News April 27, 2024
గూగుల్లో 20 ఏళ్లు పూర్తి చేసుకున్న పిచాయ్

గూగుల్ CEO సుందర్ పిచాయ్ ఆ కంపెనీలో 20 ఏళ్లు పూర్తిచేసుకున్నారు. ప్రొడక్ట్ మేనేజర్గా ఆ సంస్థలో చేరిన ఆయన ఇప్పుడు CEOగా పనిచేస్తున్నారు. ‘ఏప్రిల్ 26, 2004 Googleలో నా మొదటి రోజు. అప్పటి నుంచి టెక్నాలజీ, మా ప్రొడక్ట్స్ను వాడే వ్యక్తుల సంఖ్య, నా జుట్టు ఇలా చాలా మారాయి. కానీ ఈ కంపెనీలో పని చేయడం వల్ల పొందే థ్రిల్ మాత్రం మారలేదు. నేనింకా లక్కీ అని ఫీల్ అవుతున్నా’ అని ఇన్స్టాలో పోస్ట్ పెట్టారు.
Similar News
News November 23, 2025
బోస్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<
News November 23, 2025
శ్రీవారి ఆలయంలో పంచబేర వైభవం

తిరుమల శ్రీవారి ఆలయ గర్భగుడిలో 5 ప్రధానమైన మూర్తులు కొలువై ఉన్నాయి. ప్రధానమైనది, స్వయంవ్యక్త మూర్తి అయినది ధ్రువబేరం. నిత్యం భోగాలను పొందే మూర్తి భోగ శ్రీనివాసుడు ‘కౌతుకబేరం’. ఉగ్ర రూపంలో ఉండే స్వామి ఉగ్ర శ్రీనివాసుడు ‘స్నపన బేరం’. రోజువారీ కొలువు కార్యక్రమాలలో పాల్గొనే మూర్తి కొలువు శ్రీనివాసుడు ‘బలిబేరం’. ఉత్సవాల కోసం ఊరేగింపుగా వెళ్లే మూర్తి మలయప్పస్వామి ‘ఉత్సవబేరం’. <<-se>>#VINAROBHAGYAMU<<>>
News November 23, 2025
రేపు వాయుగుండం.. 48 గంటల్లో తుఫాన్

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మలక్కా, సౌత్ అండమాన్ మీదుగా కొనసాగుతోందని APSDMA తెలిపింది. ఇది వాయవ్యదిశగా కదులుతూ రేపటికల్లా వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. అదేవిధంగా కొనసాగుతూ 48 గంటల్లో తుఫాన్గా బలపడే ఛాన్స్ ఉందని హెచ్చరించింది. దీని ప్రభావంతో ఈ నెల 28 నుంచి డిసెంబర్ 1 వరకు ఏపీలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే పేర్కొన్న సంగతి తెలిసిందే.


