార్నింగ్ నుంచి హుషారుగా ఉండాలంటే..

image

*నిద్ర లేవగానే ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీళ్లు తాగడం వల్ల శరీరం ఉత్తేజమవుతుంది. జీర్ణ సమస్యలు తొలగుతాయి.
*రోజూ 20-30 ని.ల పాటు యోగా, వాకింగ్ చేయడం వల్ల రక్తప్రసరణ పెరుగుతుంది. మానసిక ప్రశాంతత చేకూరుతుంది.
*పౌష్టికాహారంతో కూడిన అల్పాహారం తీసుకుంటే శక్తి లభిస్తుంది. నూనె పదార్థాలకు దూరంగా ఉండాలి.
*ఎండలో కాసేపు గడపడం వల్ల విటమిన్ D అందుతుంది.
*పాజిటివ్‌గా ఆలోచించడం మొదలుపెట్టాలి.